వ‌చ్చారు.. త‌ప్పులో కాలేసారు!

Publish Date:Jul 4, 2022

Advertisement

అంతా త‌ర‌లివ‌చ్చారు. యుద్ధానికి సిద్ధ‌ప‌డేందుకు శిబిరాల్లో సేద‌దీరారు. ఆన‌క విప‌క్షాల‌వారిని, కొలువు దీరిన ప్రాంతీయుల‌ను త‌మ ఆధిప‌త్య స‌త్తాను త్వ‌ర‌లో మ‌రింత చ‌విచూపిస్తామ‌ని చిన్న‌పాటి హెచ్చ‌రి క‌లు చేసి వెళ్లారు. ఇంతే జ‌రిగింది బిజెపి కార్య‌వ‌ర్గ స‌మావేశం హ‌డావుడి మొత్తం. 

తెలంగాణాలో పాగా వేయ‌డానికి అనేక మార్గాలు, ఆలోచ‌న‌లు చేసిన బిజెపి కేంద్ర నాయ‌కులు తెలంగాణా రాజ‌ధాని హైద‌రాబాద్‌లోనే త‌మ పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు నిర్వ‌హించి ఇక్క‌డే అస‌లు సంగ‌తి తేల్చుకుందామ‌ని భావించారు. ప్ర‌చారం నుంచి స‌మావేశం జ‌రిగినంత వ‌ర‌కూ బిజెపి వ‌ర్గీయులు నానా హ‌డావుడీ చేసేరు. ప్ర‌ధాని మోదీ, పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు అమిత్ షా త‌దిత‌రులు, బిజెపి పాలిత రాష్ట్రా ల ముఖ్య‌మంత్రుల‌తో స‌హా హైద‌రాబాద్‌లో మ‌కాం వేసి ఇక్క‌డి టిఆర్ ఎస్ శ్రేణుల‌కు వెన్నులో వొణుకు పుట్టేలా చేద్దామ‌నుకున్నారు. అయితే టిఆర్ ఎస్ ప్ర‌చారంలోనే ఎదురుదాడికి దిగి వారిని ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న పెద్ద సంకేత‌మే ఇచ్చింది. 

బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో ప్ర‌ధాని మోదీ సైతం తెలంగాణాకు ఎంతో చేశామ‌ని, ఎంతో ఇచ్చా మ‌ని గొంతు చించుకున్నారు. కానీ అవ‌న్నీ అవాస్త‌వాలేన‌న్న‌ది వారికి తెలిసేలా టిఆర్ ఎస్ నాయ‌కులు టీ వీ చర్చ‌ల్లో ఘాటుగా విమ‌ర్శించారు. ప్ర‌ధాని మాట్లాడుతున్నంతసేపూ, ఈయన ప్ర‌ధానేనా, ఇంత అబద్ధా ల కోరేమిటా అని నోరెళ్ల‌బ‌డుతున్నారు. తెలంగాణాలో టిఆర్ ఎస్ చెప్పుకుంటూన్న అభివృద్ధి  అంతా త‌మ ఆర్ధిక మ‌ద్ద‌తుతోనే సాధ్య‌ప‌డింద‌ని అది టిఆర్ ఎస్ నేత‌ల‌కు చెప్పుకోవ‌డానికి ఇబ్బందిగా  మారిం ద‌నే విమ‌ర్శ‌లు గుప్పించారు. తాము న‌గరాభివృద్ధికి, ముఖ్యంగా రోడ్లు, ఫ్లైఓవ‌ర్ల నిర్మాణానికి వేల కోట్లు ఇచ్చామ‌ని మైకులు బ‌ద్ద‌ల‌య్యేలా అరిచి మ‌రీ చెప్పారు. 

కానీ ప్ర‌ధాని చెప్పినంత మాత్రాన  అది నిజ‌మై పోతుందా అన్న ప్ర‌శ్న టిఆర్ ఎస్ శ్రేణులు సంధిస్తున్నారు.  ప్ర‌ధాని మోదీ, కేంద్ర నాయ‌కులు ఎవ‌ర‌యి నా స‌రే తెలంగాణా గురించి చెప్పిన‌వ‌న్నీ అవాస్త‌వాలేన‌ని  తెలంగాణా ప్ర‌భుత్వం మండిప‌డుతోంది. 

