Publish Date:May 31, 2026
అహ్మదాబాద్లో ఆదివారం (మే31) రాత్రి జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ లో గుజరాత్ జట్టుపై సునాయాస విజయంతో టోర్నీ చాంప్ గా ఆర్సీబీ నిలిచింది. అయినా ప్రజంటేషన్ సెర్మనీలో సెంటరాఫ్ అట్రాక్షన్ మాత్రం 15 ఏళ్ల అద్భుతం, రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ బాస్ బేబీ వైభవ్ సూర్యవంశీదే.
15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ సృష్టించిన ప్రభంజనం క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. మైదానంలోకి దిగిన ప్రతి సందర్భంలోనూ.. సీనియర్ బౌలర్లను సైతం వణికించిన ఈ యువ సంచలనం.. ఐపీఎల్ 2026 సీజన్లోని ప్రధాన వ్యక్తిగత అవార్డులన్నింటినీ కొల్లగొట్టాడు. ఈ టోర్నమెంట్లో అసాధారణమైన బ్యాటింగ్ నైపుణ్యంతో ఏకంగా 776 పరుగులు సాధించి, అత్యధిక పరుగుల బ్యాటర్ గా ప్రతిష్టాత్మక ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అలాగే.. టోర్నీలోనే అత్యంత విలువైన ఆటగాడిగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డుతో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ పురస్కారాన్ని కూడా వైభవ్ దక్కించుకున్నాడు.
అదే విధంగా సీజన్లో ఏకంగా 237.31 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ప్రత్యర్థి బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపిస్తూ.. రికార్డు స్థాయిలో మొత్తం 72 సిక్సర్లు బాది సూపర్ సిక్సెస్ అవార్డును దక్కించుకున్నాడు. ఒకే ఒక ఐపీఎల్ సీజన్లో మొత్తం ఐదు ప్రధాన అవార్డులను గెలుచుకుని, ఈ యువ కెరటం ప్రపంచ క్రికెట్లో ఒక కొత్త సూపర్ స్టార్గా అవతరించాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/center-of-attraction-was-undoubtedly-vaibhav-36-221383.html
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్ స్టేజ్కు చేరాయి.
మాజీ మంత్రి, వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలంటూ ఆయన కుమార్తె సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)కి చెందిన ఇన్స్పెక్టర్ బి. మహేందర్కు సంబంధించిన ఎసీబీ (ACB) రిమాండ్ కాపీలో పలు సంచలన అంశాలు వెలుగుచూశాయి.
తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థను మరింత బలో పేతం చేసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్లోని SMS-1 విభాగంలో భారీ పేలుడు సంభవించింది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో అత్యంత విచిత్రమైన, సమాజాన్ని నివ్వెరపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్లో ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) బృందం మృగశిర కార్తి రోజున భారీ ఆపరేషన్ నిర్వహించారు.
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బీటెక్ విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
నేటి ఆధునిక కాలంలో ఐదెంకల జీతం వస్తే జీవితం ఎంతో విలాసవంతంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు.
ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం చట్టప్రకారం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్ 2024లో అల్వాల్కు చెందిన మేఘనను వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తడంతో పరిస్థితి దిగజా రింది. రోజురోజుకీ గొడవలు పెరిగిపోతూ ఉండడంతో మేఘన ఈ క్రమంలో జాకబ్తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.