ఒక అభ్యర్ధి ఒకే నియోజక వర్గం ఎన్నికల సంఘం ప్రతిపాదన

Publish Date:Jun 18, 2022

Advertisement

ఒకే అభ్యర్ధి ఒకటి కంటే ఎక్కువ అసెంబ్లీ /లోక్ సభ స్థానాల్లో పోటీ చేయకుండా ఆంక్షలు విధించాలని, కేంద్ర ఎన్నికల సంఘం, 2004 నుంచే కేంద్ర  ప్రభుత్వాన్ని కోరుతోంది. అయితే, కారణాలు ఏవైనా,  ప్రభుత్వాలు మాత్రం ఆ ప్రతిపాదనను పక్కన పెట్టాయి. అయితే ఇప్పడు  కేంద్ర ఎన్నికల సంఘం మళ్ళీ, మరోసారి అదే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది. ఒక అభ్యర్ధి ఒకటి కంటే ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేయడంపై నిషేధం  అయినా విధించండి లేదంటే, రెండు స్థానాల నుంచి పోటీ చేసిన అభ్యర్ధి రెండు స్థానాలలో గెలిచి, ఏదో ఒక స్థానానికి రాజీనామ చేయవలసి  వస్తే, సదరు అభ్యర్ధి నుంచి భారీ జరిమానా వసూలు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది.  

కేంద్ర న్యాయ శాఖ లెజిస్లేటివ్ సెక్రటరీతో ఎన్నికల సంస్కరణల పై జరిపిన చర్చల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఈ ప్రతిపాదన చేశారు.. సుమారు ఇరవై ఏళ్ల క్రితమే వచ్చిన ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు మళ్లీ తీసుకొచ్చింది. ఒక అభ్యర్థి రెండు  స్థానాల్లో పోటీ చేసి గెలిచినా.. ఒక స్థానం నుంచి  రాజీనామా చేయక తప్పదు. అప్పుడు రెండవ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమవుతుంది. ఉప ఎన్నిక ఎన్నికల నిర్వహణకు అయ్యే ఆర్థిక భారం ప్రభుత్వ ఖజానాపై పడుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. అంతేగాక ఎన్నికల సమయంలో సిబ్బంది చాలా మంది అవసరమవుతున్నారని పేర్కొంది.

రెండు స్థానాల్లో పోటీ చేసి గెలుపొందిన వారు ఒక స్థానానికి రాజీనామా చేస్తే జరిమానా విధించాలని సూచించింది ఈసీ. శాసనసభ, శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసి రాజీనామా చేసిన వారికి రూ.5 లక్షలు, లోక్‌సభకు పోటి చేసే అభ్యర్థులకు రూ.10 లక్షలు జరిమానాగా విధించాలని ప్రతిపాదించింది. 1996లో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి ఒక వ్యక్తి రెండు కంటే ఎక్కువ స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేయకుండా నియంత్రించారు. అంతకుముందు వరకు ఒక అభ్యర్థి ఎన్ని స్థానాల్లోనైనా పోటీ చేసే వీలుండేది. 1996 సవరణ తర్వాత ఒక అభ్యర్ధి రెండు స్థానాలు మించి పోటీ చేయకుండా ఆంక్షలు విధించిన, పార్టీల ముఖ్య నేతలు  రెండు స్థానాల్లో పోటీ చేస్తూనే, ఉన్నారు. 2014 లోక్ సభ ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్’లోని వడోదరా, ఉత్తర ప్రదేశ్’లోని వారణాసి స్థానల నుంచి పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు. ఆ తర్వాత వడోదర స్థానానికి రాజీనామా చేసారు. అలాగే, 2019లో రాహుల్ గాంధీ యూపీలోని  అమేథి, కేరళలోని వయానార్ నియోజక వర్గాల్ నుంచి పోటీ చేసినా, అమేథిలో అయన ఓడి పోవడంతో రాజానామా చేయవలసిన అవసరం రాలేదు.

ఇలా, కీలక నేతలు సైతం రెండేసి  స్థానాల నుంచి పోటీ చేయడంతో    ఉప ఎన్నికలు అనివార్యం అవుతూనే ఉన్నాయి. అసెంబ్లీ, లేదా లోక్ సభ ఎన్నికల్లో  రెండేసి స్థానాల్లో పోటీ చేయడమే కాకుండా,  పదవిలో ఉండగానే పార్లమెంట్  సభ్యులు అసెంబ్లీ ఎన్నికల్లో, అసెంబ్లీ సభ్యులు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం వలన కూడా ఉప ఎన్నికలు, అనవసర వ్యయం అనివార్య మవుతున్నాయి. సో .. ఎన్నికల సంఘం ప్రతిపాదనను, సంక్లిష్ట న్యాయ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వానికి సలహా ఇచ్చే, లా కమిషన్ కూడా సమర్ధించింది.

వన్ కాండిడేట్ వన్ వన్ కాన్స్టిట్యూయన్సీ ఒక అభ్యర్ధి ఒక నియోజక వర్గం ప్రతిపాదనకు పచ్చ జెండా ఊపింది. అయితే, రెండు నియోజక వరగాల్లో పోటీ చేసి గెలిచిన అభ్యర్ధుల నుంచి ఉప ఎన్నిక ఖర్చును వాసులు చేయాలన్న ప్రతిపాదనకు  మాత్రం లా కమిషన్ నో చెప్పింది. ఈ నేపధ్యంలో  బంతి ఇప్పుడు  మరోమారు  కేంద్ర ప్రభుత్వం కోర్టుకు చేరింది. వన్ నేషన్ వన్ టాక్స్, వన్ నేషన్ వన్ రేషన్ అంటున్న కేంద్ర ప్రభుత్వం వన్ కాండిడేట్ వన్ వన్ కాన్స్టిట్యూయన్సీ కి అంగీకరిస్తుందా లేదా అనేది చూడవలసి వుంది.

By
en-us Political News

  
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న  స్థానిక  ఎన్నికల్లో  బీజేపీకి  ఏ పార్టీతోనూ  పొత్తులు పెట్టుకునే ఆలోచన  లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.