LATEST NEWS
  మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు టెంతు లక్ష్మీనరసింహాచలం అలియాస్ సుధాకర్, ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్ జిల్లాలోని జాతీయ పార్క్ వద్ద జరిగిన  ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. ఆయన తలపై రూ.50 లక్షల రివార్డు ఉంది. గత 40 ఏళ్లుగా మవోయిస్టు ఉద్యమంలో ఉన్న సింహాచలం 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంతో శాంతిచర్చల్లో కీలకంగా వ్యవరించారు. సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. ఆపరేషన్‌ కగార్‌, ఆపరేషన్‌ కర్రెగుట్టల పేరుతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో దాడులు చేస్తోంది. తమతో చర్చలు జరపాలనే మావోయిస్టు పార్టీ ఇదివరకే విజ్ఞప్తి చేసినా అ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.  ఈ మేరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్‌ల నిర్వహిస్తున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న హిడ్మాను  ఇటీవల  పోలీసులు అరెస్ట్‌ చేయగా, తాజాగా మావోయిస్టు అగ్రనేత సుధాకర్‌ మృతిచెందడం మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.  
  బెంగళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనలో  మృతి చెందిన 11 మంది కుటుంబాలకు ఆర్సీబీ పరిహారం ప్రకటించింది. రూ.10 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నట్లు తెలిపింది. ఈ ఘటనలో వారి సహాయార్థం ఆర్సీబీ కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.  ఈ దురదృష్టకర ఘటనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి  స్పందిస్తూ ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ఫ్రాంచైజీ తమ సొంత మైదానంలో నిర్వహించే కార్యక్రమాల్లో తమ ప్రమేయం ఉండదని స్పష్టం చేసింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ ఐపీఎల్ ఫైనల్ ముగిసి, బహుమతుల ప్రదానోత్సవం పూర్తయిన తర్వాత ఫ్రాంచైజీ తమ హోమ్ గ్రౌండ్‌లో ఏం చేస్తుందనే దానితో బీసీసీఐకి ఎలాంటి సంబంధం ఉండదు అని స్పష్టం చేశారు . (ఆర్సీబీ) మాకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. మా అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వారిని పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా బీసీసీఐకి లేదు" అని ఆయన స్పష్టం చేశారు.బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ లేదా వేడుకలు ప్లాన్ చేసినట్లు మాకు ఎలాంటి సమాచారం లేదు. ఎవరు దీనిని నిర్వహించారో, అంతమంది అభిమానులు ఎలా అక్కడికి వచ్చారో మాకు తెలియదు" అని సైకియా తెలిపారు.నిన్న  చిన్నస్వామి స్టేడియం ఈ ఘటనలో 11  మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నా సంగతి తెలిసిందే
  ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని లేకపోతే భవిష్యత్‌లో ఆక్సిజన్‌ మాస్కులు పెట్టుకునే పరిస్థితి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోల్కొండ ఏరియా హాస్పిటల్లో మంత్రి  మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అని సూచించారు. చెట్లు నీడ ఇవ్వడంతో పాటు ఆక్సిజన్ అందిస్తాయి. చెట్లను పెంచడం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ లో ఆక్సిజన్ పెట్టుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఢిల్లీ పొల్యూషన్ అయిపోయింది.అక్కడ నుండి ప్రజలు వేరే రాష్ట్రాలకు వలస పోతున్నారు. వాహనాలు నడిపించే పరిస్థితి లేదన్నారు. కాలుష్యాన్ని నియంత్రణ చేసుకోకపోవడం అనేక రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయని చెప్పారు. మనకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే చెట్లు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పాల్గొన్నారు.  
  వైసీపీ నేత కాకాణి గోవ‌ర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. క్వార్ట్జ్‌ అక్రమ మైనింగ్ గిరిజనులను బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన ఆయన నెల్లూరు ఐదో ఎస్సీ, ఎస్టీ అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఈ నెల 3న విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణను ఇవాళ్టి వాయిదా వేసింది. ఇవాళ కూడా మరోసారి కేసులో వాదోపవాదాలు విన్న మెజిస్ట్రేట్ విచారణను ఈ నెల 9కి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అదేవిధంగా ఇదే కేసులో కాకాణిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సాయంత్రానికి తీర్పు వెలువడే అవకాశం ఉంది.  ఏ4గా ఉన్న కాకాణిని బెంగుళూరులో ఓ రిసార్టులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించేందుకు మొదట నాయుడుపేట ఏపీపీ కేథార్ నాథ్‌ను స్పెషల్ పీపీగా బాధ్యతలు ఇచ్చి నెల్లూరుకు పంపింది ప్రభుత్వం. నేడు కేథార్ నాథ్ స్థానంలో గుంటూరు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రొసీక్యూషన్ రాజేంద్ర ప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో నెల్లూరు ఎస్సీ ఎస్టీ 5వ అదనపు ప్రత్యేక న్యాయస్థానానికి రాజేంద్రప్రసాద్ చేరుకుని కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు.
వైసీపీ నాయకులు అధికారంలో ఉండగా చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, తప్పుల కారణంగా కేసుల బారిన పడుతున్నారు. అయితే అరెస్టులు, కేసుల ద్వారా ప్రజలలో సింపతీని గెయిన్ చేయవచ్చన్న భావనతతో కేసులకు ఎదురెడుతున్నారా అన్న అనుమానం కలగక మానదు అంబటి రాంబాబు వంటి వారి తీరు చూస్తుంటే.  ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురి చేస్తున్నదని, కేసులు పెట్టి అరెస్టు చేస్తు న్నదనీ ప్రజలను నమ్మించడానికి కోరి మరీ కేసులకు ఎదురెడుతున్నారా అనిపించక మానదు బుధవారం (జూన్ 4)  జరిగిన అంబటి ఎపిసోడ్ గమనిస్తే.    గుంటూరు పట్టాభిపురంలో  వెన్నుపోటు ర్యాలీ చేస్తాం అని అంబటి రాంబాబు తమ పార్టీ కార్యకర్తలతో కలిసి బయలుదేరారు.  ఆ ర్యాలీలో పాల్గొనేందుకు కొంతమంది వైసీపీ క్యాడర్  వచ్చిన తీరు చూసి ఇలాంటి సందర్భంలో ర్యాలీలు చేస్తే శాంతి భద్రతల  సమస్య వస్తుందని, ర్యాలీకి అనుమతి లేదని చెప్పారు పోలీసులు.  