Publish Date:Aug 31, 2013
బ్రదర్ అనిల్ తన ఒంటికి రాజకీయాలు సరిపడవని, కలుషితమయిన ప్రస్తుత రాజకీయాలలోకి రావాలని తానెప్పుడు కోరుకోవట్లేదని అన్నారు. ఇక, రాజకీయాలు పడవంటూనే, రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమయిన వివరణ ఇవ్వాలని, ఉభయ ప్రాంత ప్రజలకి సమన్యాయం చేయాలని ఆయన కోరారు. ఇక వైయస్స్ కుటుంబ సభ్యులపై రాజకీయ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయని, జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలులో నిర్భందించడమే అందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు. స్వర్గీయ వైయస్సార్ చేసిన సేవలు, మంచి పనుల వలన ఆయన కుటుంబ సభ్యులను దేవుడు తప్పక కాపాడుతాడని ఆయన విశ్వాసం వ్యక్తం చేసారు.
ఇక, పనిలోపనిగా అయన మరొక సంచలన ప్రకటన కూడా చేసారు. తన భార్య షర్మిల రాజకీయాలలో కలకాలం కొనసాగదని తెలిపారు. గత ఏడాదిగా ఆమె సుదీర్గ పాదయాత్ర చేసి, మళ్ళీ ఇప్పుడు బస్సు యాత్రకు సిద్దపడుతున్న తరుణంలో ఆయన ఈవిధమయిన ప్రకటన చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి ఆయన ఈ ప్రకటనకు షర్మిల ఆమోదం ఉందా లేదా? అనేది తెలియదు.
ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి వచ్చే నెలలో బెయిలు దొరకకపోయినట్లయితే, అప్పుడు షర్మిలే పార్టీని నడిపించవలసి ఉంటుంది. మరి అటువంటప్పుడు ఆమె భర్త అనిల్ ఆమె రాజకీయాలలో కొనసాగదని ప్రకటించడం చాలా ఆశ్చర్యకరం. ఆమె రాజకీయాలలో కొనసాగడం అతనికి ఇష్టం లేక ఈవిధంగా అన్నారా? లేక పార్టీపై పట్టు కోసం కుటుంబం సభ్యుల మధ్య అంతఃకలహాలున్నట్లు వచ్చిన వార్తలు నిజమేనని ఆయన తన ప్రకటనతో దృవీకరిస్తున్నారా?
త్వరలో షర్మిల పార్టీలో కీలక భాద్యతలు నిర్వహించే అవకాశముందని అందరూ భావిస్తున్న తరుణంలో ఆమె అట్టే ఎక్కువ కాలం రాజకీయాలలో కొనసాగదని ఆమె భర్త ప్రకటించడం చాలా ఆశ్చర్యకరమే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brother-anil-39-25488.html
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు.
తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ పట్లే కక్షగట్టినట్లుగా వ్యవహరించారు. ఇంత కాలం తన వెన్నంటి ఉండి, తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దౌర్జన్యాలకు దిగారు. పార్టీ అధినేతపైనా, అధినేత కుటుంబంపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తల్లిలాండి భువనేశ్వరిని సైతం దుర్భాషలాడారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.