Publish Date:Oct 29, 2022
ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నారు. అవును రోజూ లెక్కలు చేస్తుంటే భయం పోతుందిరా.. అంటాడు తండ్రి కొడుకుతో...బాగా ప్రాక్టీస్ చేయి..సిక్స్ కొట్టడం తెలుస్తుందంటాడు ప్లేయర్ తో కోచ్.. ఎన్నికల పోలింగ్ సమయంలో ఓటు వేయడం గురించి నేర్పుతారు అక్కడి వాలంటీర్లు. వేలి మీద వేసిన చుక్క ఎలా పోతుందనేది నాయనమ్మ చెబుతుంది.. చిత్రంగా మునుగోడులో జనానికి బీజేపీ వారు తమకే ఓటువేసే విధానాన్ని బోధిస్తున్నారు.
అసలు ఏదయినా ప్రజలు తమకు అనుకూలమయ్యే మార్గాన్ని ఆలోచించడంలో బీజేపీ వారిని మించి ఎవ్వరూ ఉండరు. వారి తెలివే తెలివి. ఉపన్యాసాలతో ఆకట్టుకుంటారు, ఎవరయినా సరే తమవారిని చేసుకోవడం వారి పనులు కానిచ్చేసుకోవడంలో ఉండాల్సిన తెలివి కమలనాథులకే తగును. ఎంత ఆలోచించినా వారితో పోటీ పడటం చాలా కష్టం. ఇన్ని రోజుల్లో కాంగ్రెస్ వారికి, టీ ఆర్ఎస్ వారికి రాని ఆలోచనని బీజేపీవారికి రావడం వెంటనే అమలుచేసేయడం క్షణాల్లో జరిగిపోతోంది. ఇపుడు ఇంటిం టికీ తిరిగి మాకు ఓటెయ్యండి అంటూ బతిమిలాడుకోవడం, నోటు ఇవ్వడమే కాదు.. వాటికన్నా అసలు పోలింగ్ బూత్ కి వెళ్లాక పెద్దాయనో, పెద్దమ్మో ఏ కీ నొక్కితే భీజేపీ కి ఓటు వెళుతుందో కూడా వారికి తెలి సేలా చేస్తున్నారు. వారికి మెల్లగా ప్రాక్టీస్ చేయించితే ఓటింగ్ రోజు ప్రత్యేకించి ఆ బోర్డు మీద మీట నొక్కడం గురించి తెలియజేయక్కర్లేదు.
ఎందుకంటే, పాపం ఓటర్లకీ అందరికీ ఓటు వేయడంలో ప్రాక్టీస్ ఉండాలిగదా.. ప్రాక్టీస్ చేయిస్తే ధైర్యంగా వెల్లి మీట నొక్కి నవ్వుతూ బయటికి వస్తాడు.. బీజేపీ వారి మనుషులంతా కమలమంత పెద్దగా నవ్వులు విరజిమ్ముతారు. అదిగదా ఆనందం. అదే కావాలి. అందుకే మునుగోడు మొత్తాన్ని బీజేపీ గుర్తు ఓటింగ్ మిషన్ మీద ఎక్కడుంటుంది, మీట ఎలా నొక్కాలి.. ఈ ఘనకార్యం చేస్తే మనసు ఎంతగా నెమ్మదిస్తుం దీ, అంతా ఎంత ఆనందంగా ఉంటారు, అక్కర్లేకున్న రిక్షాలోనో, ఆటోలోనో ఇంటికి వెళ్లే మార్గం గురించి పెద్దగా ఆలోచించకుండానే జరిగిపోవడం...అన్నీ అయిపోతాయి. పాపం ఓటరుకి అంతకంటే ఏం కావాలి. ఎలాగూ డబ్బుల పంపకాలు, హామీలూ అన్నీ జరుగుతున్నాయి. కానీ అసలు పోలింగ్ స్టేషన్ కి ఎలా వెళ్లాలి, ఓటు ఎలా వేయాలన్నది మాత్రం నేర్పుకోలేదు. అది బీజేపీవారే బాగా ముందుగా గుర్తించి మరీ వెంటాడి నేర్పుతున్నారు.
నేర్పితేనే గొప్ప విద్య అవుతుంది. నేర్పితేనే మాట వింటారు. నేర్పితేనే పార్టీ గెలుస్తుంది. నేర్పితేనే మన వెంట ఉంటారు... ఈ నినాదాలన్నీ ఎంతగా ఉపకరిస్తాయన్నది కూలంకషంగా ఆలోచించే ప్రయోగా త్మకంగా మునుగోడులో, ఆనక పెద్ద ఎన్నికల్లో మరింత పకడ్బందీగానూ చేయిపట్టి చేయించే యొచ్చ న్నది కమలనాధుల ధీమా.. కాదు వాల్లు తప్పకుండా మన మాట వింటారని, మన గుర్తున్న మీటనే నొక్కుతారని కాషాయమంత వెలవని నమ్మకం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-giving-practice-on-how-to-vote-them-25-146235.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.