దీంతో రెచ్చిపోయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులపై తన జులుం ప్రదర్శించారు. పోలీస్ అధికారిపై ఇష్టారీతిగా రెచ్చిపోయారు.   నా ర్యాలీనే అడ్డుకుంటావా?  నీకు అంత దమ్ముందా? ఏది ఆపు చూద్దాం అంటూ.. మాజీ మంత్రి అంబటి రాంబాబు కేకలు వేస్తూ  పోలీసు అధికారికి వేలు చూపించి బెదరిస్తూ. మీ సంగతి తెలుస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. అంబటి రాంబాబు చేసిన హడావిడితో, సామాన్య జనంతో పాటు, పోలీసు అధికారులు , చివరికి సొంత పార్టీ నాయకులు కూడా అవాక్కయ్యారు. ర్యాలీకి పర్మిషన్ లేదు కదా పోలీసులు చెప్పినట్లుగా విని వెళ్లిపోతే బాగుంటుంది లేదంటే అనవసరమైన కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది అని వైసీపీ క్యాడర్ భయపడ్డారు. అంబటి రాంబాబు రెచ్చిపోవడం చూసి ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన పార్టీ క్యాడర్ చాలా వరకూ జారుకుంది. ఈ విషయాన్ని వైసీపీ నేతలే అంతర్గత సంభాషణల్లో చర్చించుకున్నారు.  అయితే అంబటి రాంబాబు మాత్రం  గతంలో అధికారం ఉన్నప్పుడు ప్రజలను, పోలీసులు ను ఎలా అయితే ఓ ఆట ఆడుకున్నారో..  ఇప్పుడు కూడా అదే తరహా ఆలోచనతో పోలీసులపైనే దౌర్జన్యానికి దిగడంతో అంబటి పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు పోలీస్ అధికారులు. దీంతో గుంటూరు పట్టాభిపురం లో అంబటి రాంబాబు పై  సు నమోదు అయ్యింది.   యితే ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదైనా, అంబటి పై పోలీసులు చర్యలు లేవు. మరి ఇప్పుడు పోలీసులపైనే తిరగబడిన అంబటిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
ALSO ON TELUGUONE N E W S
2016 వ సంవత్సరంలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)హీరోగా వచ్చిన 'పెళ్లి చూపులు' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి  రీతు వర్మ(Ritu Varma). ప్రేమ ఇష్క్ కాదల్,  నా రాకుమారుడు, కేశవ, టక్ జగదీష్, వరుడు కావలెను, మజాకా వంటి విభిన్న చిత్రాలు తన ఖాతాలో ఉన్నాయి. తమిళ భాషలో కూడా రెండు చిత్రాల్లో నటించి తన సత్తా చాటింది. ఈ నెల 6 న జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న 'దేవిక అండ్ డానీ'(Devika and danny)అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా జరుగుతున్న ప్రమోషన్స్ లో భాగంగా రీతు వర్మ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు 24 క్రాఫ్ట్స్ కలిస్తేనే ఒక సినిమా రూపొందుతుంది. కానీ సినిమా ప్లాప్ అయితే చాలా సార్లు అందులో నటించిన హీరో, హీరోయిన్స్ ని నిందిస్తారు. గోల్డెన్ లెగ్ , ఐరెన్ లెగ్ అనే ట్యాగ్స్  ఇస్తుంటారు. ఒక వేళ సినిమా హిట్ అయినా అది అదృష్టానికి సంబంధించిన విషయం. చేసే ప్రతి సినిమా విజయవంతం కావాలని, ప్రొడ్యూసర్ కి లాభాలు రావాలని అనుకుంటాను. కానీ ఆ విధంగా జరగనప్పుడు బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు అలాంటి వారి గురించి పట్టించుకోకుండా  తర్వాత చెయ్యబోయే సినిమా గురించి ఆలోచిస్తున్నాను. విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకులని అలరించాలనేదే నా ప్రధాన లక్ష్యం. దేవిక అండ్ డానీ లో నా క్యారక్టర్ సహజంగా ఉండి ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతుందని చెప్పుకొచ్చింది.   
  బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్ లో ఓ సినిమా రానుందని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ పై ఆమిర్ స్పందించాడు. "నేను, లోకేష్ కలిసి ఓ సూపర్ హీరో ఫిల్మ్ చేయబోతున్నాం. ఈ బిగ్ స్కేల్ యాక్షన్ ఫిల్మ్.. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మొదలవుతుంది." అని ఆమిర్ చెప్పుకొచ్చాడు.   ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్'తో జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే 'దాదా సాహెబ్ ఫాల్కే' బయోపిక్ తో పాటు, మహాభారత ప్రాజెక్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. వీటితో పాటు సూపర్ హీరో ఫిల్మ్ కోసం లోకేష్ తో చేతులు కలుపుతున్నారు.   'ఖైదీ', 'మాస్టర్', 'విక్రమ్', 'లియో' వంటి సినిమాలతో లోకేష్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ప్రస్తుతం రజినీకాంత్ తో 'కూలీ' చేస్తున్నాడు. నాగార్జున, ఉపేంద్ర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ఆమిర్ ప్రత్యేక పాత్రలో మెరవనుండటం విశేషం. ఇలా కూలీ కోసం మొదటిసారి చేతులు కలిపిన ఆమిర్-లోకేష్.. ఆ తర్వాత ఓ భారీ యాక్షన్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది.  
తమిళ చిత్ర పరిశ్రమలో 'విశాల్'(Vishal)కి ఉన్న ప్రత్యేక స్థానం గురించి అందరకి తెలిసిందే. యాక్షన్ సినిమాలకి పెట్టింది పేరైన విశాల్ 2004 లో 'చెల్లమే' అనే మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. గత సంక్రాంతికి వచ్చిన 'మదగజరాజా' తో కలుపుకొని, ఇప్పటి వరకు సుమారు ముప్పై ఐదు చిత్రాల దాకా చెయ్యగా, నిర్మాతగాను వ్యవహరిస్తూ పలు అభిరుచిగల చిత్రాలని అందిస్తు వస్తున్నాడు. 2022 లో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్(Lyca Productions)విశాల్ పై చెన్నై హైకోర్టు లో పిటిషన్ వేసింది. సదరు పిటిషన్ లో విశాల్ తాను నటించిన 'వీరమై వాగే చూడమ్' మూవీ టైంలో 21 .29 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. డబ్బు తిరిగి ఇచ్చే వరకు ఆయన నిర్మించే సినిమా హక్కులని మాకు చెందే విధంగా ఒప్పందం కుదిరింది. కానీ 'వీరమై వాగే చూడమ్' సినిమా హక్కులని విశాల్ వేరే వాళ్లకి ఇచ్చాడని లైకాప్రొడక్షన్స్ తన పిటిషన్ లో పేర్కొంది. అప్పట్నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతుండగా, రీసెంట్ గా ఈ విషయంపై చెన్నై హైకోర్టు తన తీర్పులో, విశాల్ 30 శాతం వడ్డీతో 21 .29 కోట్లు చెల్లించాలని వెల్లడి చేసింది.  'వీరమై వాగే చూడమ్' కి విశాల్ నిర్మాతగాను వ్యవహరించాడు. కత్తి, ఇండియన్ 2 , దర్బార్,  పొన్నియెన్ సెల్వన్ పార్ట్ 1 , పార్ట్ 2 ,చంద్రముఖి 2 , లాల్ సలాం, వేట్టయ్యన్ వంటి చిత్రాలు లైకా సంస్థ నుంచి వచ్చాయి.  
