ఒక అభ్యర్ధి ఒకే నియోజక వర్గం ఎన్నికల సంఘం ప్రతిపాదన

Publish Date:Jun 18, 2022

Advertisement

ఒకే అభ్యర్ధి ఒకటి కంటే ఎక్కువ అసెంబ్లీ /లోక్ సభ స్థానాల్లో పోటీ చేయకుండా ఆంక్షలు విధించాలని, కేంద్ర ఎన్నికల సంఘం, 2004 నుంచే కేంద్ర  ప్రభుత్వాన్ని కోరుతోంది. అయితే, కారణాలు ఏవైనా,  ప్రభుత్వాలు మాత్రం ఆ ప్రతిపాదనను పక్కన పెట్టాయి. అయితే ఇప్పడు  కేంద్ర ఎన్నికల సంఘం మళ్ళీ, మరోసారి అదే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది. ఒక అభ్యర్ధి ఒకటి కంటే ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేయడంపై నిషేధం  అయినా విధించండి లేదంటే, రెండు స్థానాల నుంచి పోటీ చేసిన అభ్యర్ధి రెండు స్థానాలలో గెలిచి, ఏదో ఒక స్థానానికి రాజీనామ చేయవలసి  వస్తే, సదరు అభ్యర్ధి నుంచి భారీ జరిమానా వసూలు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది.  

కేంద్ర న్యాయ శాఖ లెజిస్లేటివ్ సెక్రటరీతో ఎన్నికల సంస్కరణల పై జరిపిన చర్చల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఈ ప్రతిపాదన చేశారు.. సుమారు ఇరవై ఏళ్ల క్రితమే వచ్చిన ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు మళ్లీ తీసుకొచ్చింది. ఒక అభ్యర్థి రెండు  స్థానాల్లో పోటీ చేసి గెలిచినా.. ఒక స్థానం నుంచి  రాజీనామా చేయక తప్పదు. అప్పుడు రెండవ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమవుతుంది. ఉప ఎన్నిక ఎన్నికల నిర్వహణకు అయ్యే ఆర్థిక భారం ప్రభుత్వ ఖజానాపై పడుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. అంతేగాక ఎన్నికల సమయంలో సిబ్బంది చాలా మంది అవసరమవుతున్నారని పేర్కొంది.

రెండు స్థానాల్లో పోటీ చేసి గెలుపొందిన వారు ఒక స్థానానికి రాజీనామా చేస్తే జరిమానా విధించాలని సూచించింది ఈసీ. శాసనసభ, శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసి రాజీనామా చేసిన వారికి రూ.5 లక్షలు, లోక్‌సభకు పోటి చేసే అభ్యర్థులకు రూ.10 లక్షలు జరిమానాగా విధించాలని ప్రతిపాదించింది. 1996లో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి ఒక వ్యక్తి రెండు కంటే ఎక్కువ స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేయకుండా నియంత్రించారు. అంతకుముందు వరకు ఒక అభ్యర్థి ఎన్ని స్థానాల్లోనైనా పోటీ చేసే వీలుండేది. 1996 సవరణ తర్వాత ఒక అభ్యర్ధి రెండు స్థానాలు మించి పోటీ చేయకుండా ఆంక్షలు విధించిన, పార్టీల ముఖ్య నేతలు  రెండు స్థానాల్లో పోటీ చేస్తూనే, ఉన్నారు. 2014 లోక్ సభ ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్’లోని వడోదరా, ఉత్తర ప్రదేశ్’లోని వారణాసి స్థానల నుంచి పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు. ఆ తర్వాత వడోదర స్థానానికి రాజీనామా చేసారు. అలాగే, 2019లో రాహుల్ గాంధీ యూపీలోని  అమేథి, కేరళలోని వయానార్ నియోజక వర్గాల్ నుంచి పోటీ చేసినా, అమేథిలో అయన ఓడి పోవడంతో రాజానామా చేయవలసిన అవసరం రాలేదు.

ఇలా, కీలక నేతలు సైతం రెండేసి  స్థానాల నుంచి పోటీ చేయడంతో    ఉప ఎన్నికలు అనివార్యం అవుతూనే ఉన్నాయి. అసెంబ్లీ, లేదా లోక్ సభ ఎన్నికల్లో  రెండేసి స్థానాల్లో పోటీ చేయడమే కాకుండా,  పదవిలో ఉండగానే పార్లమెంట్  సభ్యులు అసెంబ్లీ ఎన్నికల్లో, అసెంబ్లీ సభ్యులు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం వలన కూడా ఉప ఎన్నికలు, అనవసర వ్యయం అనివార్య మవుతున్నాయి. సో .. ఎన్నికల సంఘం ప్రతిపాదనను, సంక్లిష్ట న్యాయ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వానికి సలహా ఇచ్చే, లా కమిషన్ కూడా సమర్ధించింది.

