Publish Date:Jul 17, 2025
((ఫోటో చెప్పిన కథ)
సమర్ధుడి చెమట బిందువు కూడా పిల్లల్ని పుట్టించగలిగే సామర్ధ్యం కలిగి ఉంటుందని అంటారు పెద్దలు. అలాంటి సమర్ధుడిగా చంద్రబాబు నాయుడ్ని అభివర్ణించకుండా ఉండలేమంటారు కొందరు. ఈ ఫోటో చూస్తుంటే అలాగే అనాలనిపిస్తోందనీ చెబుతారు.
అప్పట్లో బాబు తీసుకున్న ఒకానొక నిర్ణయం తర్వాతి రోజుల్లో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదినా.. తర్వాత రాష్ట్రం రెండుగా చీలినా.. ఆయనకేం ఫరక్ పడలేదు. ఆయన నవ్యాంధ్రకూ తొలి ముఖ్యమంత్రి కాగలిగారు. సరిగ్గా అదే సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రులను తయారు చేసిన పేరు కూడా సాధించగలిగారు.
మొదట తన మంత్రి మండలిలోకి కొత్తగా పీజేఆర్ పై గెలిచిన విజయరామారావుకి మంత్రి పదవి ఇద్దామని భావించిన ఆయన అదే సామాజిక వర్గానికి సంబంధించిన కేసీఆర్ ని పక్కన పెట్టారు చంద్రబాబు. దీంతో అలిగిన కేసీఆర్.. తర్వాతి కాలంలో పార్టీ నుంచి బయటకెళ్లి కొత్త పార్టీ పెట్టి ఆపై తెలంగాణ ఏర్పాటుకు కారణం కావడం మాత్రమే కాదు.. సీఎం కూడా అయ్యారు. పదేళ్లు కొత్త రాష్ట్రాన్ని పాలించారు.
దాంతో మరో దారి లేక తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన రేవంత్ ఎంపీ కావడం, ఆపై టీపీసీసీ చీఫ్ కావడం.. తర్వాతి కాలంలో తెలంగాణకు సీఎం కాగలిగారు. ఇప్పుడు చూస్తే తన గురువుతో సమానంగా తాను కూడా ఒక ముఖ్యమంత్రిగా సత్స మానమైన హోదాలో ఆయన్ను కలిసి అభివాదం చేశారు. చంద్రబాబు కూడా తన శిష్యుడ్ని అభినందించారు. ఎన్నో రకాల బహుమతులిచ్చారు.
ఇది కదా అసలు రాజకీయమంటే.. ఒక నాయకుడంటే కేసీఆర్ పరిభాషలో చెబితే.. తాను మాత్రమే నాయకుడిగా ఉండి.. ఇతరులను పనికిమాలిన చవట- దద్దమ్మ- సన్నాసులను చేయడం కాదు. తనతో సమానమైన నాయకత్వాన్ని పుణికిపుచ్చుకోవడం. అదే బాబు చేసి చూపించారని అంటారు రాజకీయ విశ్లేషకులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-and-revanth-meet-in-delhi-39-202125.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!