  Cast: Kamal Haasan, Silambarasan, Trisha Krishnan, Abhirami, Ashok Selvan, Nasser, Aishwarya Lekshmi, Joju George  Crew:  Written by Kamal Haasan, Mani Ratnam  Music by A R Rahman  Cinematography by Ravi K. Chandran  Editing by A. Sreekar Prasad  Directed by Mani Ratnam  Produced by Kamal Haasan, R. Mahendran, Mani Ratnam, Siva Ananth, Udhayanidhi Stalin   Kamal Haasan and Mani Ratnam duo have delivered an all-time classic like Nayakudu and many have been waiting for them to re-unite from past 4 decades. Now, they have come up with Thug Life, along with Simbu and Trisha in this one. The movie released today and let's discuss about it in detail.    Plot:  Rangaraya Shaktivel (Kamal Haasan) is a powerful gangster in Delhi and he saves Amar (Silambarasan), a news paper boy during a shootout in Mumbai. Amar looses his father due to Shaktivel's elder brother Manikkam (Nasser)'s cruel act. Hence, Shakti saves Amar and promises him that he will find Chandra, Amar's sister.  Years pass, Amar becomes younger brother to Shakti and they both grow a close bond so much so that it is hard to differentiate between them. But during one attack by Sadanand (Mahesh Manjrekar), Shakti doubts Amar's involvement. In retaliation, Amar shakes hand with Manikkam and tries to kill Shakti. What happens next? Watch the movie to know more.    Analysis:  Mani Ratnam and Kamal Haasan are known for delivering such classics that people start expecting more and more from them. Something novel and innovative seems to come naturally to them but they seem to have resorted to an age old story with very lean screenplay.  The narrative feels too lethargic and very basic that you wonder if these two greats have really worked together on the script or did they just pass off something workable. Their touches show up here and there but the film is like flesh and muscles assembled together without a skeleton.  Kamal Haasan performed well within the limitations of the character. Being his long time dream to make this film, many expect it to be a much better than just a generic gangster film. Simbu is good and he did his job well. Trisha couldn't really deliver her best in this role.  Abhirami, Ashok Selvan seem wasted. Joju George also got a forgettable role. AR Rahman's music is not that effective. Technically, the de-aging and framing is again good. Still, not the work that we expect from a Mani Ratnam film. Overall, the movie feels too lethargic and is a very generic and disappointing gangster drama.    Bottomline:  Not what we expect from Mani Ratnam and Kamal Haasan combination.    Rating: 2/5    Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them.  
తారాగణం: కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి, నాజర్, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్ తదితరులు సంగీతం: ఎ. ఆర్. రెహమాన్ డీఓపీ: రవి కె. చంద్రన్ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ ప్రొడక్షన్ డిజైనర్: శర్మిష్ట రాయ్  రచన: మణిరత్నం, కమల్ హాసన్ దర్శకత్వం: మణిరత్నం నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్ బ్యానర్స్: రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిమ్స్, మద్రాస్‌ టాకీస్‌, రెడ్ జెయింట్ మూవీస్ విడుదల తేదీ: జూన్ 5, 2025   లోకనాయకుడు కమల్ హాసన్, లెజండ్రీ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో  తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'థగ్ లైఫ్' ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలా ఉందో చూద్దాం. కథ రంగరాయ శక్తివేల్ నాయకర్ అలియాస్ శక్తివేల్ రాజ్( కమల్ హాసన్) పేరున్న ఒక గ్యాంగ్ స్టర్.    రాజ్యం, అధికారం కోసం అన్నదమ్ములు, తండ్రి కొడుకులు ఒకరినొకరు చంపుకుంటారనే, భావాన్ని బలంగా నమ్ముతాడు. భార్య లక్ష్మి(అభిరామి),పెళ్లీడుకొచ్చిన కూతురు అంటే ఎంతో ప్రేమ. గతంలో శక్తివేల్, పోలీసులకి మధ్య జరిగిన కాల్పుల్లో అమర్ ( శింబు) తండ్రి చనిపోతాడు. దీంతో ఏడేళ్ల వయసున్నఅమర్ ని శక్తివేల్ తన ఇంటికి తీసుకెళ్లి కొడుకుగా పెంచుతాడు. ఆ కాల్పుల టైంలోనే ఆరేళ్ల వయసున్న అమర్ చెల్లెలు చంద్ర(ఐశ్వర్య లేష్మి) తప్పిపోతోంది.దీంతో ఎప్పటికైనా నీ చెల్లెలని నీకు అప్పగిస్తానని అమర్ కి శక్తివేల్  మాటిస్తాడు. శక్తీ వేల్ కి సంబంధించిన గ్యాంగ్ వ్యవహారాలన్నింటిని అమర్ చూస్తు ఉంటాడు. సదానంద్(మహేష్ మంజ్రేకర్) గ్యాంగ్, శక్తీ వేల్  ని చంపటానికి ట్రై చేస్తుంది. ఇంద్రాణి (త్రిష) తనకి ఇష్టం లేకపొయినా, ఒక ముఠా వల్ల కాల్ గర్ల్ గా బతుకుతుంటే, శక్తీ వేల్  ఆమెని కాపాడతాడు. ఇద్దరకీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడటంతో రిలేషన్ లో ఉంటారు. శక్తీ వేల్  కి సంబంధించిన ఒక రహస్యాన్ని అమర్ కి శక్తీ వేల్ అన్నయ్య మాణిక్యం (నాజర్) చెప్తాడు. దీంతో   అమర్ కి శక్తివేల్ శత్రువుగా మారతాడు. శక్తీ వేల్  గురించి  అమర్ కి మాణిక్యం చెప్పింది  నిజమేనా!  శక్తివేల్ ని చంపడానికి అమర్ ఏం చేసాడు?  తనని చంపాలనుకున్న అమర్ ని శక్తివేల్ ఏం చేసాడు? ఆ పోరాటంలో  ఎవరు గెలిచారు? ఎవరు బలయ్యారు?  తన చెల్లెలని   తెచ్చి ఇస్తానని అమర్ కి మాట ఇచ్చిన శక్తివేల్ అది నెరవేర్చాడా? చివరకి ఎవరి క్యారక్టర్ ఎలా ముగిసిందనేదే థగ్ లైఫ్ కథ    ఎనాలసిస్  గ్యాంగ్ స్టర్ అనే పాయింట్ ని కథావస్తువుగా ఎంచుకున్నారు గాని, దాని పరిధి ని మాత్రం ఎక్కువ గాచూపించలేదు.బయట ప్రపంచంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారో అలాగే చూపించారు. సినిమాకి కావాల్సిన నాటకీయత అనేది లోపించింది. చాలా సీన్స్ ని కావాలని పెట్టినట్టుగా అనిపిస్తుంది. సినిమా చివర వరకు ఇదే పంథాతో వెళ్లారు. ఫస్ట్ హాఫ్  విషయానికి వస్తే కమల్ హాసన్ ఎంట్రీ తో పాటు ఆయన క్యారక్టర్ చెప్పిన డైలాగులుతో, మొదటి పావుగంట ఇంట్రెస్ట్ గానే అనిపిస్తుంది. కానీ సీన్స్ వచ్చే కొద్దీ సినిమాలో ఏమి లేదని అర్ధమవుతుంది. క్యారెక్టర్స్ ఎలివేషన్ కే ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ కథని సృష్టించలేకపోయారు. అమర్ తో శక్తీ వేల్ రాజ్ తన చెల్లెల్ని ఎప్పటికైనా తెచ్చి ఇస్తానంటాడు. కాబట్టి చంద్ర క్యారక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆమెని పోలీస్ ఆఫీసర్ గా పెట్టి అమర్ కి ఆమెకి మధ్య గొడవని సృష్టించాల్సింది. దీంతో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెరిగేది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్  లో కథలో ఏమైనా స్పీడ్ ఉంటుంది అనుకుంటే అది కూడా లేదు. కమల్ పగ తీర్చుకోవడంతోనే సరిపోయింది. ఇంద్రాణిగా త్రిష క్యారక్టర్ ప్రధాన మైనస్ గా నిలిచింది. కథ లో ముఖ్యమైన క్యారక్టర్ గా ఆమెని మార్చుకోవచ్చు. కానీ ఆ విధంగా చెయ్యలేదు. ఇంద్రాణి ని అమర్ తీసుకెళ్లడం అనే పాయింట్  ని మాత్రం అసలు జీర్ణించుకోలేం. శక్తి వేల్ రాజ్ పై కోపంతోనే తీసుకెళ్లాడు. ఆమె ఒంటి మీద చెయ్యి కూడా వెయ్యలేదంటే బాగుండేది. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది    నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు కమల్ హాసన్(Kamal Haasan)మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించడంతో పాటు, రంగరాయ శక్తివేల్ నాయకర్ క్యారక్టర్ తన కోసమే పుట్టినట్టుగా జీవించాడు. కళకి సంబంధించి ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో,వాటన్నింటిలో తన గ్రిప్ ఏ మాత్రం తగ్గదని కూడా  మరోసారి చాటి చెప్పినట్టయింది..  అమర్ క్యారక్టర్ లో శింబు నటనలో మెరుపులు లేకపోయినా, పాత్ర పరిధి మేరకి బాగానే చేసాడు.   అభిరామి, నాజర్, అశోక్ సెల్వన్, జోజు జార్జ్ ,ఇలా మిగతా పాత్రల్లో చేసిన అందరు తమ పాత్రల మేరకు మెప్పించారు. ఫొటోగ్రఫీ మూవీకి ప్రాణంగా నిలిచింది. ఏ ఆర్ రెహ్మాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగున్నా, కొన్ని చోట్ల తేలిపోయింది. సీన్ కి సంబంధం లేకపోయినా మ్యూజిక్  వచ్చింది. ఇక దర్శకుడిగా మణిరత్నం సక్సెస్ అయినా కథనంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. డైలాగ్స్ తో పాటు నిర్మాణ విలువలు బాగున్నాయి.  ఫైనల్ గా చెప్పాలంటే ఒకే పాయింట్ పై సినిమా నడవడం, కథనాల్లోని లోపాలు థగ్ లైఫ్ కి మైనస్      రేటింగ్ 2 /5                                                                                                             అరుణా చలం   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them.     
  ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం పి. మహేష్ బాబు దర్శకత్వంలో 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రామ్ నెక్స్ట్ మూవీ సైతం మైత్రి బ్యానర్ లోనే రూపొందనుందని తెలుస్తోంది. ఈ మూవీని శివ నిర్వాణ డైరెక్ట్ చేసే అవకాశముందని సమాచారం.   'నిన్ను కోరి', 'మజిలీ' సినిమాలతో ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు శివ నిర్వాణ. మూడో చిత్రం 'టక్ జగదీష్' నేరుగా ఓటీటీలో విడుదలైంది. గత చిత్రం 'ఖుషి' భారీ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టి, ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయింది. ఈ చిత్రాన్ని మైత్రి సంస్థ నిర్మించడం విశేషం. అయితే 'ఖుషి' ఆశించిన విజయాన్ని అందుకోనప్పటికీ.. శివ నిర్వాణ ప్రతిభ మీద నమ్మకంతో.. మైత్రి మరో సినిమా నిర్మించడానికి సిద్ధమైనట్లు వినికిడి.    శివ నిర్వాణ ఓ మంచి కథని సిద్ధం చేశాడని, అది రామ్ కి సరిగ్గా సరిపోయేలా ఉందని అంటున్నారు. ఇప్పటికే మైత్రి వీరిద్దరి మధ్య మీటింగ్ ఏర్పాటు చేసిందని, శివ చెప్పిన స్టోరీ లైన్ కి రామ్ ఇంప్రెస్ అయ్యాడని టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.  
  2025 సంక్రాంతికి 'విశ్వంభర'తో చిరంజీవి, 'మాస్ జాతర'తో రవితేజ బాక్సాఫీస్ బరిలో దిగాలనుకున్నారు. కానీ, ఆ రెండు సినిమాలు ఆలస్యమయ్యాయి. 'విశ్వంభర' కొత్త విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. 'మాస్ జాతర' మాత్రం ఆగస్టు 27న థియేటర్లలో అడుగుపెట్టనుంది. అయితే 2025 సంక్రాంతి మిస్ అయినప్పటికీ.. 2026 సంక్రాంతి పోరుకి చిరంజీవి, రవితేజ సై అంటున్నారు.   చిరంజీవి తన 157వ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. 2026 సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు వచ్చే పొంగల్ రేస్ లోకి రవితేజ కూడా ఎంట్రీ ఇచ్చారు.   రవితేజ తన 76వ చిత్రాన్ని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్నారు. ఎస్.ఎల్.వి. సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. పూజా కార్యక్రమాలతో తాజాగా మొదలైంది. అంతేకాదు, ఈ సినిమాని 2026 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.    మరోవైపు, 2026 పొంగల్ కి 'అనగనగా ఒక రాజు'తో నవీన్ పోలిశెట్టి కూడా కర్చీఫ్ వేసి ఉన్నాడు. మరి వీటిలో చివరికి ఏవి పోరులో నిలుస్తాయో? నిలిచిన వాటిలో ఏవి విజయం సాధిస్తాయో? చూడాలి.    
Cast: Pankaj Tripathi, Mohammed Zeeshan Ayyub, Surveen Chawla, Asha Negi, Khushboo Atre, Mita Vashisht, Shweta Basu Prasad, Barkha Singh, Khushi Bharadwaj Crew:  Created by Harman Wadala, Rahul Ved Prakash, Varsha Ramachandran, Riya Poojary Written by Harman Wadala, Sandeep Jain, Sameer Mishra Directed by Rohan Sippy Produced by Sameer Nair, Deepak Segal, Sameer Gogate Genre: Crime, Legal drama, Thriller OTT Platform: Jio Hotstar Criminal Justice series has been successful as an Indian legal drama with Pankaj Tripathi in the lead role. His character Advocate Madhav Mishra has been consistently loved by audiences because of his likeable performance. In the previous season, Shweta Basu Prasad came into the mix and now, Mohammed Zeeshan Ayyub, Surveen Chawla, Asha Negi have been added into important characters. Let's discuss about this Family Matter being dragged to court in detail.  As only three episodes have been released, we cannot give a complete plotline but Madhav Mishra is now defending Raj Napal (Mohammed Zeeshan Ayyub) who is believed to have murdered nurse Roshni Saluja (Asha Negi) at his daughter's birthday party. Anju Nagpal (Surveen Chawla, Raj's wife is trying to hard to prove the truth.  As per the first three episodes released, this season is not as good as the first three. From the first episode itself, the drama looks very unconvincing and farcical. The drama tries to showcase how Madhav Mishra is also growing a reputation and tries to give him more character but it fails to establish the case as well as it did in previous seasons.  Here, even the performances feel a little bit off and too melodramatic. The series needed much more grounded approach from the first minute rather than it going into this dramatic zone. Being a legal drama, it needed a lot more grounded approach. Pankaj Tripathi is likeable but as Madhav Mishra, he needs much more writing help and this character seems to have gone stale. Surveen Chawla and Mohammad Zeeshan Ayyub don't get great start.  Early in the show, it might not be great to judge complete one but the start is not that interesting or inspiring for needing more. Let's hope the season 4 does redeem itself in upcoming episodes and deliver better.  Rating: 2.25/5 (for first three episodes) Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them.    
  సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల సినిమా వేదికలపై మాట్లాడుతున్న మాటలు వివాదాస్పదమవుతున్నాయి. ముఖ్యంగా రీసెంట్ గా ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఆలీని ఒక బూతు మాట అనేశారు. రోజాని దాన్ని అన్నారు. ఇలా రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి. దీనిపై స్పందించిన రాజేంద్రప్రసాద్.. చనువు ఉన్నవారినే అలా సరదాగా అంటుంటానని చెప్పారు. ఆలీ కూడా రాజేంద్రప్రసాద్ కావాలని అనలేదని, ఈ విషయాన్ని పెద్దది చేసి చూడొద్దని కోరారు. తాజాగా ప్రముఖ నటుడు అశోక్ కుమార్ ఈ అంశంపై స్పందించారు.    రీసెంట్ గా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రాజేంద్రప్రసాద్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు అశోక్ కుమార్. "మా తరం నటీనటులంతా సరదాగా ఉంటాం. ఆ చనువుతో షూటింగ్ లొకేషన్స్ లో ఏరా అని మాట్లాడుకుంటాం. అయితే పదిమందిలో ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. కానీ ఒక్కోసారి మనకి తెలియకుండానే మాట్లాడేస్తుంటాం. బయట ఉన్న రిలేషన్, చనువుతో ఫ్లోలో ఏదోకటి అనేస్తుంటాం. వాటిని చూసీ చూడనట్టు వదిలేయాలి. ఆలీ కూడా స్టేట్ మెంట్ ఇచ్చాడు. వాళ్ళిద్దరి రిలేషన్ బాగున్నప్పుడు.. మిగతా వాళ్ళు దానిని పెద్దది చేసి చూడకూడదు. నన్ను రాజేంద్రప్రసాద్ బయట ఏరా అంటారు. ఆ చనువుతో ఒక ఈవెంట్ లో ఏరా నీ గుండు మీద ఒట్టు అన్నారు. దానిని నేను సరదాగా తీసుకున్నాను. కానీ, కొందరు మాత్రం అశోక్ కుమార్ మీద నోరు జారిన రాజేంద్రప్రసాద్ అని రాసేశారు. నాతో ఉన్న చనువు కొద్దీ ఫ్లోలో ఆయన అలా అనేశారు అంతే." అని అశోక్ కుమార్ చెప్పుకొచ్చారు.    
అల్లు అర్జున్,(Allu arjun)మంచు మనోజ్(Manchu Manoj),అనుష్క(Anushka)ముఖ్య పాత్రల్లో క్రిష్ కాంబోలో తెరకెక్కిన మూవీ 'వేదం'(Vedam). 2010 జూన్ 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీని బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించగా, మంచి విజయాన్ని నమోదు చేసింది. నటుడుగా అల్లుఅర్జున్ కెరీర్ ని ఒక మలుపు తిప్పి ఒక కొత్త ఇమేజ్ ని క్రియేట్ చేసింది. నేటితో ఈ మూవీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఎక్స్(X)వేదికగా వేదం షూటింగ్ అప్పటి ఫోటోలని షేర్ చేస్తూ 'వేదం నా కెరీర్  లో ఒక విభిన్నమైన చిత్రం. ఎంతో నిజాయితితో తెరకెక్కించిన క్రిష్(Krish)కి నా కృతజ్ఞతలు. అనుష్క, మంచు మనోజ్, మనోజ్ బాజ్ పేయి లాంటి నటులతో పని చెయ్యడం నాకు ఎంతో ప్రత్యేకం. సినిమాని నిర్మించిన నిర్మాతలతో పాటు సంగీతాన్ని అందించిన కీరవాణి(Keeravani)కి నా హృదయ పూర్వక అభినందనలు. ఈ సినిమాని ఆదరించి, ఎప్పటికి నిలిచిపోయే చిత్రంగా మలిచిన అభిమానులకి నా కృతజ్ఞతలని ట్వీట్ చేసాడు.   విభిన్న పద్ధతులని, జీవన శైలిని కొనసాగిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రవాదుల నుంచి ప్రజలని కాపాడుకోవడానికి  తమ ప్రాణాలని తృణప్రాయంగా త్యాగం చేసే క్యారక్టర్ లలో అల్లు అర్జున్, మంచు మనోజ్ ఒదిగిపోయి నటించారు. మంచి మనసున్న, నిజాయితీతో కూడుకున్న వేశ్య క్యారక్టర్ లో అనుష్క జీవించిందని చెప్పవచ్చు.        
ఆశనిరాశల్ని..... విజయవైఫల్యాల్ని మైలురాళ్ళుగా మిగిల్చి మరో సంవత్సరం మన కళ్ళముందు నుంచి కనుమరుగయింది. సరికొత్త సవాళ్ళతో మనం ఎంత సాహసి కులమో తేల్చేందుకు కొత్త సంవత్సరం స్వాగతించింది. నిజానికి కాలానికి తరతమ భేదాలుండవు. అందరికీ మంచినే పంచాలనుకుంటుంది. కాని ఎవరి ప్రయత్నాన్ని బట్టి వారికి ఆ యా ఫలితాల్ని ప్రసాదిస్తుంది. అందుకే ఆశావహులకు బృందావనమైతే... నిరాశావాదులకు అదే కాలం కాటేసే కాలనాగవుతుంది.  గతాన్ని గతంలోనే పూడ్చిపెట్టి... సరికొత్త ఆశలతో ముందుకు సాగిపోవాలి. అందుకోసం అందరూ పాటించాల్సిన కొన్ని విషయాలివి. అస్పష్టం... అనాలోచితం ప్రస్తుతం చాలా సందర్భాల్లో విఫలమవడానికి కారణం మన పరిధిని, మన సామర్ధ్యాన్ని మనం సరిగ్గా అంచనా వేసుకోకపోవడం. ఫలితంగా చాలా మంది జీవితాలు అస్పష్టంగా, అనాలోచితంగా సాగిపోతున్నాయి. ఆంగ్ల విద్యావేత్త బ్రెండన్ 'once we accept our limits, we go beyond them' అంటారు. ముందు మన పరిమితుల్ని, వనరుల్ని తెలుసుకోగలగాలి. కాని దురదృష్టవశాత్తూ మనలో చాలామంది వయసు మించిపోతున్నా వారి వారి సామర్ధ్యాల్ని గుర్తించి మసలుకోలేకపోతున్నారు. పరుగులయితే పెడుతున్నాం... కానీ ఎక్కడికో చెప్పలేకపోతున్నాం. అలసిపోతున్నాం.  కాని అసలు ఎందుకో తెలుసుకోలేకపోతున్నాం. అందుకే ముందు ఈ కొత్త ఏడాది లోనైనా మన గమ్యం పట్ల పూర్తి స్పష్టతను ఏర్పరచుకుంటే మంచిది. దానికి అనుగుణంగా మన గమనాన్ని నిర్దేశించుకావాలి.  