ములాయం సింగ్ కి ఎన్సీపీ టాటా...బైబై..

Publish Date:Oct 16, 2015

Advertisement

 

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కేవలం నరేంద్ర మోడిని ఎదుర్కోవడానికే ఆరు పార్టీలు కలిసి ములాయం సింగ్ నేతృత్వంలో జనతా పరివార్ ఎప్రాటు చేసుకొన్నాయి. కానీ అందులో ప్రధాన భాగాస్వాములుగా ఉన్న నితీష్ కుమార్ (జె.డి.యు) లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్.జె.డి) ములాయం సింగ్ కి తెలియకుండా తలో వంద సీట్లు పంచేసుకొని మిగిలిన 40 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేయడంతో ఆగ్రహించిన ములాయం సింగ్ జనతా పరివార్ కి గుడ్ బై చెప్పేసి ఒంటరిగా పోటీకి దిగారు. ఆయనతో బాటే ఎన్సీపీ కూడా బయటకు వచ్చేసింది.

 

యస్పీ, ఎన్సీపి తదితర ఆరు పార్టీలు ఆయనతో చేతులు కలపడంతో అదొక తృతీయ కూటమిగా అవతరించింది. బీహార్ ఎన్నికలలో ఇప్పుడు ఎన్డీయే, జనతా పరివార్, వామపక్ష కూటమి, ఈ తృతీయ కూటమి పోటీ చేస్తున్నాయి. ములాయం సింగ్ తృతీయ కూటమికి నేతృత్వం వహిస్తున్నప్పటికీ ఆయన క్రమంగా ప్రధాని నరేంద్ర మోడీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ జాతీయవాదం కలిగిన పార్టీ అని మెచ్చుకొన్నారు. మళ్ళీ మొన్న జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో తమ కూటమికి ఓటువేయమని ప్రజలను కోరుతూనే బీహార్ లో బీజేపీ గాలి వీస్తోందని, ఈ ఎన్నికలలో బీజేపీయే గెలిచే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పడంతో తృతీయ కూటమిలో పార్టీలన్నీ కంగుతిన్నాయి. తమ కూటమిని గెలిపించామని ప్రజలను అడగవలసిన ములాయం సింగ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పడం చూసి వారు విస్తుపోయారు.

 

అందుకు ఆగ్రహించిన ఎన్సీపీ తాము తృతీయ కూటమి నుండి తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పోరాదేందుకే తాము తృతీయ కూటమిలో జేరితే ములాయం సింగ్ మళ్ళీ అదే బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేయడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని అందుకే తృతీయ కూటమి నుండి వైదోలగుతున్నామని ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి తారిక్ అన్వర్ ప్రకటించారు. అయితెహ్ ఎన్సీపీ మొదట అదే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి పనిచేసేందుకు సిద్దపడిన విషయాన్ని ఆయన దాచిపెట్టినా దాగే విషయం కాదు. జనతా పరివార్ తో కాంగ్రెస్ పార్టీతో బాటు ఎన్సీపీ కూడా మొదట చేతులు కలిపింది. కానీ కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కేటాయించి తమకు కేవలం మూడు సీట్లే ఇచ్చినందుకు నిరసనగా ములాయం సింగ్ తో కలిసి బయటకొచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు తృతీయ కూటమి నుండి కూడా బయటకు వెళ్లిపోయింది.

By
en-us Political News

  
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.