త్వరలో కవిత కొత్త పార్టీ ! తండ్రికి లేఖ వెనుక ఎత్తుగడ ఇదే !

Publish Date:May 23, 2025

Advertisement

 

క‌ల్వకుంట్ల క‌విత త‌న తండ్రిని  విబేధిస్తూ రాసిన లేఖ ఒక చిన్న లీడ్ మాత్ర‌మేన‌ట‌. వ‌చ్చే రోజుల్లో క‌విత నుంచి భారీ బ్లాస్టింగ్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. కార‌ణం క‌విత పార్టీ బ‌య‌ట‌కొచ్చి కొత్త పార్టీ పెట్టేలా ఎత్తుగ‌డ వేస్తున్న‌ట్టు సమాచారం. ఇదంతా జ‌రిగే ప‌నేనా? అందుకా అవ‌కాశాలున్నాయా? అని ఆలోచిస్తే.. ఇదంతా నేరుగా కేసీఆర్ నుంచే వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌గా తెలుస్తోంది. గులాబీ బాస్ త‌న ఫ‌స్ట్ ప్ర‌యారిటీ అల్లుడు హ‌రీష్ రావ్ కి ఇస్తే ఆయ‌న స‌సేమిరా అన్నాడని స‌మాచారం. మామ‌కు ద్రోహం చేసిన రెండో చంద్ర‌బాబును అవుతాను. అది నాకిష్టం లేదు. ఆ ముద్ర నేను వేయించుకోలేన‌ని డైరెక్టుగా విలేఖ‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు హ‌రీష్ రావు చెప్ప‌డం కూడా అంతే వాస్త‌వం. ఒక వేళ అలా జ‌రిగినా కూడా తాను త‌న మామ కేసీఆర్ బ‌తికుండ‌గా పార్టీని వీడే ప్ర‌స‌క్తే లేద‌ని తెగేసి చెప్పిన‌ట్టు తెలుస్తోంది. క‌ట్ చేస్తే పార్టీలో ప్ర‌స్తుతం కేసీఆర్ త‌ర్వాత అంత‌టి సుప్రిమో కేటీఆరే. త‌ర్వాత హిమాన్షు ప‌రం అవుతుందేమోగానీ మ‌రెవ‌రికీ ఇందులో భాగ‌స్వామ్యం లేదు. 

ఇక్క‌డ కేసీఆర్ అస‌లు ప్లానేంటంటే డీఎంకే, అన్నాడీఎంకేలాగా.. పార్టీ చీలినా పెద్ద స‌మ‌స్య‌లేద‌ని.. అధికారం మాత్రం మ‌న ఇంట్లోనే ఉండాల‌న్న‌ది చంద్ర‌శేఖ‌ర‌రావు అస‌లు ఎత్తుగ‌డ‌గా తెలుస్తోంది. అలా తొలుత హ‌రీష్ రావును ఆ దిశ‌గా ప్ర‌యోగించాల‌ని ప్ర‌య‌త్నిస్తే అది ఆదిలోనే హంస‌పాదులా మారిందట‌. అప్ప‌ట్లో అమిత్ షా కూడా హ‌రీష్ రావును గ‌ట్టిగానే ట్రై చేసిన‌ట్టు స‌మాచారం. హ‌రీష్ బీజేపీలోకి వెళ్తారేమోన‌ని కేసీఆర్ కూడా బాగానే ఎదురు చూశార‌ట‌. అలాగైనా మ‌న‌లో ఒక‌డు ఇత‌ర పార్టీలోకెళ్లి అక్క‌డి నుంచి అధికారంలో ఉండ‌టం కూడా క‌లిసొచ్చే అంశ‌మే అన్న‌ది కేసీఆర్ అస‌లు వ్యూహ‌మ‌ట‌. ఇప్పుడు.. చూడండీ ఎక్క‌డి నుంచో పొడుచుకొచ్చిన రేవంత్ సీఎం అయి కూర్చుని కాళేశ్వ‌రం గుంత‌లు మొత్తం త‌వ్వుతున్నాడు. ఏమో కాంగ్రెస్ వాళ్లే కాళేశ్వ‌రాన్ని పేల్చేశారేమో అని కేటీఆర్ ఎంత బ‌నాయిస్తున్న.. వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. రేవంత్ అయితే సీఎం ఐయిపోయాడు.. క‌ల్వ‌కుంట్ల కుటుంబం ముక్కు పిండుతున్నారు.