ఆధునిక బలహీనతలు.. అష్టకష్టాలు.. సహజంగా మనలో ఉండే బలహీనతలకు తోడు నేడు ఆధునికమైనవి కూడా వచ్చి తోడయ్యాయి. అసలే కోతి, ఆపై పిచ్చి, కల్లు తాగి, నిప్పులు తొక్కి.... అన్నట్లుగా మారిపోయింది ప్రస్తుతం మన మనఃస్థితి. యుక్తవయసులో అసలే కుదురుగా ఉండని మనస్సును సెల్ఫోన్లు, ఇంటర్నెట్లు మరింత ఇరకాటంలో పడేశాయి. ఆధునిక మానవుడికి సెల్ఫోన్ రూపంలో మరో శరీరభాగం వచ్చి చేరినట్లయింది. విలాసాల్ని అవసరాలుగా భ్రమించడం వల్లనే ఈ ప్రమాదమంతా.   ఇవి మానసికంగా, శారీరకంగా ఎంత బలహీనుల్ని చేస్తున్నాయో యువతీయువకులు గమనించడం లేదు. ముఖ్యంగా జీవితానికి పటిష్టమైన మార్గాన్ని నిర్మించుకోవలసిన విలువైన ప్రాయంలో ఇవి  ఏకాగ్రతను ఛిన్నాభిన్నం చేస్తాయి. 'simple living high thinking'  ను  జీవనశైలికి మలచుకోవాలి. అలా చేస్తే ఈ ఆధునిక బలహీనతల నుండి బయటపడవచ్చు. ఆహారాలు... ఆహార్యాలు... భగవద్గీతను చదవడం కన్నా ముందు ఫుట్బాల్ ఆడి శరీరాన్ని దృఢం చేసుకోండి.  మానసికంగా, శారీరకంగా బలహీనపరిచే దేనినయినా విషంలా తిరస్కరించండి అనే వారు స్వామి వివేకానంద. బాణం గురి చేరాలంటే ముందు ధనుస్సు బలంగా ఉండాలి. ధనుస్సే బలహీనంగా ఉంటే, ఇక బాణం గురించి చెప్పేదేముంటుంది. ఆధునికత పేరుతో అస్తవ్యస్తమైన ఆహార, ఆహార్యాల వెంట పరుగులు తీస్తున్నాం. అందుకే మనలో చాలామంది ముఖాల్లో కృత్రిమ కాంతులు.... అద్దకపు అందాలు. వీటన్నింటికీ కారణం మన జీవనంలో సహజత్వం లోపించడం. పసిబిడ్డ ఉగ్గుపాల నుంచి పండ్లరసాల వరకు అన్నింటినీ మార్కెట్లలో కొనుగోలు చేస్తున్నాం. భారతీయ జీవనవిధానానికి సరిపోలని సంస్కృతుల్ని దిగుమతి చేసుకొని మనకు మనమే కృతకంగా బ్రతుకులీడుస్తున్నాం. ఆహార, ఆహార్యాలనేవి వారి వారి భౌగోళిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా వారసత్వంగా సంక్రమిస్తూ ఉంటాయి. ఒకరు ఇంకొకరి ఆహార, ఆహార్య, ఆచారాలను గుడ్డిగా అనుకరించడం వలన పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా మారిపోతుంది. అందుకే భౌతికంగా, బౌద్ధికంగా మనల్ని ధీరోదాత్తులను చేసే జీవనశైలిని అలవరచుకుంటే కొత్త ఏడాదిలో జీవితం విజయానికి చేరువ అవుతుంది.                                              *నిశ్శబ్ద.
పిల్లల పెంపకం ఒక కళ.  చాలామంది పిల్లలకు ఆహారం ఇవ్వడం, వారికి కావలసిన వస్తువులు సమకూర్చడం,  చదువు చెప్పించడం మొదలైనవి చేయడమే పిల్లల పెంపకం అనుకుంటారు. కానీ ఇవన్నీ పిల్లలకు అవసరమైనవి.. ఇవి మాత్రమే కాకుండా వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే విషయాలు కూడా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. కొన్ని పద్దతులు,  విలువలు అలవాటు చెయ్యాలి.  5ఏళ్ల లూపే పిల్లలకు పిల్లలకు 5 విషయాలు తప్పక నేర్పిస్తే పిల్లలు వాటిని  జీవితాంతం వాటిని వదిలిపెట్టరు. అది వారి జీవితాన్ని బంగారంలా మారుస్తుంది. పిల్లలు దుఃఖం, బాధ, కోపం, సంతోషం మొదలైన భావోద్వేగాలను చాలా తొందరగా వ్యక్తం చేస్తారు. అయితే వీటిని వ్యక్తం చేసే విధానం ఒకటి ఉంటుంది.  ఆ విధానంలో వ్యక్తం చేయడం నేర్పిస్తే పిల్లలు దృఢంగా ఉంటారు.  దీన్ని 5 ఏళ్లలోపే పిల్లలకు నేర్పించాలి. ఇతరులను గౌరవించడం గొప్ప గుణం.  దీన్ని చిన్నతనం నుండే పిల్లలకు నేర్పించాలి.  భావోద్వేగాలు ఎంత ఉన్నా, ఎంత కోపం,  అసహనం ఉన్నా   ఇతరులను అవమానించి మాట్లాడకూడదని,  ఒకచోట కోపాన్ని ఇంకొక చోట తీసుకురాకూడదని చెప్పాలి.  తప్పులు ఎప్పుడూ అనుభవాలుగా,  గొప్ప పాఠాలుగా సహాయపడతాయి.  అయితే పిల్లలు మాత్రం తప్పు చేస్తే తప్పించుకోవడం, దాచిపెట్టడం చేస్తారు. కానీ పిల్లలు తాము చేసిన తప్పుల నుండి తప్పించుకోకుండా, దాచిపెట్టకుండా  వాటిని ఒప్పుకునేలా అలవాటు చెయ్యాలి. తాము తప్పు చేసినా, ఇతరులను నొప్పించినా పరిస్థితులకు అనుగుణంగా సారీ చెప్పడం, కృతజ్ఞత వెలిబుచ్చడానికి  థ్యాంక్స్ చెప్పడం  వంటివి పిల్లలకు నేర్పించాలి. ఎవరైనా తమను బాధపెడితే వారిని  క్షమించే తత్వాన్ని పిల్లలకు నేర్పించాలి. సమస్యలు అందరికీ వస్తాయి.  వయసుకు తగిన సమస్యలు ఉండనే ఉంటాయి.  అయితే  పిల్లలకు ఏ సమస్య వస్తుందో అని పెద్దలు ఎప్పుడూ గాభరా పడుతూ ఉంటారు.కానీ ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం కోసం పిల్లలే ఆలోచించేలా వారికి అలవాటు చెయ్యాలి.  ఇది వారి భవిష్యత్తును అందంగా మారుస్తుంది. ఒకరి మీద ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు భవిష్యత్తులో లీడర్ షిప్ క్వాలిటీస్ పెరగడానికి దోహదం చేస్తుంది.                                                      *రూపశ్రీ.