ఎవ‌రు ఎవ‌రిని ప్ర‌శ్నిస్తున్నారు, ఎవ‌ర్ని హెచ్చ‌రిస్తున్నార‌న్న‌ది ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. తెలంగాణావా దులు కేంద్రం నిస్సిగ్గుగా అబ‌ద్ధాలాడ‌టం ప‌ట్ల ఆశ్చ‌ర్య‌ప‌డుతోంది. ఏ ప్రాజెక్టుకీ, రోడ్డు ప‌నుల‌కీ కేంద్రం వీస‌మెత్త సాయం చేయ‌లేదు, ఇవ్వాల్సిన‌వాటి సంగ‌తి దేవుడెరుగు అంటున్నారు. కేవ‌లం పెద్ద నోరు వేసుకుని అమాంతం ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో మైకుల్లో మాట్లాడ‌గానే అన్నీ అంద‌రూ న‌మ్మ‌రు.  ప్ర‌ధాని స్థాయి మ‌నిషి మ‌రీ ఇంత అనాలోచితంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఏ పాటి న్యాయ‌మ‌న్న‌ది టి ఆర్ ఎస్ వ‌ర్గీయుల ప్ర‌శ్న‌. వాస్త‌వానికి తెలంగాణాకు సంబంధించి రావాల్సిన ఆర్దిక మ‌ద్ద‌తు గురించి అడిగినవి  నిర్ల‌క్ష్యం చేసి త‌మ‌కు తోచిన అంకెల‌తో తోచిన విధంగా ప్ర‌చారం చేసుకోవ‌డంలో బిజెపివారీ మాన‌సిక బ‌ల‌హీన‌తే బ‌య‌ట‌ప‌డుతోంది. 

మొత్తానికి బిజెపి యావ‌త్ సైన్యం వ‌చ్చి చేసిన త‌ప్పుడు ప్ర‌చారాలు, ఊక‌దంపు ప్ర‌సంగాల వ‌ల్ల తెలంగా ణాకు, టిఆర్ ఎస్‌కు వ‌చ్చే న‌ష్టం శూన్యం.  ప్ర‌తిగా బిజెపీ వ‌ర్గాలే న‌ష్ట‌పోయే అవ‌కాశాలున్నాయి. తెలం గాణా ఏర్పాట‌యిన‌ప్ప‌టి నుంచి కేంద్రం పెద్ద‌గా స‌హ‌క‌రించిందేమీ లేద‌ని, ఇపుడు మ‌రింత రాజ‌కీయ వైఫల్యాన్ని బిజెపీ స్వ‌యంగా ఇంత దూరం వ‌చ్చి తెలంగాణాలో బ‌య‌ట‌ప‌డ‌టం ప‌ట్ల అంతా న‌వ్వుకుం టున్నారు. తెలంగాణాకు చెంద కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ త‌దిత‌ర బిజెపీ హేమాహేమీలు  మోదీని, అమిత్ షాను, ఇత‌ర కాషాయ హేమాహేమీల‌తో  వ‌చ్చి రెండు రోజ‌ల్లో ప్ర‌జ‌ల్ని ముఖ్యంగా ఓట‌ర్లను త‌మ జండా నీడ‌లోకీ తెచ్చేసుకోవాల‌న్న ఆతృత విజ‌య‌వంతం అయితే కాలేదు. ఢిల్లీలో పెట్టుకుని త‌మ పార్టీ వారు భ‌విష్య‌త్ కార్య‌క్ర‌మాలు నిర్ణ‌యించుకుంటే అయిపోయేదానికి ఇక్క‌డికి వ‌చ్చి ఇక్కడ శిబిరాలు వేసు కుని, ఇక్క‌డ తిండి తిన‌గానే తెలంగాణా వాదులు అయిపోతారా ?  ఇలాంటి ట్రిక్కులు, జిమ్మిక్కులు  తెలంగాణా ప్ర‌జ‌లు అంత‌గా ప‌ట్టించుకోరు. బిజెపీ ఆట‌పాట‌లు, హ‌డావుడీ అంతా బీహార్‌, పంజాబ్‌, రాజ స్థాన్ ల‌లో చెల్లుతుందేమోగాని తెలంగాణా వాదులను క‌దిలించ‌లేదు. 

బిజెపి పాలిత రాష్ట్రాల‌తో పోలుస్తూ తెలంగాణా కూడా త‌మ నీడ‌లోకి తెచ్చేసుకోవ‌డానికి ఇంక ఆట్టే కాలం ప‌ట్ట‌దు, రెడీగా వుండ‌డ‌ని ఎవ‌రికి హెచ్చ‌రిక‌లు జారీచేస్తున్నారు?  తెలంగాణా పోరు, రాష్ట్రావ‌త‌ర‌ణ వెనుక అనేక శ‌తాబ్దాల వెత‌లు వున్నాయి. ఈ ప్ర‌జ‌లు ఇత‌ర రాష్ట్రాల్లో వ‌లె అంత త్వ‌ర‌గా కాషాయం వారి జాతీయ భావ‌న, అతి దేశ భ‌క్తి  ఓవ‌రాక్ష‌న్‌ల‌కు ప‌డ‌రు. టిఆర్ ఎస్ ప్ర‌స్తుతం బిజెపి దృష్టిలో త‌క్కువ స్థాయిలో క‌న ప‌డుతోందేమోగాని టిఆర్ ఎస్‌కి రాష్ట్రంలో ప్ర‌జ‌ల్లో ఏమాత్రం గౌర‌వం, న‌మ్మ‌కం స‌డ‌ల‌లేదు.  క‌ట్ట‌గ‌ట్టుకుని వ‌చ్చాం, భ‌య‌పెట్టి పోయామ‌ని బిజెపి వ‌ర్గాలు అనుకుంటే త‌ప్ప‌కుండా త‌ప్పులో కాలేసిన‌ట్టే!

By
en-us Political News

  
వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.