అదే గ‌తంలో కేసీఆర్ ఆశించిన‌ట్టు హ‌రీష్ పార్టీ బ‌య‌ట‌కు వెళ్లి ఏ బీజేపీలోనో చేరి ఉంటే.. అప్ప‌టికి మంచి ఫామ్ లో ఉన్న బీజేపీ అధికారంలోకి వ‌చ్చి.. హ‌రీషే సీఎం అయి ఉంటే.. ప‌రిస్థితి మ‌రోలా ఉండేదిగా.. అన్న‌ది కేసీఆర్ మ‌న‌సులో మ‌రుగుతోన్న‌ట‌ ఆలోచ‌న‌ట‌.ఇదంతా ఇలా ఉంటే అల్లుడి వ‌ల్ల ఎలాగూ వ‌ర్కువుట్ కావ‌డం లేదు.. ఈయ‌న సంగ‌తి ఇలా ఉంచి.. త‌న కూతురి ద్వారా మ‌రో ప్ర‌యోగం చేసి చూద్దాం.. త‌ద్వారా ఏదైనా స‌క్సెస్ సాధించ‌వ‌చ్చేమో. పోతే వెంట్రుక వ‌స్తే కొండ‌.. అన్న కోణంలో ఇప్పుడు కూతురు క‌విత  నుంచి న‌రుక్కొస్తున్న‌ట్టుస‌మాచారం.క‌విత వ‌స్తే ఏం జ‌రుగుతుంద‌ని.. చూస్తే.. అట్ లీస్ట్ ఓట్ల‌ను చీల్చి.. బీఆర్ఎస్ కి స‌పోర్ట్ చేయ‌నైనా చేయ‌రా? అన్న‌దొక అంచ‌నా. ఆమె ఎవ‌రి ఓట్లు చీలుస్తారు? ఆమె వెన‌క దాగిన ఓటు బ్యాంకు ఎలాంటిద‌ని చూస్తే.. ఆమె తొలి నుంచి తెలంగాణ జాగృతి పేరిట తెలంగాణ ఆడ‌ప‌డుచుగా చేసిన బ‌తుక‌మ్మ‌లు మ‌హిళా లోకాన్ని ఆక‌ర్షించాయి. ఈ దిశ‌గా మ‌హిళా ఓటు బ్యాంకును కాస్త క‌వ‌ర్ చేయ‌వ‌చ్చు. ఇక పోతే బీసీ ఓటు బ్యాంకు. బీసీల వాణి వినిపించ‌డంలోనూ క‌విత ఒక ప్ర‌యార్టీగా తీసుకున్నారు. 

దానికి తోడు తెలంగాణ‌లో బీసీల గురించి భారీ ఎత్తున కొట్లాట న‌డుస్తోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ వ‌ర్సెస్ తీన్మార్ మ‌ల్ల‌న్న బీసీ పోరు షురూ  అయ్యింది. మ‌ల్ల‌న్న అయితే ఏకంగా బీసీల కోసం త‌న కాంగ్రెస్ పార్టీ స‌భ్య‌త్వాన్ని కూడా కోల్పోయాడు. రెడ్ల‌తో ఢీ అంటే ఢీ అన్నాడు. దానికి తోడు రేవంత్ రెడ్డే చివ‌రి రెడ్డి సీఎం కావాల‌ని అన్నాడు. ఈ బీసీ బ్యాగ్రౌండ్ లోకి క‌విత సైతం ప్ర‌వేశించి.. ఇక్క‌డ నాలుగు ఓట్లు చీలినా.. త‌న బీఆర్ఎస్ కి ఆమె మేలు చేసిన‌ట్టే లెక్క‌!ఇలా ప‌రి ప‌రివిధాలా ఆలోచించి క‌విత  ను ఒక బాణంగా ప్ర‌యోగించాల‌ని కేసీఆర్ చూస్తున్న‌ట్టు స‌మాచారం. ఇలా జ‌రిగే అవ‌కాశ‌ముందా? గ‌తంలో ఎవ‌రైనా ఇలా చేశారా? అని చూస్తే జ‌గ‌న్ త‌న సోద‌రి ష‌ర్మిళ‌ను కూడా స‌రిగ్గా ఇలాగే వినియోగించిన‌ట్టు ఒక టాకుండేది అప్ప‌ట్లో. ఆమె ఒక ఎమోష‌న‌ల్ డ్రామాను పండించి.. మొద‌ట ఇక్క‌డ త‌న పార్టీని తెలంగాణ‌లో తెరిచి తిరిగి అక్క‌డ ఏపీలోకి వెళ్లి.. త‌మ ఓటు బ్యాంకు చీలి కూట‌మి ప్ర‌భుత్వానికి ప‌డ‌కుండా ఒక కాపు కాచార‌న్న‌ది అప్ప‌ట్లో వినిపించిన మాట‌. 


