బీజేపీని నిలువరించేందుకు నితీష్, లాలూ తిప్పలు

Publish Date:Oct 14, 2015

Advertisement

 

బీహార్ అసెంబ్లీలో 32స్థానాలకు రెండవ దశ ఎన్నికలు ఈనెల 16న జరుగుతాయి. కానీ మొదటి దశ ఎన్నికలు జరుగక ముందే అన్ని సర్వేలు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నట్లు తేల్చి చెప్పాయి. ఈ ఎన్నికలలో ఎలాగయినా విజయం సాధించాలనే తాపత్రయంతోనే భిన్న దృక్పధాలున్న రాజకీయపార్టీలు ఐదు కలిసి జనతా పరివార్ కూటమిగా ఏర్పడ్డాయి. అయినా సర్వేలు బీజేపీకే మొగ్గు చూపడంతో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ ఇద్దరికీ ఈ సమస్యను అధిగమించడానికి ప్రత్యామ్నాయాలు వెదుకుతున్నారు.

 

వారిలో లాలూ ప్రసాద్ యాదవ్ “బీజేపీ ఇంతవరకు తన ముఖ్యమంత్రి అభ్యర్ధిని ఎందుకు ప్రకటించలేదు.. ముఖ్యమంత్రి అభ్యర్ధిపై స్పష్టత లేని బీజేపీ రాష్ట్రాన్ని ఏవిధంగా పరిపాలించాలనుకొంటోంది? అది నేరుగా ఎవరి పేరు చెప్పదు కానీ ఒక్కో చోట ప్రజలను మభ్యపెట్టడానికి ఒక్కో పేరుని లీక్ చేస్తుంటుంది. అసలు ఇంతకీ దాని ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు? అతని పేరు ఇంకా ఎప్పుడు ప్రకటిస్తుంది...ప్రజలను ఈవిధంగా ఇంకా ఎంతకాలం మోసం చేస్తుంది?” అని ప్రశ్నిస్తున్నారు.

 

ఆయన ఆ విధంగా నిలదీయడానికి బలమయిన కారణాలే ఉన్నాయి. బీహార్ ఎన్నిలలో కులాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఏ కులానికి చెందిన వ్యక్తి పేరు ప్రకటించినా మిగిలినవారిని జనతా పరివార్ తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తుంది. అందుకే బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్ధి పేరు ప్రకటించలేదు. కానీ ముఖ్యమంత్రి రేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుషీల్ కుమార్ మోడీ, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, దళితుల ప్రతినిధిగా తనను అభివర్ణించుకొనే బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజీ ఉన్నారు.

 

తాజాగా ఆ జాబితాకి బీజేపీ మరోపేరు కూడా జోడించింది. గయ బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్ కుమార్. ఆయన వెనుకబడిన వర్గాలలోకెల్లా బాగా వెనుకబడిన ఒక వర్గానికి చెందిన వ్యక్తి. మోడీ బీహార్ పర్యటనకి వచ్చినప్పుడల్లా ఆయన పక్కనే కనబడుతుంటారు. ఆయన పేరు కూడాముఖ్యమంత్రి పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లు ఇటీవల బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ మీడియాతో అన్నారు. ప్రేమ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న కులానికి చెందినవారు రాష్ట్రంలో 8 నుండి 11 శాతం వరకు ఉన్నారు. ఇక బాగా వెనుకబడిన కులాలన్నీ కలిపి 32 శాతం వరకు ఉన్నట్లు 1931 జనాభా లెక్కలో అంచనా వేశారు. ఆ సంఖ్య నేటికి గణనీయంగా పెరిగి ఉంటుంది కనుక బీజేపీ ఆ వర్గానికి వల వేసేందుకే ప్రేమ కుమార్ పేరుని ఇప్పుడు లీక్ చేస్తోందని లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపిస్తున్నారు. కానీ అదయినా దైర్యంగా ఎందుకు ప్రకటించడం లేదు? అని ప్రశ్నిస్తున్నారు.

 

జనతా పరివార్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉన్న నితీష్ కుమార్ ప్రజలలో ప్రాంతీయవాదం రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీహార్ రాష్ట్రాన్ని పరిపాలించవలసినది బీహారీలా లేక బాహర్ వాలా (బయట వాళ్ళా)? అని ప్రశ్నిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరూ ఏ ఎన్నికలలో బీజేపీకి నేతృత్వం వహిస్తున్నందుకు నితీష్ కుమార్ దానిని కూడా ఒక అవకాశంగా వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దానిని అమిత్ షా అంతే గట్టిగా తిప్పి కొట్టారు. ఎన్నికలలో పార్టీ తరపున ప్రచారం చేయడానికి చాలా మంది వస్తారు. కానీ అలాగా వచ్చిన వాళ్ళలో ఒకరిని బీహార్ ముఖ్యమంత్రిగా చేయలేము కదా? బీహార్ ఎన్నికలలో పోటీ చేసి గెలిచినా బీహారీ వ్యక్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు తప్ప బయట వాళ్ళు కాదు కదా? అని జవాబు చెప్పారు.

By
en-us Political News

  
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.