వందేళ్ల వార్‌కి ముగింపు లేదా..?

Publish Date:Sep 13, 2016

Advertisement

కావేరీ జలాల వివాదం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ విధ్వంసానికి దారి తీస్తోంది. రెండు రాష్ట్రాల్లో ఆందోళనకారులు పరస్పరం దాడులకు పాల్పడుతున్నారు. బెంగళూరు, చెన్నై, రామేశ్వరం ఇలా ప్రాంతమేదైనా జనం రగిలిపోతున్నారు. అసలు వివాదం తమిళనాటే మొదలైందంటున్నారు..కాదు కాదు, కన్నడీగులే మొదలుపెట్టారనే మాట వినిపిస్తోంది. అసలు వివాదం ఎలా మొదలైందంటే. కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లాలోని తలకావేరిలో పుట్టింది కావేరి నది. 765 కిలోమీటర్ల పరీవాహక ప్రాంతంతో దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద నదుల్లో ఒకటిగా ఖ్యాతిగాంచింది. అప్పట్లో కర్ణాటకలో ఎలాంటి ప్రాజెక్టులు లేవు. అయితే తమిళనాడులోని తంజావూరు జిల్లాలో చాళుక్యరాజులు నిర్మించిన గ్రేటర్ ఆనకట్ట ద్వారా లక్షలాది ఎకరాలు సాగేయ్యేవి. కావేరికి నదికి ఇరువైపులా వాగులు, చెరువుల ద్వారా కొంత ఆయుకట్టును కర్ణాటక సాగు చేసేది. నీటి వినియోగంపై 1892లో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ, మైసూర్ స్టేట్ మధ్య మొదటి వివాదం తలెత్తింది. దీనిపై మద్రాస్ ప్రెసిడెన్సీ, మైసూర్ మహారాజా మధ్య ఒప్పందం కుదిరినా ఇరు వర్గాలు దానిని పాటించలేదు.

 

అలా మొదలైన గొడవ ఇప్పటికీ రగులుతూనే ఉంది. మొదటి ఒప్పందాన్ని తుంగలో తొక్కడంతో 1924లో అప్పటి ప్రభుత్వం ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చడంతో మరో ఒప్పందం జరిగింది. దీని ప్రకారం కావేరి జలాల్లో 75 శాతాన్ని తమిళనాడు, పుదుచ్చేరి, 23 శాతం కర్ణాటక, మిగిలిన 2 శాతం నీటిని కేరళకు కేటాయించారు. ఆ ప్రకారంగా కావేరిపై కృష్ణరాజసాగర్ డ్యాంను మైసూర్ ప్రభుత్వం నిర్మించింది. 50 సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బందులు రాలేదు, అయితే స్వాతంత్ర్యానంతరం రాష్ట్రాల పునర్వ్యస్థీకరణ తర్వాత వివాదం మరింత రాజుకుంది. ఒప్పందానికి తూట్లు పొడిచి కర్ణాటక డ్యామ్‌లు నిర్మించడాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకించడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. 1924లో చేసుకున్న వివాదానికి కాలదోషం పట్టిందని నది పుట్టింది మా రాష్ట్రంలోనే కాబట్టి నదీ జలాలపై తమకే ఉందన్న వాదనను కర్ణాటక తెరపైకి తెచ్చింది. బ్రిటీష్ పాలకులు, మైసూర్ మహారాజుకు మధ్య జరిగిన ఒప్పందాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తేలేదని తేల్చిచెప్పడంతో తమిళనాడు ఆందోళనకు దిగింది.

 

దీంతో అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కె.ఎల్‌.రావు సమక్షంలో 1970 ఫిబ్రవరి 19న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. తర్వాత కూడా అనేక సమావేశాలు జరిగాయి. 1972లో కేంద్రం నిపుణులతో ఓ నిజ నిర్ధారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్రం 13 సార్లు సమావేశమైంది. 1985లో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో.. కనీసం 360 టీఎంసీలు కేటాయించాలని కర్ణాటక కోరింది. 60 టీఎంసీలతో చేపట్టాలనుకొంటున్న ప్రాజెక్టులను మాత్రం నిలిపివేస్తామని పేర్కొంది. దీన్నిబట్టి మొత్తం నీటిని కర్ణాటక వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తుందని తమిళనాడు ఆరోపించడంతో, 1986లో మరోసారి ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఇక్కడ కూడా రాజీ కుదరలేదు. శతాబ్దాలుగా సాగులో ఉన్న ఆయకట్టు దెబ్బతింటుందని, తంజావూరు జిల్లాలోని డెల్టా ప్రాంతంలో రెండు పంటలు పండే చోట ఒక పంటకే పరిమితం అవుతున్నామని తమిళనాడు ఆందోళన వ్యక్తంచేసింది. రెండు రాష్ట్రాల మధ్య ఓ అంగీకారం కుదిర్చేందుకు 16 సంవత్సరాలు కేంద్రం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో జల వివాద ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

 

1990 జూన్‌ రెండున జస్టిస్‌ చిత్రతోష్‌ ముఖర్జీ ఛైర్మన్‌గా కావేరి జలవివాద ట్రైబ్యునల్‌ ఏర్పాటైంది. తమవద్ద కనీస నీటి లభ్యత కూడా ఉండటం లేదన్న తమిళనాడు ఫిర్యాదుకు స్పందించి 1991 జూన్‌ ఐదున మధ్యంతర తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం మెట్టూరు డ్యాం వద్ద తమిళనాడుకు 205 టీఎంసీల నీటి లభ్యత ఉండాలని స్పష్టంచేసింది. ఏ నెలలో ఎంత నీటి విడుదల ఉండాలో కూడా పేర్కొని, దీని అమలుకు కమిటీని కూడా నియమించింది. ట్రైబ్యునల్‌ 2007 ఫిబ్రవరి ఐదున తుది తీర్పు ఇచ్చింది. దీనిపై 2008 నవంబరు రెండువరకు అభ్యంతరాలను స్వీకరించింది. ఇదే సమయంలో తుది తీర్పును గెజిట్‌లో ప్రకటించకుండా తమిళనాడు, కర్ణాటకలు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి.

 

అప్పట్నుంచి సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. సుధీర్ఘ వాదనల అనంతరం తుది తీర్పు వెలువరించిన సుప్రీం రోజుకు 15 వేల క్యూసెక్కుల నీటిని 10 రోజుల పాటు తమిళనాడుకు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును జీర్ణించుకోలేని కర్ణాటకలోని ప్రజలు, రైతు సంఘాలు నీటిని విడుదల చేయరాదంటూ రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహించారు. ఇది కాస్తా ఉద్రిక్తమై హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వివాదాన్ని పరిష్కరించే శక్తి వంద సంవత్సరాల కాలానికే లేకపోయింది కాబట్టి నీటిపైనా వాటా విషయంలో తమిళులది తప్పా, కన్నడీగులది తప్పా అనేది నిర్థారించే శక్తి లేనట్టే..? అలా కాకుండా అర్థం లేని ఆవేశాలు ప్రదర్శించుకోవడం ఇరు రాష్ట్రాలకు మంచిది కాదూ. పరస్పరం సహకరించుకుని సాగాల్సిన వాళ్లు ఇలా విధ్వంసాలు సృష్టించుకోవడం అత్యంత బాధాకరమైన అంశం.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.