  రిలేషన్ షిప్ లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ప్రేమ జంట అయినా, భార్యాభర్తలైనా  ప్రతి ఒక్కరూ తమ భాగస్వామితో సమయం గడపాలని, మాట్లాడాలని కోరుకుంటారు. అయితే ఒకరికొకరు దూరంగా అంటే  వేర్వేరు ప్రదేశాలలో ఉన్న జంటలు ఒకరితో ఒకరు సమయం గడపడం కొంత కష్టమే. వారి మధ్య కమ్యూనికేషన్ మాత్రమే సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. కమ్యూనికేట్ చేయడానికి భార్యాభర్తలు ఒకరికొకరు కాల్ చేసుకోవచ్చు, వీడియో కాల్‌లు చేయవచ్చు లేదా మెసేజ్ లు కూడా  పంపవచ్చు. బిజీ లేదా ఇతర కారణాల వల్ల భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఫోన్‌లో మాట్లాడుకోలేక పోయినట్లయితే, రోజంతా కొన్ని మెసేజ్‌ల ద్వారా భాగస్వామికి తాను దూరంగా లేడనే భావన కలిగించవచ్చు. అయితే, కొన్నిసార్లు ఈ మెసేజ్లు  భార్యాభర్తల మధ్య వివాదాలకు కూడా కారణం అవుతాయి.  భార్యాభర్తలు పొరపాటున కూడా కొన్ని మెసేజ్ లను తమ భాగస్వామికి  పంపకూడదు. అవేంటంటే.. రెస్పాండ్ కావడం.. భార్యాభర్తలు దూరంగా ఉన్నప్పుడు వారి మధ్య మెసేజ్ లలో జరిగే కమ్యూనికేషన్ ఎంత సరదాగా ఉంటుందో.. ఏదైనా తేడా జరిగితే చాలా ప్రభావవంతంగా కూడా ఉంటుంది.  ముఖ్యంగా భార్యలు ఏవైనా మెసేజ్ పెట్టినప్పుడు భర్తలు లేదా అబ్బాయిలు ఎక్కువగా రెస్పాండ్ కారు.కేవలం ఒక ముక్క లేదా ఒక మాటతో లేదా ఎమోజీలతో, స్చిక్కర్లతో  రిప్లే ఇస్తుంటారు.  ఇది కమ్యూనికేషన్ పట్ల అనాసక్తిని వ్యక్తం చేస్తుంది. అందుకే భార్యాభర్తలు ఒకరికొకరు మెసేజ్ చేసుకొనేటప్పుడు స్పష్టంగా ఉండాలి. కోపం.. కోపం బంధాలను విచ్చిన్నం చేస్తుంది.  భార్యాభర్తలు మెసేజ్ చేసుకొనేటప్పుడు కోపం ప్రదర్శించడం కాదు.  భార్యలు ఎప్పుడూ భర్తల గురించే ఆలోచిస్తారు.  భార్యలు మెసేజ్ చేసినప్పుడు వారికి ఇచ్చే రిప్లే కోపంతో కూడుకుని ఉండకూడదు.  ఒకవేళ కోపంగా ఉన్నప్పుడు మెసేజ్ చేసినా, కాల్ చేసినా కొంచెం సేపటి తరువాత టచ్ లోకి వస్తాను అని చెప్పి కొద్దిసేపు మౌనంగా ఉండిపోవాలి. ఆ తరువాత సహజంగా మాట్లాడాలి. పదే పదే.. భర్త లేదా భార్య ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.  భార్య భర్తకు అయినా,  భర్త భార్యకు అయినా పదే పదే నాన్ స్టాప్ గా మెసేజ్ లు చేయకూడదు.  ఒకసారి మెసేజ్ చేశాక అవతలి నుండి రెస్పాన్స్ లేకపోతే ఏదైనా పనిలో ఉన్నారని అర్థం చేసుకోవాలి.   ముఖ్యంగా మహిళలు     ఈ విషయంలో కంగారు పడుతూ ఉంటారు.  భర్త తొందరగా స్పందించకపోతే ఏం జరిగిందో అని గాబరా పడతారు. కానీ  అవతల వారిని అర్థం చేసుకోవాలి. భర్తలు కూడా భార్య మెసేజ్ లు చూసిన తరువాత కాల్ చేసి మాట్లాడటం మంచిది. గొడవలు వద్దు.. మెసేజ్ లో ఏ విషయాలు అయినా సాధారణ పలకరింపులు,  బాగోగులు అడిగి తెలుసుకోవడం, ఏవైనా కబుర్లు చెప్పుకోవడం మంచిది.  దేని గురించి అయినా ప్రశ్నించడం, సీరియస్ విషయాల గురించి అడగటం చేయకూడదు.  ఇలాంటివన్నీ నేరుగా మాట్లాడుకోవడం మంచిది.  లేకపోతే ఇద్దరి మధ్య గొడవలు, అపార్థాలు పెరుగుతాయి.                                                              *రూపశ్రీ.
  కొలెస్ట్రాల్ అనేది ఒక ప్రధాన  సమస్యగా మారుతోంది.  దీనికి సరైన ఆహారం, దిగజారుతున్న జీవనశైలి, ఒత్తిడి. కారణం అవుతున్నాయి. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్‌ విషయంలో ఆహారపు అలవాట్లు కూడా చాలా బాధ్యత వహిస్తాయి. అయితే డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా గుండె  ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్‌లను తినకూడదని కొందరు హెచ్చరిస్తుంటారు. ఈ వాదనలో నిజమెంతో తెలుసుకుందాం.  జీడిపప్పులో ఉండే పోషకాల గురించి మాట్లాడితే, ఆరోగ్యానికి అవసరమైన 44 శాతం కొవ్వు, 30 శాతం కార్బోహైడ్రేట్స్, 18 శాతం ప్రోటీన్లను కలిగి ఉంటుంది. జీడిపప్పు పోషకాల పవర్ హౌస్‌గా పరిగణిస్తారు. పోషకాలు అధికంగా ఉండే జీడిపప్పు వినియోగం కొలెస్ట్రాల్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంతో తెలుసుకుందాం.  జీడిపప్పు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? జీడిపప్పు అనేది డ్రై ఫ్రూట్, ఇది కొలెస్ట్రాల్‌ను పెంచని ఆహారం. సాధారణంగా జంతు ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే జీడిపప్పులో మాత్రం జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. జీడిపప్పు చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్‌డిఎల్‌ను తగ్గించడమే కాకుండా, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులను కూడా నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.  నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీడిపప్పు మొక్కల ఆధారిత ఆహారం. జీడిపప్పులో ఉండే కొవ్వులో ఎక్కువ భాగం స్టెరిక్ యాసిడ్ నుండి వస్తుందని, ఇది రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్‌పై ఎటువంటి ప్రభావం చూపదని అనేక పరిశోధనలలో నిరూపించారు. రోజుకు గుప్పెడు జీడిపప్పులు తినడం వల్ల గుండెకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.  జీడిపప్పు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది జీడిపప్పు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీడిపప్పు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీడిపప్పులో ఉండే మెగ్నీషియం గుండె జబ్బులను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆహారంలో తగినంత మొత్తంలో మెగ్నీషియం తీసుకోవడం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.    గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఆధునిక జీవనశైలి,  ఫాస్ట్ ఫుడ్ తినడం మొదలైనవి   ఆరోగ్యంపై అనేక విధాలుగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. వీటి కారణంగా  మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్స్,  ప్రాసెస్ చేసిన ఫుడ్స్ లో  ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు,  ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి.  ఇవి శరీరం డీహైడ్రేషన్ కు గురికావడం,  మూత్రపిండాల పనితీరు బలహీనపడటానికి దారితీస్తాయి. మూత్రపిండాల్లో లవణాలు,  ఖనిజాలు స్ఫటికీకరించడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల  మూత్రపిండాల్లో రాళ్లు నివారించవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం ఒక సాధారణ సమస్యగా మారుతున్నప్పటికీ, వాటిని నివారించడం సులభం. