రీజనల్ రింగ్ రోడ్డుకు లైన్ క్లియర్ 

Publish Date:Mar 6, 2021

Advertisement

హైదరాబాద్‌ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ఇప్పటికే జాతీయ రహదారి హోదా ఇచ్చిన ప్రాంతంలో భూసేకరణ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దీంతో రింగ్‌ రోడ్డు నిర్మాణ వ్యవహారం ఇక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చింది. భూసేకరణ అనుమతి ఉత్తర్వులపై కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేయగా... త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు వంద మీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్‌ రింగ్‌ రోడ్డును నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. తొలుత నాలుగు వరుసల రహదారి నిర్మించి... ఆ తరువాత మరో నాలుగు వరుసలు విస్తరిస్తారు. ఎనిమిది వరుసలకు తగినట్లు భూసేకరణ ప్రక్రియను చేపట్టనున్నారు.

ప్రాంతీయ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగం సంగారెడ్డి-నర్సాపూర్‌-తూప్రాన్‌-గజ్వేల్‌-చౌటుప్పల్‌ వరకు నిర్ణయించి 161(ఎ)(ఎ)గా జాతీయ రహదారి నంబరును కేంద్రం కేటాయించింది. ఈ మార్గం 158 కిలోమీటర్లు. దక్షిణ భాగంగా ఉన్న చౌటుప్పల్‌- షాద్‌నగర్‌-సంగారెడ్డి వరకు 182 కిలోమీటర్లకు కూడా అనుమతి ఇచ్చేందుకు కేంద్రం ఇటీవల అంగీకరించింది. దక్షిణ భాగానికి సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపిన కేంద్రం... త్వరలో జాతీయ రహదారి నంబరు కేటాయించి భూసేకరణకు అనుమతి ఇవ్వనుంది.

హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డు ఆవల ప్రాంతీయ రింగ్‌ రోడ్డును నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే నిర్ణయించారు. ఆ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అప్పటి నుంచి ఢిల్లీ-హైదరాబాద్‌ చుట్టూ దస్త్రం తిరుగుతూనే ఉంది. ఒకదశలో కేంద్రం మెలిక పెట్టింది. 500 మీటర్ల మేర భూసేకరణ చేపట్టి.. రహదారి పోను మిగిలిన ప్రాంతాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించుకుని.. ఆ డబ్బుతో ప్రాంతీయ రింగు రోడ్డును నిర్మించుకోవాలని సూచించింది. అంత స్థాయిలో భూసేకరణ చేపట్టడం సాధ్యమయ్యే పని కాదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో.. తాజాగా కేంద్రం వంద మీటర్లకే అనుమతి ఇచ్చింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కార్యాలయానికి కూడా వర్తమానాన్ని పంపినట్లు తెలిసింది. ప్రాంతీయ రింగు రోడ్డును భారతమాల-1 పనుల జాబితాలోనూ కేంద్రం చేర్చింది.

ఉత్తర భాగంగా నిర్మించే 158 కిలోమీటర్ల మార్గం నిర్మాణానికి సుమారు 4,750 ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూ సేకరణకయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా భూసేకరణ చేపడుతుందన్న అంశంపై రహదారి నిర్మాణ వేగం ఆధారపడి ఉంటుంది.

By
en-us Political News

  
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది.
ల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు.
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచాయతీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరంపెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు.
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది.
గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలో నాయకులు, శ్రేణులూ పూర్తిగా డీలా పడ్డాయి. దానికి తోడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వలస వెళ్లిపోయి, ఎలాగో తీరిక చేసుకుని వారానికి ఒక సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చి.. వెడుతున్నారు. దీంతో ఆయన పూర్తిగా పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోయినట్లైందని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరారంటూ బీఆర్ఎస్ అరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలు విన్నారు.
స‌చివాల‌యంలో కేటీఆర్ కి ఇంత నెట్ వ‌ర్క్ ఉందా? అని విస్తుపోయింది. విచారణకు ఆదేశించి.. లీకు వీరులు ఎవరైనా, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలూ జారీ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. ఓ వైపు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూనే, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతూ క్షణం తీరక లేకుండా గడుపుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.