వైసీపీలో రగులుతున్న కులం కుంపట్లు!

Publish Date:Jul 4, 2022

Advertisement

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సజ్జల రామ కృష్ణా రెడ్డి, ఇంకో కీలక  పదవిలో ఇంకొక రెడ్డి .. ఇలా పార్టీలో , ప్రభుత్వంలో అంతటా, ఆ రెండు అక్షరాలదే హవా... ఈమాటలు అన్నది, అంటున్నదీ ఎవరో కాదు, పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో క్రియాశీలంగా మెలుగుతూ, పార్టీ గెలుపు కోసం శక్తీ వంచన లేకుండా, అహర్నిశలు శ్రమించిన అన్య ‘కుల’ కార్యకర్తలు నాయకులు. ఇందులో ఎస్సీలున్నారు, ఎస్టీలున్నారు. ఓసీ లున్నారు. బీసీలు, మైనారిటీలున్నారు. అందరిలోనూ అసంతృప్తి వుంది.

అయినా, ముఖ్యమంత్రి  జగన్ రెడీ మాత్రం, అదేమీ పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పడు, అన్య సామాజిక వర్గాల నాయకులు, కార్యకర్తలు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. 
ఈ మధ్యనే, వైసీపీ పార్టీకి అనుబంధ సంఘాల ప్రకటించారు. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల విభాగాలకు మాత్రం ఆయా వర్గాలకు ఇచ్చారు. ఇతర సంఘాలు అన్నింటినీ ఆ ‘రెండు’ అక్షరాల సామాజిక వర్గానికే కట్ట బెట్టారు. మొత్తం 24 విభాగాలకు అధ్యక్షులను ప్రకటించారు. అందులో అత్యధికులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారనే ఆరోపణలు పార్టీలో బలగా వినిపిస్తున్నాయి.

కాగా, అనుబంధ సంఘాల బాధ్యులుగా  నియమితులైన వారిలో ...  ‘బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నాగిరెడ్డి, పూనూరు గౌతంరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, పామిరెడ్డి మధుసూదన్ రెడ్డి, పుత్తా ప్రతాప్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కల్పలతా రెడ్డి, మేడపాటి వెంకట్ రెడ్డి, సునీల్ పోశింరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి ఇలా, అందరి పేరు ఆ రెండు అక్షరాలతోనే ముగుస్తుంది. ఇందులో ఐటీ, సోషల్ మీడియా, పార్టీ ఆఫీస్, యూత్ వింగ్, రైతు విభాగం ఇలా అన్నీ ఉన్నాయి. అయితే ఎందుకనో ఏమో కానీ, ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ, బీసీ, ఎస్టీ, ఎస్టీల సంఘాలకు  మాత్రం ఆయా సామజిక వర్గాలకే  బాధ్యతలు ఇచ్చారు. 

ఇలా ఒకే ఒక్క సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడం పై  విమర్శలు వస్తున్నా, పార్టీ మాత్రం, అవేమీ పట్టించుకోవడంలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలానే కాదు, ఓసీలకు జగన్ రెడ్డి మొండి చేయి చుపారని, అయన దృష్టిలో ఒక్క రెడ్లు వినా, ఓసీలు, ఇతర సామాజిక వర్గాలు కనిపించవు అనే విమర్శలు వినవస్తున్నాయి.అయితే, ఇప్పడు ఇతర సామాజిక వర్గాలు వైసీపెలో తమకు జరుగతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాయి.

మా వాటా మాకు కావాలని డిమాండ్ చేస్తున్నాయి. సామజిక న్యాయం పేరిట, పొరుగు రాష్ట్రానికి చెందిన బీసీ సంఘం నాయకుడు ఆర్ . కృష్ణయ్యకు ఏకంగా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన జగన్ రెడ్డి పార్టీని నమ్ముకుని పని చేస్తున్న బీసీలు, ఇతర సమాజిక వర్గాలను మోసం చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే, తిరుబాటు తప్పదని, పార్టీ  నేతలు హెచ్చరిస్తున్నారు.