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం, సమతుల్య ఆహారం,  సహజ మూలికల వాడకంతో  రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పడకూడదు అంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాలి.. హైడ్రేషన్:  మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి  హైడ్రేటెడ్ గా ఉండటం. "రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు త్రాగడం వల్ల రాళ్లు ఏర్పడటానికి దోహదపడే కాల్షియం, యూరిక్ యాసిడ్, ఆక్సలేట్‌ల వంటి ఖనిజాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. సాధారణ నీటితో పాటు, కొబ్బరి నీరు, బార్లీ నీరు అద్భుతంగా సహాయపడతాయి.  శరీరం నుండి విషాన్ని తొలగించడాన్ని ప్రోత్సహిస్తాయి.  నిమ్మకాయలు,  నారింజ వంటి సిట్రస్ పండ్లు కూడా మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సహాయపడతాయి. ఎందుకంటే వాటిలో ఉండే సిట్రేట్లు ఆక్సలేట్‌లు స్ఫటికాలను ఏర్పరిచే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. సరైన హైడ్రేషన్ మూత్రపిండాలలో ఖనిజాలు పేరుకుపోకుండా మూత్రపిండాల పనితీరు మెరుగ్గా ఉండేలా చేస్తాయి.   మూలికలు.. కొన్ని మూలికలు మూత్రపిండాల పనితీరుకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి.  రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తాయి. సహజ నివారణలు విషాన్ని బయటకు పంపడంలో, ఖనిజాలు పేరుకుపోకుండా నిరోధించడంలో,  మొత్తం మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అత్యంత ప్రభావవంతమైన మూలికలు.. పునర్నవ .. ఇది సహజ మూత్రవిసర్జనగా పనిచేస్తుంది, అదనపు ద్రవాలు, విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. గోక్షుర .. మూత్రపిండాల పనితీరుకు మద్దతు ఇస్తుంది,  ఖనిజ స్ఫటికీకరణను నిరోధించడంలో సహాయపడుతుంది. అరటి కాండం రసం.. మూత్రపిండాల్లో రాళ్లను విచ్ఛిన్నం చేసి బయటకు పంపుతుంది. శతావరి.. మూత్రపిండాల వడపోతను పెంచుతుంది, ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది. బూడిద గుమ్మడికాయ రసం.. 95 శాతం నీటి శాతం,  ఆల్కలీన్ లక్షణాలతో ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.  రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ల నివారణకు ఆహార విధానాలు.. కాల్షియం తీసుకోవడం పెంచాలి..  కాల్షియం గట్‌లోని ఆక్సలేట్‌లతో బంధిస్తుంది, మూత్రపిండాలలో వాటి స్ఫటికీకరణను నిరోధిస్తుంది. సోడియం వినియోగాన్ని పరిమితం చేయాలి.. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల కాల్షియం విసర్జన పెరుగుతుంది, రాళ్ళు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలను తగ్గించాలి.. పాలకూర, దుంపలు,  బెండకాయలు వంటి ఆహారాలను మితంగా తినాలి,  వాటి ప్రభావాలను సమతుల్యం చేయడానికి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలతో జత చేయాలి. ఆల్కలీన్ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.. దోసకాయలు, పుచ్చకాయ,  కొబ్బరి నీరు మూత్రంలో ఆరోగ్యకరమైన pH సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. జంతు ప్రోటీన్‌ను పరిమితం చేయాలి.. మాంసం, గుడ్లు,  చేపలను అధికంగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  మన శరీరంలోని అన్ని భాగాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి, అందుకే ఏదైనా ఒక భాగంలో సమస్య తలెత్తితే అది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా గుండె-ఊపిరితిత్తుల వంటి అవయవాలలో ఏర్పడే సమస్యల గురించి మనమందరం  అప్రమత్తంగా ఉంటాము. ఆ సమస్యల గురించి తెలుసుకుని జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ కళ్ళు,  చెవులు వంటి అవయవాల ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ చూపం. ఆరోగ్య నిపుణులు  కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. కానీ ఈ అవయవాలలో సమస్యలు  తీవ్రమైన దుష్ప్రభావాల ప్రమాదాన్ని కూడా కలిగిస్తాయి. చాలామంది చెవులలో ఒకరకమైన శబ్ధం రావడం గమనిస్తుంటారు. ఇదొక టోన్ లాను, సముద్రపు హోరు లానూ, బీప్ వంటి శబ్ధం లాను ఉంటుంది. చాలామంది ఇదేమి చేస్తుందిలే.. తగ్గిపోతుంది. మనకు బాగా వినిపిస్తోంది కదా అనే నిర్లక్ష్యంతో పట్టించుకోరు. కానీ ఈ చెవి సమస్యను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇది  దీర్ఘకాలిక ప్రమాదాలను కలిగి ఉండే ప్రమాదముంది. ఇలా శబ్ధం వినిపించడాన్ని టిన్నిటస్ అని అంటారు.  టిన్నిటస్ సమస్య..  టిన్నిటస్ సమస్యలో  చెవులలో ఒకటి లేదా రెండింటిలో రింగింగ్ లేదా ఇతర శబ్దాలు వినిపిస్తుంటాయి. ఇవి బయట నుండి వినిపించేవి కాదు. ఈ శబ్దాలు కేవలం ఈ సమస్య ఉన్నవ్యక్తులకే వినిపిస్తుంది . ఇతరులు దీన్ని వినలేదు. టిన్నిటస్ అనేది చాలా సాధారణ సమస్య  15% నుండి 20% మంది వ్యక్తులను ఇది ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా వృద్ధులలో ఇది వస్తుంటుంది. సాధారణంగా టిన్నిటస్ అనేది అంతర్లీన సమస్య వల్ల వస్తుందని, దానిని గమనించి చికిత్స చేయవలసి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చెవి గాయం లేదా ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు.. ఆరోగ్య నిపుణులు, టిన్నిటస్ ను సాధారణంగా వయస్సు-సంబంధిత వినికిడి లోపం, చెవి గాయం లేదా ఇన్ఫెక్షన్  వంటి అంతర్లీన సమస్య వల్ల సంభవించవచ్చని చెబుతున్నారు. ఈ పరిస్థితులను సకాలంలో గుర్తించకపోతే లేదా చికిత్స చేయకపోతే, దీని కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.  టిన్నిటస్ సమస్యకు  జలుబు వంటి ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కూడా కారణం కావచ్చు, దీని గురించి కూడా శ్రద్ధ వహించాలి. ఈ సమస్యకు  సమయానికి చికిత్స చేయకపోతే, ఇది చెవికి సంబంధించి అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది, చెవుడు కూడా వ్వచే అవకాశం ఉంటుంది.  వినికిడి సమస్య శాశ్వతంగా తగ్గిపోవచ్చు.. ఆరోగ్య నిపుణులు అంటున్నారు, మన చెవి లోపలి భాగంలో చిన్న, సున్నితమైన కణాలు ఉంటాయి, అవి ధ్వని తరంగాలను స్వీకరించినప్పుడు కంపిస్తాయి. లోపలి చెవిలో ఏదైనా సమస్య ఉంటే, అది టిన్నిటస్‌కు కూడా కారణమవుతుంది.  సమయానికి చికిత్స చేయకపోతే, చెవుల శక్తి  తగ్గిపోతుంది. ఇది కాకుండా, చెవి ఇన్ఫెక్షన్ లేదా చెవిలో ఏవైనా అడ్డుపడటం వల్ల కూడా  ఈ సమస్య రావచ్చు. చెవి ఇన్ఫెక్షన్‌కు సకాలంలో చికిత్స అందకపోతే, మెదడు మాత్రమే కాకుండా ఇతర భాగాలపై కూడా దాని ప్రభావం పడే ప్రమాదం ఉంది.                              *నిశ్శబ్ద.