Publish Date:Jul 22, 2025
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఛామకూర మల్లారెడ్డి కమలం గూటికి చేరనున్నారా? కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారా? అంటే తెలంగాణ రాజకీయవర్గాలలో ఔననే ప్రచారమే జరుగుతోంది. ఇటీవలి కాలంలో మల్లారెడ్డి బీఆర్ఎస్ కార్యక్రమాలలో పెద్దగా పాల్గొనడం లేదు. అదే సమయంలో ఆయన కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ అడుగులు బీజేపీవైపు పడుతున్నట్లుగా కనిపిస్తున్నది. వాస్తవానికి ప్రీతిరెడ్డి పొలిటికల్ గా యాక్టివ్ గా ఉంటారు. వచ్చే ఎన్నికలలో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు ఆమె బండి సంజయ్ ద్వారా ఆమె బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది.
ఇటీవల బోనాల వేడుకల సందర్భంగా బండి సంజయ్ ను ఆహ్వానిస్తూ , శుభాకాంక్షలు చెబుతూ పాతబస్తీలో పలు ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ ఫ్లెక్సీలలో చాలా వరకూ బీజేపీ నేతలు, శ్రేణులు ఏర్పాటు చేసినవే. అయితే బండి సంజయ్ కు స్వాగతం పలుకుతూ చామకూర మల్లారెడ్డి కోడలు ప్రీతీరెడ్డి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే బండి సంజయ్ కు విందు కూడా ఇచ్చారు. ప్రీతిరెడ్డి ఫ్లెక్సీలు, ఆమె ఇచ్చిన విందుకు బండి సంజయ్ హాజరైన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయిన తన మామ మల్లారెడ్డి అనుమతి, ఆశీర్వాదం లేకుండానే ప్రీతిరెడ్డి బీజేపీకి అనుకూలంగా ఇలా వ్యవహరిస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత కొంత కాలంగా రాజకీయంగా పెద్దగా యాక్టివ్ గా కనిపించని మల్లారెడ్డి.. బీఆర్ఎస్ కు దూరం జరుగుతున్నారన్న ప్రచారం ఇప్పటికే జోరుగా ఉంది. ప్రీతిరెడ్డి బండి సంజయ్ కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఆయనకు విందు ఇవ్వడం మల్లారెడ్డి వ్యూహమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs--mla-mallareddy-to-join-bjp-39-202441.html
ఇంగ్లండ్తో జరిగిన చివరి టెస్టులో అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లండ్ను చిత్తు చేసిన మహ్మద్ సిరాజ్పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసలు కురిపించారు.
ఉక్కు పరిశ్రమ వ్యర్థాలను సంపదగా మలచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంది.
చట్ట సభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా చేపట్టిన 72 గంటల నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
కాళేశ్వరం కమిషన్ నివేదికను త్వరలోనే శాసన సభలో ప్రవేశపెడతామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది.
ఏపీలో సెప్టెంబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఆధారంగా ఈ కొత్త బార్ పాలసీ అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు.
హైదరాబాదులో మరొకసారి భారీ వర్షం కుమ్మేసింది.. మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్డు మీద వరద నీరు ఏరులై పారాయి.
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ సెక్యూరిటీపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. జగన్ భద్రత కోసం మరో నలభై మంది ప్రైవేట్ సెక్యూరిటీ నియమించింది.
తెలంగాణ అంతర్జాతీయ స్పోర్ట్స్ చైర్మన్లు గా సంజీవ్ గోయంకా గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయంకా, యువర్ లైఫ్ సిఇఓ ఉపాసన కొణిదెల నియమితులయ్యారు.
ఏపీలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చాని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు.
కాళేశ్వరం కమీషన్ నివేదికపై మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కమీషన్ రిపోర్ట్ ఊహించిందే. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని గులాబీ బాస్ అన్నారు.
సిరాజ్ మ్యాజిక్.. విజయానికి ఏడు పరగుల దూరంలో ఇంగ్లాండ్ ఆలౌట్
ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఒవల్ లో జరిగిన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టెస్టులో హైదరాబాద్ కుర్రోడు సిరాజ్ అద్భుతంగా రాణించి భారత్ కు అసాధ్యమనుకున్న విజయాన్ని అందించాడు.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన ఇంటి అద్దె భత్యం ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఒవల్ లో జరిగిన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టెస్టులో హైదరాబాద్ కుర్రోడు సిరాజ్ అద్భుతంగా రాణించి భారత్ కు అసాధ్యమనుకున్న విజయాన్ని అందించాడు.