పలుకవే నా బంగారు చిలుకా

Publish Date:Oct 18, 2013

Advertisement

 


 

ఈ కాకులేమిటి అచ్చు మన చిలకల్లానే అరుస్తున్నాయి? 

 

అవి కాకులు కావమ్మా మన సీబీఐ చిలుకలే. మనం ఇంతకాలం కప్పెట్టి ఉంచిన బొగ్గు కుంభకోణంలో అవి ముక్కు దూర్చినందుకు వాటికి కూడా ఆ బొగ్గు మసి అంటుకోవడంతో మీకు అలా కనిపిస్తున్నాయి అంతే.   

 

అయితే, అదేమిటయ్యా అవి మనతో షేర్చేసుకోవలసిన సీక్రెట్ వ్యవహారాలను ఎవరో పీసీ.ఫరెక్ అట అతనితో షేర్ చేసుకోవడమేమిటి? అతను మన మౌనముని మన్మోహన్ పై బురద జల్లడం ఏమిటి? బుద్ది లేకపోతేను? అసలు మనం మన చిలుకలకి ఎంతగా శిక్షణ ఇచ్చివదిలినప్పటికీ, అవి ఎదుట వాడి ఇల్లొదిలి తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ మనింటి మీదకే చేరి గోలచేస్తున్నాయి?

 

 

వాటిని అనుమానించకండి అమ్మగారు. వాటికి విశ్వాసం ఉండబట్టే అవి మనింటి చుట్టూ తిరుగుతున్నాయి.

 

 

ఏడిసినట్టే ఉంది నీ తెలివి. అవి మనకు విశ్వాసంగా ఉంటే మరి మన మనుషులనే ఎందుకు పొడుస్తున్నాయి?

 

అదేంటమ్మా మేము వాటికి బాగానే ట్రైనింగ్ ఇచ్చేమే?  

 

 

ఏమిటి అప్పుడే మరిచిపోయావా? వాటి గోల భరించలేక ఇంతకు ముందు మన రైల్వేమంత్రి  బన్సాల్ గారిని, న్యాయ శాఖా మంత్రి అశ్వినీ కుమార్ గారిని మనమే బయటకు గెంటేసుకోవలసి వచ్చింది. ఇప్పుడేమో ఏకంగా అవి మన్మోహన్ గారి కుర్చీమీద వాలి గోల చేస్తున్నాయి. అలాగని ఆయనను గెంటేయలేము కదా? వీటికి అసమదీయులెవరో(మనవాళ్ళెవరో) తసమదీయులెవరో(శత్రువులెవరో) కూడా గుర్తించేలా శిక్షణ కూడా ఈయలేకపోతే ఎలా? అవసరమయితే ఇటలీ నుండో లేక ఇంగ్లాండ్ నుండో ఎవరినయినా రప్పించి వీటికి మంచి శిక్షణ ఇప్పించండి.  

 

అలాగేనమ్మా. 

 

 

 

నువ్వు అలాగేనమ్మా... అలాగేనమ్మా అంటూ ఇక్కడ కాలక్షేపం చేస్తూ కూర్చుంటే అవతల ఆ చిలుకలు మన కొంప ముంచేట్లున్నాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో వదిలిన మన చిలకలు చూసిరా.. అంటే ఏకంగా కాల్చివచ్చాయి. వాటి దెబ్బకి పాపం ఆ..ధర్మాన, సబిత ఇద్దరు మంత్రులకి పదవులూడితే, మరొక పెద్దాయన ఎవరో మోపిదేవిట! పాపం ఏడాదిన్నరగా జైలులోనే మగ్గుతున్నాడుట. మనం గీకమన్నచోటల్లా సంతకాలు గీకేసే మరో డజను మంది అధికారులు కూడా ఈ చిలుకలు పుణ్యామాని కోర్టులు చుట్టూ తిరుగుతున్నారిప్పుడు. వారిని చూస్తే నా మనసు కరిగిపోతుంది. అలాగని వాళ్ళు మనోళ్ళేనని నలుగురిలో వెనకేసుకు రావడం కుదరదు కదా? 

 

 

అవునమ్మగారు.. ఈ పాడు చిలుకలకి అసమదీయులేవరో తసమదీయులెవరో గుర్తు పట్టడంలో ఇంకా శిక్షణ ఇప్పించాల్సిన అవసరముంది. అప్పటికీ ఒకటికి పదిసార్లు అసమదీయుల ఫోటోలు చూపించి మరీ వదులుతాము. కానీ ఏదో ఒకటి అరా మనవాళ్ళని అవి గుర్తుపట్టి కాపాడినా, ఈ ప్రతిపక్ష పార్టీలు అది చూసి కాకుల్లా గోలగోల చేస్తున్నాయి. అప్పటికీ పదునయిన ముక్కులున్న మన చిలుకలని వెనక్కి రప్పించుకొని, ముసలి చిలుకలని ఆ స్థానంలో పెట్టి మనకి అవసరమయిన ఒకటీ అరా మనుషులను వీలును బట్టి బయటకి తెచ్చుకొంటున్నాము తప్ప అధికారం మన చేతిలో ఉంది కదాని అందరికీ ఒకటే సారి బెయిలిచ్చేసి బయటకి తెచ్చేసుకోవట్లేదు కదా?

