Publish Date:Aug 17, 2022
పిల్లాడికి పౌష్టికాహారం పెడుతున్నా ఎత్తు పెరగడం లేదని తలిదండ్రులు బాధపడ్డారు. ఒకరోజు ఎక్కడో విని ఒక టేపు కొని రెండు నెలలకోసారి వాడిఎత్తు కొలవనారంభించారు. హాల్లో గోడమీద స్కేలు గీతలు చూసి తెలిసినవారికీ అర్ధమయింది. కానీ పక్కింటివారిని పిలిచి మీరు మీ పిల్లాడి ఎత్తు గురించి ఆలోచిం చమని చెప్పలేదు. ఎవరయినా తమ అభివృద్దిని అంచనా వేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ తెలంగాణాలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు కూలబోతున్నదీ బీజేపీ వారు లోకానికి తెలియజేసే గడియా రాన్ని ఏ ర్పాటు చేశారు. గతంలోనూ ఇలాంటి కార్యక్రమం చేపట్టి ఈసీ నుంచి మొట్టికాయలు వేయించు కున్నారు. అక్కడితో వారి ప్రయత్నాలు మానుకున్నారు. ఇప్పుడు మళ్లీ మొదలెట్టారు. మద్దతు నిచ్చే వారు పేర్లు రిజిస్టర్ చేసుకోవాలనీ కోరుతున్నారు.
మళ్లీ 'సాలు దొర.. సెలవు దొర' అంటూ బీజేపీ డిజిటల్ బోర్డును ఏర్పాటు చేసింది. కేసీఆర్ పాలనకు కౌం ట్ డౌన్ పేరుతో బీజేపీ ఆఫీస్ దగ్గర డిజిటల్ బోర్డును ఏర్పాటు చేశారు. డిజిటల్ బోర్డును బీజేపీ ఇంఛార్జ్ తరు ణ్ చుగ్ ప్రారంభించనున్నారు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారంటూ డిజిటల్ బోర్డులను జీహెచ్ఎంసీ అధికారులు నిలిపివేశారు. ఈసారి బీజేపీ ఆఫీస్ ప్రహారీ గోడ లోపల డిజిటల్ బోర్డ్ ఏర్పా టు చేసినట్లు బీజేపీ తెలిపింది. ఐరన్ పిల్లర్ నిర్మించి డిజిటల్ బోర్డ్ను ఏర్పాటు చేసినట్లు కమలం పార్టీ స్పష్టం చేసింది.
కేసీఆర్ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడం, అధికారపీఠం ఎక్కడం మాత్రమే బీజేపీకి తెలంగాణా లక్ష్యంగా మా రింది. ఆమధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ‘సాలు దొర - సెలవు దొర’ ప్రచా రాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించింది. ఈ ప్రచారంపై ఈసీ అభ్యం తరం వ్యక్తం చేసింది. ఈ ప్రచారంపై ఈసీకి టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేయలేదు. అయితే, ఈ ప్రచారానికి అను మతి కోసం బీజేపీ పార్టీ చేసిన అభ్యర్థనతోనే ఈసీ ఈ క్యాంపెయిన్ గురించి పరిశీలించి నిలిపి వేయా లని ఆదేశించింది. సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కేసీఆర్ ఫొటోలతో పోస్టర్లు ముద్రిం చేందుకు బీజేపీ అనుమతి కోరగా.. ఎన్నికల సంఘం నిరాకరించింది. అలా చేసేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. సీఎం ఫొటోతో బీజేపీ పోస్టర్లు ముద్రించేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రచా రంపై బీజేపీ ఓ వెబ్సైట్ను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు దూకుడైన నిర్ణయాలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా కొంత కాలంగా ‘సాలు దొర - సెలవు దొర’ క్యాంపెయిన్ను ప్రారంభించింది. అటు.. టీఆర్ఎస్ కూడా నేరుగా ప్రధాని మోదీపై విమర్శలు కురిపిస్తూ ఈ ప్రచారాన్ని తిప్పికొడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-seethaiah-39-142061.html
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ప్రముఖులను ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేయడం సాధారణమైపోయింది.
