వద్దు వద్దంటున్నా వస్తే ఇదే గతి!

Publish Date:May 25, 2023

Advertisement

వద్దు వద్దంటున్నా వస్తున్న నేతలకు చిత్తూరు జిల్లాలో రెండు గ్రామాల ప్రజలు కీలెరిగి వాత పెట్టిన చందంగా గుణపాఠం చెప్పారు. సమస్యలు పరిష్కరించకుండా.. గడపగడపకూ మన ప్రభుత్వం అంటూ వచ్చి మీకు ఈ నాలుగేళ్లలో ఇంత సొమ్ము పందేరం చేశాం, అంత సొమ్ము పందేరం చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న నేతలకు ఇప్పటి వరకూ సమస్యలపై నిరసన గళం ఎత్తి ప్రశ్నించిన జనం ఇప్పుడు ఏకంగా ఆ కార్యక్రమాన్నే బహిష్కరిస్తున్నారు. వారు వచ్చే సమయానికి తమ ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోతున్నారు. ఇటువంటి అనుభవమే డిప్యూటీ సీఎం నారాయణ స్వామికీ, ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబుకూ ఎదురైంది.  

రావద్దు బాబోయ్ అని జనం నిరసనలు వ్యక్తం చేస్తున్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు గడపగడపకు మా ప్రభుత్వం అంటూ  వస్తుండటంతో  జనం ఇక ఇళ్లకు తాళాలు వేసుకుని పారిపోవడమొక్కటే మార్గమని డిసైడైనట్లు ఉన్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూతలపట్టు మండలం పేట అగ్రహారం గ్రామస్తులు బహిష్కరించారు. ఆయన వస్తున్న విషయాన్ని తెలుసుకుని తమ ఇళ్లకు తాళాలు వేసుకుని గ్రామం నుంచి బయటకు వెళ్లి పోయారు. ఇదే అనుభవం ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికీ ఎదురైంది.

ప్రభుత్వం పట్ల ప్రజలలో వెల్లువెత్తుతున్న ఆగ్రహం, అసంతృప్తికి ఈ సంఘటనలు నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పూతలపట్టు మండలం పేట ఆగ్రహారానికి ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు వచ్చే సరికి అక్కడ అన్ని ఇళ్లూ తాళాలు వేసి ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను వాడుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎలా బహిష్కరిస్తారంటూ రుసరుసలాడారు. సిగ్గూ శరం రోషం ఉంటే తీసుకున్న పథకాలను వాపసు చేయండని ప్రజలకు సవాల్ విసిరారు. అంతే కాదు .. ఇక ముందు పేట అగ్రహారం వాసులకు ప్రభుత్వ పథకాలు వంద శాతం అందవని ప్రకటించారు. అయినా ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకుల ఇష్టాయిష్టాల మేరకు అందేవి కావనీ, అవి ప్రజల హక్కు అనీ ఎమ్మెల్యేకు తెలియదా అని పరిశీలకుల ప్రశ్నిస్తున్నారు. తమ విధానాలను వ్యతిరేకించే వారికి పథకాలు అందనీయను అనడం అహంకారమే అవుతుందంటున్నారు. సరే అదలా ఉంచితే.. ఎమ్మెల్యే వెళ్లిపోగానా స్వగృహాలకు తిరిగి వచ్చిన జనం తమ ఇళ్లను, ఎమ్మెల్యే తిరిగిన వీధులను పసుపు నీళ్లతో ప్రక్షాళన చేసుకున్నారు.

ఇక ఏపీ డిప్యూటీ సీఎం  నారాయణ స్వామికీ ఎదురైంది.  డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.  నియోజకవర్గ పరిధిలోని పాచిగుంట గ్రామంలో ఆయన బుధవారం ( మే24) గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అయితే ఆయన గ్రామానికి వచ్చే సమయానికి గ్రామస్తులు తమ ఇళ్లకు తాళం వేసుకుని బయటకు వెళ్లిపోయారు. పాతిక గడప ఉన్న ఆ గ్రామంలో ఇద్దరు ముగ్గురు వినా ఎవ్వరూ డిప్యూటీ సీఎం వచ్చే సమయానికి లేకుండా వెళ్లిపోయారు. ప్రభుత్వ తీరుకు ప్రజలు ఈ విధంగా నిరసన తెలిపారు.  చిత్తూరు జిల్లాలో ఒకే రోజు ఇద్దరు వైసీపీ నేతలకు ఇదే మర్యాద జరగడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వంపై ప్రజాగ్రహం ఏస్థాయిలో ఉందో అర్ధమౌతుంది.

అయితే ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి చర్యలు తీసుకోవలసిన అధికార పార్టీ నేతలు..   మా కార్యక్రమాలను బహిష్కరించిన మీకు ప్రభుత్వ పరంగా ఎటువంటి పథకాలు అందవంటూ హెచ్చరించడం.. ఇప్పటి దాకా తీసుకున్న పథకాలను వాపసు చేయండంటూ మండిపడటం విచిత్రంగా ఉందని పరిశీలకులు అంటున్నారు. తమ గడపగడపకూ కార్యక్రమాన్ని బహిష్కరించిన కుటుంబాలను ప్రభుత్వ పథకాల నుంచి తొలగించాలని వలంటీర్లకు, అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఆయా కుటుంబాలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అంతే కాదు.. ఈ నాలుగేళ్లలో ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ద్వారా ఎంత సొమ్ము వారి అక్కౌంట్లలో జమ అయ్యిందో వివరాలు తీయండి అంటూ వాలంటీర్లకు ఆదేశించారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ ప్రభుత్వ కార్యక్రమాలను బహిష్కరిస్తే చర్యలు తప్పకుండా ఉంటాయని హెచ్చరించారు.  

By
en-us Political News

  
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.