వన్ కాండిడేట్ వన్ వన్ కాన్స్టిట్యూయన్సీ ఒక అభ్యర్ధి ఒక నియోజక వర్గం ప్రతిపాదనకు పచ్చ జెండా ఊపింది. అయితే, రెండు నియోజక వరగాల్లో పోటీ చేసి గెలిచిన అభ్యర్ధుల నుంచి ఉప ఎన్నిక ఖర్చును వాసులు చేయాలన్న ప్రతిపాదనకు  మాత్రం లా కమిషన్ నో చెప్పింది. ఈ నేపధ్యంలో  బంతి ఇప్పుడు  మరోమారు  కేంద్ర ప్రభుత్వం కోర్టుకు చేరింది. వన్ నేషన్ వన్ టాక్స్, వన్ నేషన్ వన్ రేషన్ అంటున్న కేంద్ర ప్రభుత్వం వన్ కాండిడేట్ వన్ వన్ కాన్స్టిట్యూయన్సీ కి అంగీకరిస్తుందా లేదా అనేది చూడవలసి వుంది.

By
en-us Political News

  
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్… ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
పార్టీలోని ఒక కీలక వర్గం దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం వైపు మొగ్గు చూపుతోంది. విలుప్పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.వి. షణ్ముగం, ఆయన వర్గంలోని కీలక నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
అభిషేక్ బెనర్జీ గత దశాబ్దంగా అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉంటూ వచ్చారు. అయితే సోమవారం సాయంత్రం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ప్రకారం, ఆయనకు కేటాయించిన అదనపు సెక్యూరిటీ సిబ్బందిని, ప్రత్యేక పైలట్ వాహనాలను ఉపసంహరించారు. ఇకపై ఆయనకు ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడికి ఉండే భద్రత మాత్రమే ఉంటుంది.
కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది.
మాములుగా మోడీ లోకేష్ తో క్లోజ్ గా ఉండే ఫోటోల‌కే లెక్క‌లేన‌న్ని కామెంట్లు వ‌స్తుంటాయి. అలాంటిది లోకేష్ త‌న‌యుడికి కూడా మోడీ ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ముచ్చటించడం ప్రాథాన్యత సంతరించుకుంది. చంద్రబాబు, లోకేష్ తో పాటు నారా వారి ఇంట మూడో తరం పిల్లవాడు దేవాన్ష్ కు కూడా ప్రధాని మోడీ ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలేంటంటూ.. నెటిజనులు పలు విధాలుగా స్పందిస్తున్నారు.
డీఎంకే శాసన సభాపక్ష ఉపనేతగా పార్టీ సీనియర్ నాయకుడు కేఎన్ నెహ్రూ, పార్టీ విప్‌గా ఈవీ వేలు నియమితులయ్యారు. అంతకు ముందు డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కూటమిని వీడిన కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఈ సమావేశం తీర్మానం చేసింది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఇందు కోసం చంద్రబాబు సోమవారం (మే 11) ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయన అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
ప్రధాని మోడీ తమ నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయనతో కుటుంబం దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. దానికి ఒక భావోద్వేగ వ్యాఖ్యను జోడించారు. మా ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేశానని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం తనతో చేతులు కలపితే.. పూర్తి స్థాయిలో సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రధాని రేవంత్ కు ఇచ్చిన ఆఫర్ సంచలనం రేపింది. రేవంత్ ను బీజేపీలో చేరమని ప్రధాని కోరుతున్నారా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
త‌న ప్ర‌భుత్వ అప్పుల‌పై విజ‌య్ విమ‌ర్శ‌లు గుప్పించి, హామీల అమ‌లు నుంచి త‌ప్పించుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కు విజ‌య్ ఆరోప‌ణ‌ల‌పై స్టాలిన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. మోస‌పూరిత ప్ర‌క‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించొద్ద‌ని హిత‌వు చెబుతూనే.. ఉచిత విద్యుత్‌, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణా అడ్డుకునేందుకు మొద‌టి సంత‌కం చేసిన విజ‌య్‌ని స్టాలిన్ అభినందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.