జగన్ నోట ఓటమి మాట వచ్చేసింది. ఔను ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతోంది. తనను అడ్డుకోవడానికి వాళ్లు సొమ్ములు నిలిపివేస్తున్నారు. అధికారులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు అంటూ జగన్ మాట్లాడారు.
వీళ్ళకి అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వున్నప్పుడు బెయిల్ కోసం జగన్ ఎవరి కాళ్ళ బేరానికి వెళ్ళాడో, గత పదేళ్ళుగా ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నాడో అందరికీ తెలిసిందే. కనీసం కోర్టు హియరింగ్కి కూడా హాజరు కాకుండా హాయిగా తిరుగుతున్నాడు.
ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అడ్డు ఎవరు వచ్చినా వారిని టార్గెట్ చేయడం ఆనవాయితీ. స్వంత బాబాయి వివేకానందరెడ్డి హత్య చేసినట్టు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వంత బాబాయిని హత్య చేయించిన ఘనుడు జగన్ అని చెల్లెలు వైఎస్ షర్మిల విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఆమెను చిక్కులు తెచ్చి పెట్టింది.
ఉత్తరాంధ్రలో అధికార వైసీపీకి ఎదురుగాలి వీస్తున్నది. ఈ ప్రాంతంలోని మూడు జిల్లాలలోనూ వైసీపీ అభ్యర్థులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విశాఖలో అయితే ఆ పార్టీకి ఘోర పరాభవం తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
గత ఎన్నికలలో వైసీపీ నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. ఆ జిల్లాలోని మొత్తం పదికి పది అసెంబ్లీ స్థానాలలోనూ విజయకేతనం ఎగుర వేసింది. అయితే ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి వైసీపీ పరిస్థితి జిల్లాలో పూర్తిగా దిగజారింది. పరిశీలకుల విశ్లేషణలైతే జిల్లాలో గత ఎన్నికలలో వచ్చిన ఫలితం ఈ సారి రివర్స్ అయినా ఆశ్చర్యం లేదన్నట్లుగా సాగుతున్నాయి.
తమకంటే వేరే ఎవరూ గొప్పగా, ఛరిష్మా కలిగిన వ్యక్తుల్లా వుండటం ఇష్టం వుండదు. అలా ఎవరికైనా తనకంటే ఎక్కువ ఛరిష్మా వుంటే, అలాంటి వాళ్ళని తన కాళ్ళ దగ్గరకి రప్పించుకుంటాడు.
సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 93 నియోజకవర్గాలలో ఈ విడతలో పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాటు చేసింది.
జనసేనాని పవన్ కల్యాణ్ కు పిఠాపురంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని పరిశీలకులు నియోజకవర్గ పరిస్థితులను ఉటంకిస్తూ విశ్లేషణలు చేస్తున్నారు. మరో వైపు పవన్ కల్యాణ్ ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ దాడులకు పాల్పడుతూ తన పరపతిని మరింత దిగజార్చుకుంటోంది.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం (మే7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్ లో వేచి ఉండే అవసరం లేకుండా భక్తులను డైరెక్ట్ లైన్ ద్వారా అనుమతిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గప్తాను ఎన్నికల సంఘం నియమించింది. ఆయన సోమవారం (మే6) బాధ్యతలు చేపట్టారు. ఏపీ డీజీపీగా కొనసాగుతున్న రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం ఆదివారం బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే.
మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఆయనకు తన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కమ్ ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలను సెట్ చేసుకుంటే సరిపోతుందని ఆలోచన వచ్చింది.
తెలంగాణ ఉద్యమం అయిపోలేదు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందంటారు కేసీఆర్. ఎన్నికల్లో ఓటమి అనేది టెంపరరీ సెట్ బ్యాక్ మాత్రమే. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు నిబ్బరం ఉండాలి. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని కేసీఆర్ తన క్యాడర్కు హితబోధ చేస్తూ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు.