Publish Date:Oct 31, 2013
సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ విభజనకు వ్యతిరేఖంగానో, అనుకూలంగామాట్లాడుతూనో అదీ వీలుకాకపోతే ఇంట్లో దుప్పటి ముసుగేసి పడుకొనో కాలక్షేపం చేసేస్తున్నారు. కానీ పాపం! బొత్సబాబుకే ఏమి మాట్లాడాలో తెలియక, ఏదేదో మాట్లాడేస్తూ తన ఆ జ్ఞానమంతా బయటపెట్టేసు కొంటున్నారు. తను సమైక్యవాదినని చెపుతూనే ఇక డెఫినెట్గా విభజన జరిగిపోతుందని చెపుతారు. తనకు ముఖ్యమంత్రిపై ఆశ ఉందని, అందుకే రాష్ట్ర విభజనకు కేంద్రాన్ని ప్రోత్సహించానని పార్టీలో బయట కూడా కొందరు మతి స్థిమితం లేని వాళ్ళు అవాకులు చవాకులు వాగుతున్నారని అంటారు. ఆ వెంటనే 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారనే మాట మరిచిపోకుండా కలుపుతుంటారు.
తను పీసీసీ అధ్యక్షుడినని గుర్తుకు వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళని చూడకుండా “పార్టీలో ఉంటే ఉండండి లేకపోతే బయటకి పొండి” అని చిందులు వేసిన తరువాత, వాళ్ళు కూడా తనకంటే సీనియర్స్ అనే సంగతి గుర్తుకు వచ్చి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి “నా ఉద్దేశ్యం అదికాదు...” అంటూ ఏవో సంజాయిషీలు ఇస్తూ మరింత గందరగోళం సృష్టిసారు.
ఫేస్ బుక్కులో తండ్రి కొడుకులో లేక అన్నదమ్ములో లేక మొగుడు పెళ్ళాలో ఇవాల్టి నుండి ఫ్రెండ్స్ అని మెసేజ్ ఏవిధంగా వస్తుందో అదేవిధంగా ఇప్పుడు బొత్స అండ్ కిరణ్ కుమార్ రెడ్డి ఆర్ నవ్ ఫ్రెండ్స్ అని ఆయన ప్రస్తుతం చెప్పుకొంటున్నారు. అలాగని కిరణ్ కుమార్ రెడ్డిని అనుసరించే దైర్యం ఉందా? అంటే అదీ అనుమానమే.
ఎందుకంటే అధిష్టానం చల్లగా చూస్తే నేడు కాకపోతే రేపు రాష్ట్రం విడిపోయిన తరువాతయినా ముఖ్యమంత్రి అవకపోతానా అనే ఆలోచన ఉంది కదా! అటువంటప్పుడు తుమ్మితే ఊడిపోయే ముక్కు వంటి ముఖ్యమంత్రి పదవి గట్టిగా పట్టుకొని సమైక్యంగా ముందుకు సాగుతున్న కిరణ్ కుమార్ రెడ్డి చేయి పట్టుకొని ముందుకు సాగడం అంటే, ఇక శాశ్వితంగా రవాణా శాఖకే కమిట్ అయిపోయే ప్రమాదం ఉంది.
అయితే దివాకర్ రెడ్డిని అన్నట్లు కిరణ్ కుమార్ రెడ్డిని ‘పార్టీలో నుండి బయటకి పొమ్మనే’ సాహసం చేయలేక బొత్స అండ్ కిరణ్ కుమార్ రెడ్డి ఆర్ నవ్ ఫ్రెండ్స్ అని చెప్పుకొంటున్నారనుకోవాలి. ఒకవేళ అధిష్టానం “రిప్లేసింగ్ కిరణ్ కుమార్ రెడ్డి సూన్” అని మెసేజ్ ఏమయినా పెడితే, అప్పుడు ఆయన ‘నెట్ వర్క్’ లో మార్పులు ఏర్పడవచ్చును. ఏమయినప్పటికీ ఆయన ఈ విషయంలో చిరంజీవికి ఈ మాత్రం తీసిపోరని మాత్రం గట్టిగా చెప్పవచ్చును.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/botsa-39-27052.html
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు.
తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ పట్లే కక్షగట్టినట్లుగా వ్యవహరించారు. ఇంత కాలం తన వెన్నంటి ఉండి, తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దౌర్జన్యాలకు దిగారు. పార్టీ అధినేతపైనా, అధినేత కుటుంబంపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తల్లిలాండి భువనేశ్వరిని సైతం దుర్భాషలాడారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.