Publish Date:Oct 12, 2025
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సోమవారం (అక్టోబర్ 13) నోటిఫికేషన్ విడుదల అవుతుంది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ లు తమతమ అభ్యర్థులను ప్రకటించేశాయి. అయితే కమలం పార్టీ మాత్రం అభ్యర్థి విషయంలో ఇప్పటి వరకూ ఓ నిర్ణయానికి రాలేదు. ముగ్గురు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి వారిలో ఒకరిని అభ్యర్థిగా ప్రకటించడానికి అధిష్ఠానం అనుమతి కోసం ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు హస్తినకు వెళ్లారు. అయితే తెలంగాణలో బీజేపీ పరిస్థితి చాలా కాలంగా ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది. రాష్ట్ర పార్టీలో నేతల మధ్య విభేదాలే ఇందుకు కారణం అని పరిశీలకులు అంటున్నారు. జూబ్లీ బైపోల్ విషయంలో కూడా అభ్యర్థి ఎంపిక విషయం ఇంత వరకూ తేలకపోవడానికి కూడా అదే కారణమని చెబుతున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం జూబ్లీ బైపోల్ అభ్యర్థి విషయంలో ఇప్పటి వరకూ దృష్టి పెట్టలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నా.. అదే బీహార్ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ జూబ్లీ ఉప ఎన్నిక విషయాన్ని ఇసుమంతైనా నిర్లక్ష్యం చేయలేదు. కానీ బీజేపీ మాత్రం నామినేషన్ల పర్వానికి చివరి నిముషాలు సమీపిస్తున్నా కూడా అభ్యర్థి విషయంలో ఎటూ తేల్చకుండా నానుస్తుండటంతో తెలంగాణలో బీజేపీ లెక్కతేలలేదా; లేక తప్పిందా అన్న చర్చ రాజకీయవర్గాలలో ఆరంభమైంది.
గత అసెంబ్లీ ఎన్నికల నుంచీ కూడా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ ఆ లక్ష్య సాధన విషయంలో మాత్రం విఫలమౌతూనే వస్తోంది. జూబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థిని తేల్చే విషయంలో ఇంతగా మల్లగుల్లాలు పడుతుండటంతో ఆ పార్టీ ప్రచారంలో కూడా ఇప్పటికే వెనుకబడింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఏ మేరకు పోటీ ఇవ్వగలదన్న అనుమానాలు కమలం శ్రేణుల్లోనే వ్యక్తం అవుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-yet-to-decide-candidate-for-jublee-by-poll-39-207805.html
2029 ఎన్నికలలో విజయం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్న జగన్ ఇప్పుడు కూడా నేతలను సొంత నియోజకవర్గం నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీలో నిలబెట్టాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అందులోనూ ప్రధానంగా ప్రస్తుతం చిలకలూరి పేట నియోజకవర్గంలో పని చేసుకుంటున్న మాజీ మంత్రి విడదల రజనీని వచ్చే ఎన్నికలలో రేపల్లె నుంచి పోటీలో దింపాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్న లోకేష్ తనకు రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచీ సబ్బానాయుడితో మంచి పరిచయం, అనుబంధం ఉందన్నారు.
తమిళ సినిమా లెనిన్ ఇండియన్ అనే సినిమాతో రోజా వెండితెరపై మళ్లీ కనిపించనున్నారు. ఈ మేరకు ఆ మూవీ మేకర్స్ రోజా తమ సినిమాలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.
జూబ్లీ హిల్స్లో సెంటిమెంటో గెలుస్తుందో డెవలప్మెంటో గెలుస్తుందో తెలుస్తుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాలి అని టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు టీడీపీ నాయకులను ఆదేశించారు
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గోన్ననున్నారు.
హర్యానా ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ పెద్దగా కనిపించడం లేదు. పార్టీ అభ్యర్థి ఎంపికకే చాలా సమయం తీసుకున్న ఆ పార్టీ.. ప్రచారంలోనూ వెనుకబడింది. ప్రచార సరళిని బట్టి చూస్తుంటే జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ అన్న అభిప్రాయం కలుగుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
నాగబాబు ఎమ్మెల్సీ అయిన తరువాత కూడా తన వైఖరి మార్చుకోలేదని నిన్న మొన్నటి దాకా తెలుగుదేశం శ్రేణులు అంటుండేవి. ఎమ్మెల్సీగా నాగబాబు తన తొలి పర్యటనను తన సోదరుడు, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురం నుంచే మొదలు పెట్టారు. కానీ ఆ పర్యటన ఆద్యంతం తెలుగుదేశం, జనసేన క్యాడర్ మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లే విధంగానే సాగింది.
రాజకీయాలలో తొలి అడుగు కూడా పడకుండానే ఆయన నడకను ఆపేయాలని చూశారు. అయితే వాటన్నిటినీ తట్టుకుని నిలబడిన లోకేష్.. తనపై విమర్శలకు తన పనితీరుతోనే బదులిచ్చారు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో మొదలు పెట్టి బెరుకు లేకుండా, బెదురు లేకుండా నిలదొక్కుకుని ఇప్పుడు ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంగా మారారు.
రైతులు కోరినా జగన్ మాత్రం పొలాల్లోకి అడుగుపెట్టలేదు. ఇదే రకం పరిశీలనో అర్ధంగాక రైతులు తలలుబాదుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తాను సీఎంగా ఉన్న సమయంలో రైతులను అన్నివిధాలుగా ఆదుకున్నానన్నారు. మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో పాతిక జిల్లాల్లో పంటనష్టం జరిగిందన్నారు. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రూపాయి కూడా సాయం అందలేదన్నారు.
ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించి ఎన్నికల ప్రచారంలో మైనారిటీ తీరని పిల్లలతో ఎన్నికల ప్రచారం చేయించారంటూ కేటీఆర్ పై షఫీయుద్దీన్ ఫిర్యాదు చేశారు.
బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.