పేర్ని నానిపై కేసు..మళ్లీ అజ్ణాతంలోకేనా?

Publish Date:Oct 11, 2025

Advertisement

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేర్ని నాని తెలియని వాళ్ళు ఉండరు. వైసీసీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని రాజకీయాలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ బాగా తెలిసిన పేరే.  నిత్యం ఏదో  ఒక వివాదాస్పద వ్యాఖ్యతో వార్తల్లో ఉండే పేర్ని నాని.. ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన దగ్గర నుండి తన నోటికి గట్టిగా పని చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నంత వరకూ నోటికి అడ్డూ అదుపూ లేదన్నట్లుగా బూతులతో, అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన కొడాలి నాని వంటి వారు  అధికారం కోల్పోయిన తరువాత సైలెంటైపోయారు. ఇక అధికారం కోల్పోయిన తరువాత నిన్న మొన్నటి వరకూ అంబటి రాంబాబు తన గళానికి పని చెప్పారు. అయనా ఈ మధ్య ఎందుకో మౌనం వహిస్తున్నారు. అయితే రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నుంచీ పేర్ని నాని వాయిస్ ఆఫ్ వైసీపీ అన్నట్లుగా  రెచ్చిపోతున్నారు. అయితే ఎంత రెచ్చిపోయినా.. పేర్నినాని ఒక విషయంలో మాత్రం గొప్ప పరిణితి ప్రదర్శిస్తున్నారు. తనపైన ఏదైనా కేసు నమోదైతే.. ఆ కేసులో ముందస్తు బెయిలు వచ్చే వరకూ అజ్ణాత వాసం చేస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన నోటి వెంట ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా రాదు. సరే సదరు కేసులో కోర్టులో ఊరట లభించిందంటే చాలు అజ్ణాతం వీడి బయటకు వచ్చి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలతో రెచ్చిపోతుంటారు. 

పేర్న నానిపై గతంలో కేసు నమోదైన ప్రతిసారీ కూడా ఆయన ఆ కేసులో ముందస్తు బెయిలు వచ్చే వరకూ అజ్ణాత వాసం చేయడం తెలిసిందే. గతంలో నానిపై భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తిన సమయంలోనూ, అలాగే రేషన్ గోదాముల కేసు సమయంలోనూ కూడా పేర్ని నాని ముందస్తు బెయిలు వచ్చే వరకూ అజ్ణాతంలోకి వెళ్లారు. ఇప్పుడు తాజాగా పేర్ని నానిపై చిలకలపూడి పీఎస్ లో కేసు నమోదైంది. 

  ఆర్‌.పేట సీఐ ఏసుబాబుపై పేర్ని నాని దౌర్జన్యం చేశారనీ, పోలీసు విధులకు ఆటంకం కలిగించారనీ కేసు నమోదైంది. ఇంతకీ జరిగిందేంటంటే.. పేర్ని నాని ఆధ్వర్యంలో  వైసీపీ  నేతలు మెడికల్‌ కళాశాల వద్ద ఇటీవల నిరసన చేపట్టారు. కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయని, నిరసన తెలిపేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా వినలేదు.  ఈ ఘటనలో 400 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి 41ఏ నోటీసులు ఇచ్చారు. ఠాణాకు విచారణకు రావాలని పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు. తాము చెప్పేవరకూ పోలీసుల వద్దకు ఎవరూ వెళ్లొద్దంటూ వైసీసీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో మేకల సుబ్బన్నను పోలీసులు శుక్రవారం (అక్టోబర్ 10) అరెస్టు చేశారు.  దీంతో పేర్ని నాని పెద్ద సంఖ్యలో అనుచరులతో చిలకలపూడి స్టేషన్ కు వెళ్లి హల్ చల్ చేశారు. సీఐతో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలోనే పేర్ని నానిపై కేసునమోదైంది.   పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనీ, సీఐపై దౌర్జన్యానికి పాల్పడ్డారని కేసు పెట్టారు. దీంతో ఈ కేసులో కూడా బెయిలు దొరికే వరకూ నాని అజ్ణాతంలోకే అంటూ వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.  

By
en-us Political News

  
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.