మాజీ మంత్రి, వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలంటూ ఆయన కుమార్తె సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా నిందితుల తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేస్తూ, ఈ కేసులో సీబీఐ ఇప్పటికే విస్తృతంగా దర్యాప్తు నిర్వహించి ఛార్జ్ షీట్లు దాఖలు చేసిందని, అందువల్ల మరోసారి తదుపరి దర్యాప్తు అవసరం లేదని కోర్టుకు తెలిపారు. కేసులో అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగానే విచారణ కొనసాగించాలని వారు వాదించారు. మరోవైపు, సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, గతంలో జరిగిన దర్యాప్తులో కొన్ని కీలక అంశాలు పూర్తిస్థాయిలో పరిశీలించబడలేదని పేర్కొన్నారు.
ఇటీవల సీబీఐ దాఖలు చేసిన అదనపు ఛార్జ్షీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకోకుండా, కేసులో మిగిలిన అంశాలపై మరింత లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని వాదించారు.ఇటీవల సీబీఐ, కిరణ్ యాదవ్ మరియు చైతన్య రెడ్డి పాత్రపై విచారణ జరిపిన అనంతరం, వారి ప్రమేయానికి తగిన ఆధారాలు లభించలేదని కోర్టుకు నివేదించిన విషయం కూడా విచారణలో ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో సునీత తరఫు న్యాయవాదులు మరిన్ని కోణాల్లో దర్యాప్తు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇరు పక్షాల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు, తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున తదుపరి దర్యాప్తు అవసరమా కాదా అనే అంశంపై మరిన్ని వాదనలు జరిగే అవకాశం ఉంది.ఈ కేసు ఇప్పటికే అనేక మలుపులు తిరిగిన నేపథ్యంలో, కోర్టు తీసుకునే తదుపరి నిర్ణయం కేసు విచారణపై కీలక ప్రభావం చూపే అవకాశముంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbi-court-hearing-in-viveka-murder-case-36-222281.html
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్ స్టేజ్కు చేరాయి.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)కి చెందిన ఇన్స్పెక్టర్ బి. మహేందర్కు సంబంధించిన ఎసీబీ (ACB) రిమాండ్ కాపీలో పలు సంచలన అంశాలు వెలుగుచూశాయి.
తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థను మరింత బలో పేతం చేసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్లోని SMS-1 విభాగంలో భారీ పేలుడు సంభవించింది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో అత్యంత విచిత్రమైన, సమాజాన్ని నివ్వెరపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్లో ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) బృందం మృగశిర కార్తి రోజున భారీ ఆపరేషన్ నిర్వహించారు.
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బీటెక్ విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
నేటి ఆధునిక కాలంలో ఐదెంకల జీతం వస్తే జీవితం ఎంతో విలాసవంతంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు.
ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం చట్టప్రకారం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్ 2024లో అల్వాల్కు చెందిన మేఘనను వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తడంతో పరిస్థితి దిగజా రింది. రోజురోజుకీ గొడవలు పెరిగిపోతూ ఉండడంతో మేఘన ఈ క్రమంలో జాకబ్తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
గర్భాలయం, అర్థమండపం, మహామండపలతో, కప్పుల వరకు ఉన్న ఆలయం, కాకతీయ వాస్తు శిల్పానికి అర్థం పడుతుందనీ, కప్పురాళ్లు, గోడలు కూలిపోయి, చుట్టూ చెట్లు పొదలు పెరిగి, ఆలయం ఉనికికే ప్రమాదం ఏర్పడిందని, ఆలయాన్ని ఊడదీసి, ఆధునిక పునాదులపై పునర్నిర్మించి, వారసత్వ సంపదగా కాపాడి, భవిష్యత్ తరాలకు అందించాలని గ్రామ ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.