ఉజ్వల భారత్ కు మోడీ మార్క్ బడ్జెట్

Publish Date:Jul 10, 2014

Advertisement

 

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన ఆర్ధిక బడ్జెట్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. సామాన్య ప్రజలపై కొత్తగా ఎటువంటి భారం వేయకుండా, అదే సమయంలో ఎటువంటి ప్రజాకర్షక పధకాలు ప్రకటించకుండా, దేశం సర్వతోముఖాభివృద్ధికి అత్యుత్తమ ప్రణాళిక సిద్దం చేసారు. ఈ బడ్జెటులో విద్యా, వైద్య, ఆర్ధిక, పారిశ్రామిక, వర్తక, వ్యాపార, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. దేశ వ్యాప్తంగా మౌలిక వసతులు కల్పనకు చాలా భారీ ప్రణాళికలు సిద్దం చేసారు. వీటన్నిటి ద్వారా దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తూనే అదే సమయంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా సృష్టించే ప్రయత్నం చేయడం చాలా గొప్ప ఆలోచనే.

 

ఇక ఈ బడ్జెట్ లో మెచ్చుకోవలసిన విషయం ఏమిటంటే, గత ఆరు దశాబ్దాలలో తీవ్ర నిరాధారణకు గురయి, ఎటువంటి అభివృద్ధికి నోచుకోని ఈశాన్య రాష్ట్రాలకు, జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రానికి ఈ బడ్జెట్ లో సముచిత స్థానం కల్పించడం. ఈశాన్య రాష్ట్రాలలో మౌలిక వసతులు, హైవేల అభివృద్ధి, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు, కాశ్మీరులో ఐఐటీ ఏర్పాటు అందుకు చక్కటి ఉదాహరణ. కాశ్మీరు మొదలు కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలలో సమానంగా అభివృద్ధి సాధించేందుకు అనేక వ్యూహాలు రచించారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు, వ్యవస్థలకు మేలు చేకూరే విధంగా బడ్జెట్ రూపొందించారు.

 

ఇక వివరాలలోకి వెళితే, భారీ పెట్టుబడులు అవసరమయిన ఉత్పత్తి, మౌలికవసతులు, రక్షణ, రైల్వేలు తదితర రంగాలలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం, వివిధ సంస్థలలో ప్రభుత్వ పెట్టుబడులను కొంతమేర ఉపసంహరించుకోవడం, బ్యాంకింగ్ రంగంలో అదనపు వనరులను ఉపయోగించుకోవడం ద్వారా, సామాన్య ప్రజలపై ఎటువంటి భారం మోపకుండానే అభివృద్ధి సాధించేందుకు మార్గం కనుగొన్నారు. బ్యాంకింగ్ రంగంలో 2018నాటికి రూ.2.40 లక్షల కోట్ల మూలధన నిధులు సమీకరణ లక్ష్యంగా పెట్టుకొన్నారు.

 

వైజాగ్ నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్, కాకినాడలో హార్డ్ వేర్ పార్క్, దేశంలో కొత్తగా ఆరు టెక్స్ టైల్ పార్కులు, రూ.11, 635 కోట్ల పెట్టుబడితో కొత్తగా 16 నౌకాశ్రయాల నిర్మాణం, రూ.37,850కోట్లతో దేశవ్యాప్తంగా హైవేల అభివృద్ధి, నిర్మాణం, రూ.7600 కోట్ల వ్యయంతో దేశంలో 100 స్మార్ట్ సిటీల అభివృద్ధి, రూ.500కోట్లతో సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం వంటివన్నీ కూడా పెద్ద ఎత్తున ఉపాధికి, దేశాభివృద్ధికి దోహదపడేవే!

 

మన దేశం ఇంతవరకు కేవలం సాఫ్ట్ వేర్ రంగంపైనే దృష్టి కేంద్రీకరించి, భారీ ఉత్పత్తి, ఉపాధి, ఎగుమతులకు అవకాశామున్న హార్డ్ వేర్ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది. కానీ ఈ బడ్జెట్టులో హార్డ్ వేర్ రంగం అభివృద్ధికి కూడా ప్రణాళిక సిద్దం చేసారు.

