అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి ఒకే.. కేంద్రం తీరే వేరులే!

Publish Date:Jun 27, 2023

Advertisement

ఏపీ రాజధాని అమరావతి విషయంలో రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ స్టాండ్ క్లియర్ కట్ గా ఉంటుంది. రాజధానిగా అమరావతి ఉండేందుకు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డికి సుతరామూ ఇష్టం లేదు. సీఎంగా జగన్ మోహన్ రెడ్డి అమరావతిని అభివృద్ధి చేసినా రాజధాని క్రెడిట్ మాత్రం పునాది రాయి వేసిన చంద్రబాబుకే దక్కుతుంది. ముందు ముందు తరాలు అమరావతి చరిత్ర తీస్తే ముందు పేరు చంద్రబాబుదే వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డికి అసలు ఇష్టం లేదు. అందుకే సవాలక్ష కారణాలు చెప్పి అమరావతిని నాశనం చేస్తున్నారు. వైసీపీ నేతలు సైతం అమరావతి రాజధానిగా ఒప్పుకునే పరిస్థితిలో  లేరు. కోర్టులు ఎన్నిసార్లు చెప్పినా.. అమరావతి రైతులు తమ బాధ ఎన్ని రకాలుగా విన్నవించుకున్నా దున్నపోతు మీద వాన మాదిరి ప్రభుత్వంలో అసలు చలనమే లేదు.

అయితే  ఏపీ రాజధానిగా అమరావతి అంశంపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స్టాండ్ ఏంటన్నది మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు. ఒకవైపు రాజధానిగా అమరావతే ఉండాలని.. అది కూడా ఏకైక రాజధాని అమరావతి మాత్రమే అంటూ బీజేపీ నేతలు ఘంటాపదంగా చెప్తారు. కానీ, అమరావతిని నాశనం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతి కోరినా కేంద్ర ప్రభుత్వం అడిగిన వెంటనే చేసేస్తారు. మా స్టాండ్, మా ఓటు అమరావతికి అంటూనే.. రాజధాని అమరావతి కాకుండా చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి సాయం చేస్తారు. దీంతో బీజేపీ ప్రభుత్వం ఆడే ఈ డబుల్ గేమ్ రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకి దారితీస్తున్నది. ఇప్పటికే పలుమార్పు బీజేపీ ఇలాంటి డబుల్ గేమ్ ఆడుతూ ఏపీ ప్రజలలో చులకన కాగా.. ఇప్పుడు అలాంటిదే మరోసారి తెరమీదకి వచ్చింది.

రాజధాని అమరావతిని చంద్రబాబు తరతరాలకు సంపద సృష్టించే వరల్డ్ క్లాస్ సిటీగా నిర్మించాలనుకుని ఇప్పటికే అక్కడ అందుకు తగిన ప్రాథమిక సౌకర్యాల కల్పన కూడా చేశారు. అయితే జగన్ సర్కార్ ఇప్పుడు అక్కడ పరిపాలనా భవనాలను కాకుండా నివాస గృహాలను నిర్మించాలని, అది కూడా రాజధానేతర  ప్రాంతాల వారికి ఇళ్లను నిర్మించాలని భావిస్తున్నది. ముందుగా ఆర్ 5 జోన్ లో ఈ ఇళ్లకు స్థలాల పట్టాలు ఇస్తూ జీవో కూడా జారీచేసింది. అయితే  ప్రస్తుతం ఈ అనుమతుల వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉండగా ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకూ వెళ్ళింది. జగన్ ప్రభుత్వం ఇచ్చే పట్టాలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని.. తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రత్యేక ప్రయోజనాలు కోరే హక్కు లబ్థిదారులకు ఉండదని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

అయితే కోర్టు పరిధిలో ఉన్న ఈ గృహాల నిర్మాణ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కేంద్రాన్ని అనుమతి కోరగా.. కేంద్రం కూడా రాష్ట్రం అడిగిన వెంటనే అనుమతులు ఇచ్చేసింది. ఆర్ 5 జోన్ లో కట్టాలని భావిస్తున్న 47 వేల ఇళ్లకు కేంద్రంలోని సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ భేటీలో అనుమతులు ఇస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. అమరావతిలో ఇప్పటికే రాజధానేతరులైన 50793 మందికి ఇళ్ల పట్టాల్ని పంపిణీ చేయగా.. వీరిలో 47 వేల మందికి కేంద్రం ఇళ్లు మంజూరుకి అనుమతిచ్చింది.

మిగిలిన ఇళ్ల నిర్మాణానికి కూడా తదుపరి సమావేశంలో అనుమతులు ఇస్తామని పేర్కొంది. కేంద్రం నుంచి అనుమతులు లభించడంతో ఏపీ ప్రభుత్వం జులై 8న గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టనుంది. ఈ మొత్తం వ్యవహరాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం నెల వ్యవధిలోనే పూర్తి చేయటం ఆసక్తికరం. మరి  రాజధాని అంశంలో వైఖరి ఏంటో బీజేపి ఇప్పటికైనా స్పష్టంగా చెప్పాలని అమరావతి ప్రాంత వాసులు కోరుతున్నారు.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.