వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు విచారణ

Publish Date:Jun 8, 2026

Advertisement

 

మాజీ మంత్రి, వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు  చేపట్టాలంటూ ఆయన కుమార్తె సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా నిందితుల తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేస్తూ, ఈ కేసులో సీబీఐ ఇప్పటికే విస్తృతంగా దర్యాప్తు నిర్వహించి ఛార్జ్‌ షీట్లు దాఖలు చేసిందని, అందువల్ల మరోసారి తదుపరి దర్యాప్తు అవసరం లేదని కోర్టుకు తెలిపారు. కేసులో అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగానే విచారణ కొనసాగించాలని వారు వాదించారు. మరోవైపు, సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, గతంలో జరిగిన దర్యాప్తులో కొన్ని కీలక అంశాలు పూర్తిస్థాయిలో పరిశీలించబడలేదని పేర్కొన్నారు. 

ఇటీవల సీబీఐ దాఖలు చేసిన అదనపు ఛార్జ్‌షీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోకుండా, కేసులో మిగిలిన అంశాలపై మరింత లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని వాదించారు.ఇటీవల సీబీఐ, కిరణ్ యాదవ్ మరియు చైతన్య రెడ్డి పాత్రపై విచారణ జరిపిన అనంతరం, వారి ప్రమేయానికి తగిన ఆధారాలు లభించలేదని కోర్టుకు నివేదించిన విషయం కూడా విచారణలో ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో సునీత తరఫు న్యాయవాదులు మరిన్ని కోణాల్లో దర్యాప్తు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇరు పక్షాల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు, తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున తదుపరి దర్యాప్తు అవసరమా కాదా అనే అంశంపై మరిన్ని వాదనలు జరిగే అవకాశం ఉంది.ఈ కేసు ఇప్పటికే అనేక మలుపులు తిరిగిన నేపథ్యంలో, కోర్టు తీసుకునే తదుపరి నిర్ణయం కేసు విచారణపై కీలక ప్రభావం చూపే అవకాశముంది.

By
en-us Political News

  
 మొజాంబిక్ దేశ పతాకంతో సముద్రంలో పయనిస్తున్న  దిశ   ఎల్‌పీజీ  ట్యాంకర్ లో 28 మంది ఇండియన్  నావికులు విధులు నిర్వర్తిస్తున్నారు. విశ్వస నీయంగా అందిన సమాచారం మేరకు ఈ క్షిపణి దాడి నుంచి నౌకలోని 28 మంది భారత సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
కేవలం వారం రోజుల వ్యవధిలోనే భారతీయ నావికులు దాడుల్లో ప్రాణాలు కోల్పోవడం ఇది రెండోసారి కావడం ఆందోళన కలిగిస్తున్నది.
మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన కుమారుడు రాజీవ్ సహా 11 మందిపై గృహ హింస, వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. కోడలు మేఘన ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించి చేసిన సంచలన చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ తెలంగాణ భవన్‌
మందుల సామేల్ వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి కౌంటర్..!
దేశంలో ప్రస్తుతం నిరుద్యోగ యువత విద్యార్థుల భవిష్యత్తు తీవ్ర గందరగోళంలో పడింది.
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ కీలక అడుగు వేసింది.
పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత మళ్లీ తీవ్ర రూపం దాల్చింది.
నా నియోజకవర్గానికి జోలికి వస్తే మీకు మర్యాద దక్కదు.. ఘాటు హెచ్చరిక..!
ఢిల్లీలోని జంతర్ మంతర్ వీధులు ఈరోజు కేవలం నిరసనలకు వేదికగా మాత్రమే లేవు
చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి ..పేరెంట్-టీచర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీత రెడ్డికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
చివరికి మర్డర్ చేయించింది కూడా సవతి తల్లే..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.