వైసీపీ పాపాలలో బీజేపీకీ భాగం?!

Publish Date:Jun 17, 2023

Advertisement

జగన్  పాలన అంతా  అవినీతి,అరాచకం,అప్పులేనంటూ ఇప్పుడు మన్నూ మిన్నూ ఏకం చేస్తూ విమర్శలు గుప్పించిన బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలు.. అందుకు ఈ నాలుగేళ్లూ అండగా, దండగా నిలిచినందుకు మాత్రం ఇసుమంతైనా విచారం కానీ, పశ్చాత్తాపం కానీ వ్యక్తం చేయలేదు.  కేంద్ర పథకాలపై జగన్‌ తన బొమ్మ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపణలు గుప్పించిన ఆ నేతలు ఇంత కాలం ఎందుకు నోరు మెదపలేదన్న జనం ప్రశ్నకు సమాధానం చెప్పేందుందుకు ఎందుకు సిద్ధంగా లేరు.

 పేదల కోసం ఇచ్చిన బియ్యాన్ని అమ్ముకుంటున్నారని, విశాఖపట్నాన్నిభూ రాబందుల కేంద్రంగా మార్చారని తీవ్ర స్థాయిలో జగన్ సర్కార్ ను దుయ్యబట్టిన ఆయ నాయకద్వయం.. అందుకు అన్ని విధాలుగా సహకరించినా.. తాము మాత్రం నిజాయితీపరులమని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ తొమ్మిదేళ్లలో రూ.5 లక్షల కోట్లకి పైగా  రాష్ట్రానికి ఇచ్చామనీ, ఆ డబ్బంతా ఏమైందనీ ఇంత కాలం ప్రశ్నించకుండా ఇప్పుడు నిలదీయడంలోని ఆంతర్యమేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన డబ్బుకు సరిపడా అభివృద్ధి కనిపించడం లేదని చెబుతున్న అమిత్ షా.. అభివృద్ధి కనిపించడం లేదని ఇప్పుడే తెలిసిందా? ముందే తెలిస్తే.. ఎందుకు జగన్ సర్కర్ ను నిలదీయలేదని అంటున్నారు.  

మైనింగ్‌, భూ మాఫియా, గంజాయి స్మగ్లింగ్ ఇలా అన్నిటిలోనూ వైసీపీ నాయకులే ఉన్నారంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా జగన్ పరిపాలనపై ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు. కానీ ఒక మాజీ మంత్రి, మాజీ సీఎం కు స్వయానా సోదరుడు, ముఖ్యమంత్రి జగన్ కు సొంత బాబాయ్ వివేకా హత్య జరిగి నాలుగేళ్లయినా పురోగతి కనిపించకపోవడాన్ని ఎందుకు నిలదీయలేదంటున్నారు. గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించి, వివేకా శరీరంపై గాయాలకు కుట్లువేసి బ్యాండేజీలు వేసినా, అందుకు పాల్పడిన వారిని, పోనీ ఆక్రతువునంతా దగ్గరుండి చేయించిన వారినీ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ కనిపెట్టలేకపోవడం వెనుక ఉన్న హస్తం ఎవరిదన్న విషయంపైనా కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారని ఏపీ జనం నిలదీస్తున్నారు. ఇక అన్నిటికంటే స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేసి ఏపీ రాజధానిగా ప్రకటించిన అమరావతిని నిర్వీర్యం చేసేందుకు ఈ నాలుగేళ్లుగా జరిగిన అన్ని ప్రయత్నాలనూ  ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోవడం వెనుక ఉన్న కారణాలేమిటని ప్రశ్నిస్తున్నారు.

జగన్ రెడ్డి పాలనలో ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మారిందని ధ్వజమెత్తిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఇప్పుడే ఆ విషయం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు.   ఇప్పటికైనా జగన్ రెడ్డి పాలన దౌర్భాగ్యంగా ఉందని కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు గుర్తించడం సంతోషమే కానీ, ఇంత కాలం ఏపీలో జగన్ అరాచక పాలనను అన్ని విధాలుగా సమర్ధిస్తూ, ఆర్థిక అరాచకత్వాన్ని మరింత ప్రోత్సహించే విధంగా నిబంధనలను తుంగలో తొక్కి మరి అప్పులిచ్చి ఏపీని అధ్వాన స్థితికి తేవడంలో కేంద్రంలోని మోడీ సర్కార్ పాత్ర ఎంత ఉందో పరిశీలకులు సోదాహరణంగా చేస్తున్న విశ్లేషణలకు  షా, నడ్డా ద్వయం సమాధానం చెప్పాలని ఏపీ జనం కోరుతున్నారు.  

నాలుగేళ్లుగా పరస్పర ప్రయోజనాల పరిరక్షణ కోసం అంటకాగిన వైసీపీ, బీజేపీలు ఇప్పుడు ఎన్నికల ముందు ప్రజలను మరో సారి మోసం చేయడానికి తెరతీసిన కొత్త డ్రామాగా అమిత్ షా, నడ్డాల విమర్శలను పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   గత నాలుగేళ్లుగా  జగన్ రెడ్డి దుష్టపాలనకు వెన్నుదన్నుగా నిలిచి,   ఆర్ధిక అరాచకానికి అండగా నిలుస్తూ జగన్ సర్కార్ ఎప్పుడు అడిగితే అప్పుడు అప్పులు తెచ్చుకునేందుకు అనుమతులు ఇచ్చిన కేంద్రం, ఇప్పుడు విమర్శల దాడికి దిగడం వెనుక రాజకీయ ప్రయోజనాభిలాషను పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 జగన్ పాలన అంతా అవినీతి, అక్రమాలు, కుంభకోణాల మయం అంటూ గగ్గోలు పెట్టిన అమిత్ షాకు (ఆయన కేంద్ర హోంమంత్రి) జగన్ పై వున్న 16 చార్జి షీట్ల పై విచారణ  నిలిచిపోయిందన్న సంగతి తెలియదా. ఆయన కోర్టుకు హాజరు కాకుండా సాధించుకున్న వెసులుబాటు వెనుక ఎవరు ఉన్నదో ప్రజలకు అర్ధం కాదనుకుంటున్నారా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  

By
en-us Political News

  
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.