Publish Date:Oct 12, 2025
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సోమవారం (అక్టోబర్ 13) నోటిఫికేషన్ విడుదల అవుతుంది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ లు తమతమ అభ్యర్థులను ప్రకటించేశాయి. అయితే కమలం పార్టీ మాత్రం అభ్యర్థి విషయంలో ఇప్పటి వరకూ ఓ నిర్ణయానికి రాలేదు. ముగ్గురు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి వారిలో ఒకరిని అభ్యర్థిగా ప్రకటించడానికి అధిష్ఠానం అనుమతి కోసం ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు హస్తినకు వెళ్లారు. అయితే తెలంగాణలో బీజేపీ పరిస్థితి చాలా కాలంగా ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది. రాష్ట్ర పార్టీలో నేతల మధ్య విభేదాలే ఇందుకు కారణం అని పరిశీలకులు అంటున్నారు. జూబ్లీ బైపోల్ విషయంలో కూడా అభ్యర్థి ఎంపిక విషయం ఇంత వరకూ తేలకపోవడానికి కూడా అదే కారణమని చెబుతున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం జూబ్లీ బైపోల్ అభ్యర్థి విషయంలో ఇప్పటి వరకూ దృష్టి పెట్టలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నా.. అదే బీహార్ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ జూబ్లీ ఉప ఎన్నిక విషయాన్ని ఇసుమంతైనా నిర్లక్ష్యం చేయలేదు. కానీ బీజేపీ మాత్రం నామినేషన్ల పర్వానికి చివరి నిముషాలు సమీపిస్తున్నా కూడా అభ్యర్థి విషయంలో ఎటూ తేల్చకుండా నానుస్తుండటంతో తెలంగాణలో బీజేపీ లెక్కతేలలేదా; లేక తప్పిందా అన్న చర్చ రాజకీయవర్గాలలో ఆరంభమైంది.
గత అసెంబ్లీ ఎన్నికల నుంచీ కూడా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ ఆ లక్ష్య సాధన విషయంలో మాత్రం విఫలమౌతూనే వస్తోంది. జూబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థిని తేల్చే విషయంలో ఇంతగా మల్లగుల్లాలు పడుతుండటంతో ఆ పార్టీ ప్రచారంలో కూడా ఇప్పటికే వెనుకబడింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఏ మేరకు పోటీ ఇవ్వగలదన్న అనుమానాలు కమలం శ్రేణుల్లోనే వ్యక్తం అవుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-yet-to-decide-candidate-for-jublee-by-poll-39-207805.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.