బోరుగడ్డ సమాజానికి ప్రమాదం!

Publish Date:Mar 25, 2025

Advertisement

బోరుగడ్డ అనీల్ కుమార్ సమాజానికి ప్రమాదకరం అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆయన సామాజిక మాధ్యమం వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి గతంలో చేసిన వ్యాఖ్యలు, బూతులు తెలిసిందే. వారిరువురినే కాకుండా వారి ఇళ్లలోని మహిళలను కూడా కించపరిచేలా బోరుగడ్డ అనీల్ కుమార్ వ్యఖ్యలు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం జైలుకు రిమాండ్ ఖైదీగా వెళ్లారు.

అక్కడ తన తల్లి ఆరోగ్యం బాలేదనీ డాక్టర్ సర్టిఫికేట్ చూపుతూ బెయిలు కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఇక్కడ వరకూ అంతా ఓకే కానీ, తల్లికి ఆరోగ్యం బాలేదంటూ అందుకు రుజువుగా బోరుగడ్డ అనిల్ కుమార్ కోర్టుకు సమర్పించిన డాక్టర్ సర్టిఫికేట్ నకిలీదని తేలడంతో వారు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్ విచార‌ణ‌లో ఉండ‌గానే.. బెయిల్ గ‌డువు ముగిసిపోయింది. అదే సమయంలో తనకు  త‌న‌కు బెయిల్ పొడిగించాల‌ని మ‌రోసారి బోరుగ‌డ్డ కోర్టును ఆశ్ర‌యించారు.

ఈ రెండు పిటిషన్లనూ విచారించిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం.. బెయిలు పొడగింపును నిరాకరించడమే కాకుండా, ఎక్కడున్నా సరే వెంటనే వచ్చి జైలు అధికారులకు లొగిపోవాలని ఆదేశించింది. ఆయన కోర్టు ఆదేశాల మేరకు లొంగిపోయారు కూడా. అయితే బోరుగడ్డపై  పోలీసులు న‌మోదు చేసిన న‌కిలీ డాక్ట‌ర్ స‌ర్టిఫెకెట్ కేసు, హైకోర్టును త‌ప్పుదోవ ప‌ట్టించార‌న్న కేసులు   విచార‌ణ‌లో ఉన్నాయి. తాజాగా వీటిపై విచార‌ణ జ‌రిపిన కోర్టు.. బోరుగ‌డ్డ వంటి వ్య‌క్తులు స‌మాజానికి ప్ర‌మాద‌క‌ర‌మ‌ని.. ఇటువంటి వారిని ప్రత్యేకంగా చూడాలని వ్యాఖ్యానించింది. 

By
en-us Political News

  
తెలంగాణలో మొదటి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్, కూకట్‌పల్లిలోని డాక్టర్‌కు కరోనా పాజిటివ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నిసార్లైనా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్నిముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ఏపీ లిక్కర్ స్కామ్‌లో కసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కెసిరెడ్డి ఉపేంద్రరెడ్డి, రాజ్‌ కెసిరెడ్డి పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ఏపీ మాజీ సీఎం జగన్ చాలాకాలం తర్వాత అమరావతి రాజధానిపై విచిత్రంగా స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ ల్యాండ్ స్కామ్ చేస్తుందని పాత ఆరోపణలే తిరిగి గుప్పించారు.
మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ తెలంగాణ ఛైర్ పర్సన్‌గా డీకే అరుణని నియమించారు.
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలంగాణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఆరు వారాల్లో సమగ్ర నివేదిక అందించాలని హైదరాబాద్ సీపీ ఆనంద్‌కు నోటీసులు జారీ చేసింది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉత్తరం రాయించారేమోనని ఆయన అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కవిత మరో షర్మిల కాబోతోంది అని హాట్ కామెంట్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. కేంద్రమంత్రులతో సీఎం వరుసగా భేటీలు అవుతున్నారు.
క‌ల్వకుంట్ల క‌విత త‌న తండ్రిని విబేధిస్తూ రాసిన లేఖ ఒక చిన్న లీడ్ మాత్ర‌మేన‌ట‌. వ‌చ్చే రోజుల్లో క‌విత నుంచి భారీ బ్లాస్టింగ్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. కార‌ణం క‌విత పార్టీ బ‌య‌ట‌కొచ్చి కొత్త పార్టీ పెట్టేలా ఎత్తుగ‌డ వేస్తున్న‌ట్టు సమాచారం.
తిరుమలలో సదుపాయాలు చాలా మెరుగు పడ్డాయిని ప్రముఖ దర్మకుడు రాఘవేంద్రరావు అన్నారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిని శుక్రవారం ఉదయం పలువురు ప్రముఖులు కలిశారు. సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌, మాజీ తానా అధ్యక్షుడు వేమన సతీశ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.
వైసీపీ సోషల్ మీడియా వింగ్ మాజీ హెడ్ సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్ తగిలింది. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మళ్లీ కోరలు చాస్తున్నది. 2019 నుంచి 2021 మూడు దశలలో కరోనా మహమ్మరి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఉసురు తీసింది. జనం నెలల తరబడి కరోనా కర్ఫ్యూ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. మాస్కు లేకుండా అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ మరో సారి కరోనా విజృంభిస్తోందన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
నాలుగేళ్ల కిందట కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. 2019లో మొదలై 2021 వరకూ ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. మూడు దశలుగా విస్తరించి, వ్యాపించి లక్షల మంది ఉసురు తీసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.