 

ఇక కొత్తగా ఐఐటీలు, ఐఐయంలు, ఎయిమ్స్ వైద్య సంస్థలు, మెడికల్ కాలేజీలు, వ్యవసాయ, ఉద్యానవన, పెట్రోలియం విశ్వవిద్యాలయాలు, క్రీడా రంగానికి ప్రత్యేకంగా అకాడమీలు వంటివన్నీ కూడా ఉన్నత విద్యలకు, ఉపాధికి దారి చూపేవే.

 

ఇక దేశానికి వెన్నెముక వంటి గ్రామీణ భారత పరిస్థితిలో పెనుమార్పులు తెచ్చేందుకు వ్యవసాయ, ఉద్యానవన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడమే కాకుండా, రైతులకోసమే ప్రత్యేకంగా కిసాన్ ఛానల్ ప్రారంభిస్తున్నారు. లక్షల మంది రైతులు, ప్రజలకు జీవనాధారమయిన గంగా నదీ ప్రక్షాళనకు, ఘాట్స్ అభివృద్దికి రూ.2137కోట్లు, దేశంలో నదుల అనుసంధానంపై అధ్యయనం కోసం రూ.100 కోట్లు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించారు. భూసార పరీక్షల కోసం మొబైల్ పరీక్ష కేంద్రాల ఏర్పాటు, తక్కువ వడ్డీపై స్వల్పకాలిక రుణాలు, రుణాలు సకాలంలో చెల్లించిన రైతులకు ప్రోత్సాహకాలు, మార్కెట్ ధరల స్థిరీకరణ కోసం రూ.100 కోట్లు నిధి ఏర్పాటు, ఈశాన్య రాష్ట్రాలలో వ్యవసాయాభివృద్ధికి రూ.100 కోట్ల నిధులను కేటాయించి రైతులు  సంక్షేమంపై శ్రద్ధ వహించారు.

 

కేవలం అభివృద్ధి పధకాలే కాకుండా సైనికులకు ఒక హోదా ఒకే పించన్, బాలికల సంరక్షణ మరియు విద్య కోసం ప్రత్యేకంగా రూ.500 కోట్ల నిధులు, యస్సీ, ఎస్టీ మరియు గిరిజనుల సంక్షేమం కోసం ఏకంగా రూ.50, 100 కోట్ల భారీ నిధులు, రక్షిత మంచి నీటి పధకాలకు, కళాశాలలో టాయిలెట్లు, త్రాగునీరు ఏర్పాటు వంటి సంక్షేమ కార్యక్రమాలకు కూడా బడ్జెట్ లో చోటు కల్పించడం ద్వారా, విమర్శలకు తావులేకుండా చేసారు.

 

ఈవిధంగా దేశాభివృద్ధికి అనేక పధకాలు రచించి అదే సమయంలో వాటి ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి మార్గం కూడా కల్పించే ప్రయత్నం చేసారు. ఇంతవరకు కేవలం ప్రజాకర్షక పధకాల ప్రకటనకు, ఆచరణకు నోచుకోని అభివృద్ధి పధకాల ప్రకటనకు మాత్రమే పరిమితమవుతున్న బడ్జెట్ ను అరుణ్ జైట్లీ ఎవరూ ఊహించని విధంగా కొత్త పుంతలు త్రొక్కించి దేశంలో అన్ని వర్గాల మన్ననలు అందుకొంటున్నారు. అందుకు ప్రధాన కారకుడు ప్రధాని నరేంద్ర మోడీయేనని వేరే చెప్పనవసరం లేదు. ఉజ్వల భారత్ నిర్మాణం కోసం మోడీ వేసిన ముద్ర ఈ బడ్జెట్. క్లుప్తంగా చెప్పుకోవాలంటే దేశం మొత్తం సర్వతో ముఖాభివృద్ధికి రూపొందించిన అత్యంత తెలివయిన, ఆకర్షణీయమయిన, ఆశజనకమయిన బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ ను యధాతధంగా అమలుచేయగలిగితే గత ఆరు దశాబ్దాలుగా సాధించలేని అభివృద్ధిని వచ్చే ఐదు సంవత్సరాలలోనే భారత్ సాధించడం తధ్యం.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.