 

 

అవునయ్యా.. మన నీతి నిజాయితీ లోకానికేమి తెలుసు? పశువులకి గడ్డి కూడా వదలకుండా తినేద్దామని ప్రయత్నించిన ఆ లాలూ ప్రసాద్ ని మన చిలుకల చేత నానా గడ్డి తినిపించడం లేదూ? అటువంటి విషయాలు ఎవరూ పట్టించుకోరు. కానీ, మా ముద్దుల బాబు ఏదో ముచ్చటపడి నాన్సెన్స్ అనకపోయి ఉంటే ఆ లాలూ ప్రసాద్ ని కూడా మనమే వెనకేసుకు వస్తున్నామని లోకం కోడై కూసిందంటే నమ్ము. 

 

అవునమ్మా నేను కూడా అదే అనుకొన్నాను. 

ఆ.. 

ఆ..ఆ..నా అభిప్రాయం అదికాదమ్మా..జనాలు కూడా అలా అనేసుకోన్నారా? అని నేను అనుకొన్నానమ్మా. 

 

ఆ..సర్సరే...ముందు ఆ చిలుకలు మన పాలిట రాబందులుగా మారకుండా చూడు.  

 

అలాగేనమ్మా..మొన్న మొన్ననే మన దిగ్గీ రాజాగారు కూడా అసమదీయులెవరో,  తసమదీయులెవరో తెలుసుకోమని వాటికి గట్టిగా చెప్పారు. కానీ ఈ విషయమూ ఎవరో కాకితో కబురంపినట్లు ఎక్కడో హైదరాబాదులో ఉన్నవాళ్ళందరికీ కూడా ఎలాగో తెలిసిపోయింది. దానితో మళ్ళీ కాకి గోల మొదలయింది. అసలు ఈ చిలుకలకి ఆయనతో పనేమిటి? అవి ఆయన దగ్గర ఏమి నేర్చుకోవడానికి వెళ్ళాయి? ఎందుకు వెళ్ళాయి? అంటూ అర్ధం పర్ధం లేని చిలక ప్రశ్నలు అడుగుతూ ప్రతిపక్షాల వాళ్ళు కాకుల్లా గోల గోల చేసారమ్మా.

 

 

ఆ..సరే లేవయ్యా కాకులు అరుస్తున్నాయని చిలుకలను వదలకుండా పంజరంలో పెట్టుకొని కూర్చొంటామా?

 

 

అవునమ్మ గారు. మొన్న సుప్రీంకోర్టు కూడా ఆ మాటే అంది. అవన్నీ పంజరంలో పెరుగుతున్న చిలుకలు అని బలే కనిపెట్టేసిందమ్మగారు. 

 

 

ఆ..మరిచిపోయాను...మనం గుజరాత్ కి పంపిన చిలుకలు ఏమయినా పలుకుతున్నాయా లేకపోతే అవి కూడా నమో నమోఅంటూ అక్కడే ఆయన చుట్టూనే ప్రదక్షిణాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాయా? 

 

 

భయపడకండి అమ్మగారు. అవి ఎంతయినా మన పెరటి జాం చెట్టు మీద పుట్టి పెరిగిన చిలుకలు. ఆ మోడీ ఇంటి మీద వాలాలని ప్రయత్నించాయి గానీ ఆయన మీతోనే నేను ఎన్నికలలో పోటీ చేయాలా?” అని అడిగేసరికి అవి బిత్తరపోయి అక్కడి నుండి ఎగిరొచ్చేసి, ఆయన శిష్యుడు ఎవరో అమిత్ షా అట అతని వెంటబడ్డామని ఇటుగా వస్తున్న కాకితో మనకి కబురు పంపాయమ్మ గారు.

 

 

ఆ..సర్సరే! నీక్కూడా వాటి సహవాసంతో చిలుక పలుకులు పలకడం బాగా అలవాటయిపోయింది తప్ప పని కనబడటం లేదు. ఇంతకీ ఉత్తర ప్రదేశ్ లో మాయావతి ఇంటికి, ములాయం ఇంటి మీదకి వదిలిన మన చిలుకలు ఏమి చేస్తున్నాయిట? మాయావతి వ్యవహారంలో మన చిలుకలు సరయిన కార్డుతీయలేదని ఆవిడని సుప్రీం కోర్టు వదిలిపెట్టేసిందిట కదా? 

 

అవునమ్మగారు. ఇది మనం ముందుగా అనుకొన్నదే కదా? తమరు పని ఒత్తిడిలో మర్చిపోయినట్లున్నారు.

 

 

ఆ..ఆ...అవునవును..మరిచిపోయాను. వాళ్ళని కేవలం భయపెడుతూ మన మాటవినేలా చూడమని చెప్పాను కదా. సర్సరే...ఎందుకయినా మంచిది దేశంలో ఉన్న తసమదీయులందరి మీద మన చిలుకలను ఓ కన్నేసి ఉంచమను..ఎప్పుడు ఎవరి ప్లగ్గు పీకాల్సి వస్తుందో ఎవరికి తెలుసు?

 

అలాగే అమ్మగారు.  

 

 

అంత కంటే ముందుగా వాటికి అసమదీయులు, తసమదీయులను గుర్తు పట్టేందుకు బాగా శిక్షణ ఇప్పించు. అప్పుడే వాటిని బయటకి వదిలి పెట్టు. మరిచిపోకు. మళ్ళీ మరో సారి పొరపాటయ్యిందంటే ఈ సారి నీ మీదకే వాటిని వదిలిపెడతా గుర్తుంచుకో..


అయ్యో! ఎంత మాటా...తప్పకుండానమ్మా!

By
en-us Political News

  
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.