అలా క‌విత కూడా ఒక రాజ‌కీయ ప్ర‌యోగంగా తాను సైతం త‌న బీఆర్ఎస్ కి ఒక బీ టీంని ఎందుకు ఏర్పాటు చేసుకోవ‌ద్దు? మ‌న‌కి బీజేపీకి లింకు అంట‌గ‌ట్టి ఈ బీటీ మ్ ప్రాప‌గాండా చేయించుకోవ‌డం కంటే ఇదే మేలు. అదే మ‌న ద‌గ్గ‌ర ఒక సైడు దుకాణం ఉంటే.. దానితోనే లింకు పెట్టి మాట్లాడ‌తారు. దీంతో డ్యామేజీని భారీగా మేనేజ్ చేయొచ్చుగా అన్న‌ది క‌విత త్రూ కేసీఆర్ ఆడుతున్న మ‌రో రాజ‌కీయ డ్రామాగా దీన్ని అభివ‌ర్ణిస్తున్నారు ఆర్కే రేంజ్ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు.కేసీఆర్ కి తొలి నుంచి ఇలాంటి ప్ర‌యోగాలు ముక్కుతో పెట్టిన విద్య‌. ముక్కాయ‌న ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో ప్ర‌యోగాలు చేశారు. విజ‌య‌వంత‌మైన టీఆర్ఎస్ పేరు కూడా బీఆర్ఎస్ అంటూ పేరు మార్చిన ఆయ‌న‌కు క‌విత ద్వారా మ‌రో తెలంగాణ శ‌బ్ధంతో కూడిన పార్టీ పెట్టించ‌డం ఒక లెక్క కాదు. ఇప్ప‌టికే ఈ దిశ‌గా పలు పార్టీ పేర్లు కూడా వినిపిస్తున్నాయ్. ఇక నేడో రేపో క‌విత నుంచి ఈ సౌండ్ మ‌నం విన్నా వినొచ్చ‌ని రాజ‌కీయ అభిజ్ఞాన వ‌ర్గాల భోగ‌ట్టా.

By
en-us Political News

  
బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య మాగంటి అంత్యక్రియలు నిర్వహించారు. మాగంటి అంతిమ సంస్కారాలు కన్నీటి వీడ్కోలు నడుమ జరిగాయి
నెల్లూరు రామలింగాపురం సర్కిల్‌లో దివంగత నేత ఆనం వెంకటరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అజాత శత్రువు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల కథే నా ఆత్మకథ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా స్కూల్ బీజేపీ..నా కాలేజీ టీడీపీ..నా ఉద్యోగం రాహుల్ దగ్గర అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రజలు చైతన్యంతో ఉద్యమించి ,ఎన్నికల మానిఫెస్టోలో పోలీస్ సంస్కరణలు ప్రాధాన్యత అంశంగా పెట్టించి తద్వారా రాజకీయ సంకల్పాన్ని కలిగిస్తేనే భారతదేశంలో పోలీస్ సంస్కరణలు అమలై చట్టబద్ధ పాలన సాధ్యం అవుతుందని విశ్రాంత ఐపిఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తెలిపారు.
అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి అటవీప్రాంతంలో టాస్క్ఫోర్స్ పోలీసులు భారీగా ఎర్రచందనం దుంగలతో పాటు ఒక మోటారు సైకిల్ ను స్వాధీనం చేసుకుని, నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ఆధారంగా రాసిన ప్రజల కథే నా ఆత్మకథ అనే ఆటో బయోగ్రఫీ పుస్తకావిష్కరణ హైద‌రాబాద్‌లోని శిల్పకలావేదికలో అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి నివాళులర్పించారు.
తెలంగాణ మంత్రులుగా గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో నూతన మంత్రులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు.
జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ పార్థివ దేహానికి బీఆర్‌ఎస్‌ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. మాగంటి మృతదేహానికి చూసి కేసీఆర్ కన్నీరు పెట్టుకున్నారు.
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప మందు ప్రసాదం పంపిణీని కార్యక్రమం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తెలంగాణ మంత్రి వర్గంలోకి ముగ్గురు మంత్రులు చేరబోతున్న ఎమ్మెల్యేల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
వైసీపీ నేతల అరెస్టులను జనం పట్టించుకోవడం లేదు.. కాగడా పెట్టి వెతికినా సానుభూతి కానరావడం లేదు! వైసీపీ ఆశలపై ఆ పార్టీ సానుభూతి పరుడు, జగన్ కు వీరాభిమాని అయిన ప్రొఫెసర్ నాగేశ్వర్ నీళ్లు చల్లేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.