By
en-us Political News

  
వైసీపీకి ఓటు వేయకపోతే చెప్పుచ్చుకుని కొడతానని అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాణెం హనిమిరెడ్డి నియోజకవర్గంలోని ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు
ఎన్నికలకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది.రాజకీయ నాయకులంతా ప్రచారాల్లో నిమగ్నమయ్యారు. ఇన్ని రోజులు మండుటెండలో ప్రచారం సాగించిన నేతలు ఇప్పుడు అకాల వర్షాలతో సతమతమవుతున్నారు. ఓ వైపు భహిరంగ సభలు, రోడ్​ షోలతో కార్యకర్తలు తీరిక లేకుండా ప్రజల మద్ధతు కూడగడుతుంటే వర్షం ప్రారంభమైంది.
ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశానిది ఒక ప్రత్యేక శైలి. భిన్నత్వంలో ఏకత్వం అనే లక్షణం భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ప్రత్యేకంగా నిలిచేలా చేసింది.
మా భూమి మీద నీ హక్కేంటి జగన్.. రాష్ట్రంలోని ప్రభుత్వ భూములన్నీ తాకట్టు పెట్టేశావు.. ఇప్పుడు మా భూముల మీద పడ్డావా అని పలువురు ఆంధ్ర్రప్రదేశ్ రైతులు నిలదీస్తున్నారు
ఇసుక అక్రమ తవ్వకాల్ని తక్షణం నిలిపివేయాలని, అనుమతి ఉన్న చోట కూడా యంత్రాలు ఉపయోగించవద్దని సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కేవలం కాగితాలపైనే ఉన్నాయని క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించవని న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా వ్యాఖ్యానించారు.
ఏపీ ఎన్నికలలో హాట్ సీట్లు అనదగ్గ వాటిలో మొదటిగా చెప్పుకోవలసింది పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపైనే. ఎందుకంటే ఇక్కడ జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీగా వైసీపీ వంగా గీతను బరిలోకి దింపింది.
పెన్షన్లు తీసుకుంటున్న వృద్ధులు, వితంతువులు ఎవ్వరైనా సరే.. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే గనుక.. రాబోయే అయిదేళ్లలో అచ్చంగా 57 వేల రూపాయలు కోల్పోబోతున్నారని శ్రీలక్ష్మీ శ్యామల ప్ర‌చారం చేస్తున్నారు.
మే 13వ తేదీ ఎప్పుడు వస్తుందా, తెలుగుదేశం కూటమికి ఓటు వేసి జగన్ పీడ ఎప్పుడు వదిలించుకుందామా అని ఆంధ్రప్రదేశ్ రైతులు ఎదురు చూస్తున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. మద్యం కుంభకోణంలో అరెస్టైన కేజ్రీవాల్ కు దేశ సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రైతులు టీడీపీ, వైసీపీ, బీజేపీ కూటమికి వినూత్నంగా మద్దతు తెలిపారు.
అబ్ కీ బార్ 400 బహార్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బిజెపి హైదరాబాద్ లోకసభ స్థానం  మీద పూర్తి కాన్ సన్ ట్రేషన్ చేస్తోంది. 40 ఏళ్లుగా హైద్రాబాద్ లోకసభ స్థానాన్ని కబ్జా చేసుకున్న మజ్లిస్ పార్టీని ఓడించడానికి బిజెపి అధిష్టానం భారీ వ్యూహంతో ఉంది.
ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం హవా జోరుగా ఉంది. జగన్ గాలి వీచిన 2019 ఎన్నికలలో కూడా ఈ జిల్లాలో తెలుగుదేశం నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఈ సారి తెలుగుదేశం కు జనసేన, బీజేపీల బలం తోడైంది. జగన్ సర్కార్ పై ఉన్న తీవ్ర ప్రజా వ్యతిరేకతతో ఆ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయి.
విదేశాల నుండి ఎన్ ఆర్ ఐ లు రావడం తో ఢిల్లీ - విజయవాడ విమానం రద్దీ నెలకొంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి మునుపెన్నడూ లేని విధంగా సుదూర ప్రాంతాల నుండి వస్తున్నారు. ఇదే ఒరవడి మరో మూడు రోజు లు కొనసాగుతుంది అని విమానాశ్రయాధికారులు చెబుతున్నారు. విదేశాలనుండి వచ్చే వారంతా చంద్ర‌బాబుకు సంఘీభావంగానే వస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.