కరోనా ఫోర్త్ వేవ్ తలుపులు తడుతోంది తస్మాత్ జాగ్రత్త

Publish Date:Jun 15, 2022

Advertisement

పోయింది .. ఇక రాదు .. అనుకున్న కరోనా మహమ్మారి మళ్ళీ, వస్తోంది. రాదనుకున ఫోర్త్ వేవ్ తలుపులు తడుతోంది. ఇది ఎక్కడో .. ఇంకో దేశంలోనో .. మరో  రాష్ట్రంలోనో కాదు. మన దేశంలోనే, మన తెలంగాణలోనే .. అవును.. ఇంత కాలం.. భయం లేదు. కరోనా ఫోర్త్ వేవ్ రాదు అనుకున్నా.. కరోన మహమ్మారి దేశంలోనే కాదు తెలంగాణలోనూ మళ్ళీ విజృంభిస్తోంది. దీంతో రాష్ట్ర్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.

ఇంత వరకు కరోనా భయం వద్దు, కరోనా కంటే  సీజనల్ జ్వరాల గురించే మనంఎక్కువ జాగ్రతలు తీసుకోవాలని, చెపుతూ వచ్చిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ, కాస్త ఆలస్యంగానే అయినా కళ్ళు తెరిచింది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటం ఆందోళనకరంగా మారిందని, జాగ్రత్తలు తపవని హెచ్చరించింది.  కాగా, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 219 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 1,259కి చేరింది. తాజాగా ఒక్క హైదరాబాద్ లోనే 164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అలాగే ఏపీలోనూ క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రోజు వారీ యాక్టివ్ కేసుల సంఖ్య 20 దాటింది. ఈ పెరుగుదల నాలుగోవ దశ కు సంకేతంగా భావించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మరో వంక సరిహద్దు రాష్ట్రం మహా రాష్ట్రలో పెరుతున్న కేసులు, సంభవిస్తున్న మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. 

మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో 2956 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందారు. 
నిజానికి, చాల కాలంగా శాస్త్రవేత్తలు ఫోర్త్ వేవ్ గురించి హెచ్చరిస్తూనే ఉన్నా, ప్రభుత్వాలు, ప్రజలు కూడా అంతగా పట్టించుకోలేదు. అంతే కాకుండా, ఇతవరకు అక్కడక్కడ కేసులు నమోదవుతున్నా, ఆసుపత్రి చేరికలు అంతగా లేవు. మరణాలు అయితే, అసలే లేవు. దీంతో ఉపేక్ష పెరిగింది. వస్తే వస్తుంది. వచ్చినట్లే పోతుంది అనే ధీమా బలపడింది.  అయితే ఇప్పుడు తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగతున్న వార్తలొస్తున్న నేపధ్యంలో , తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.

దగ్గు, జలుబు వంటి లక్షణాలు కలిగిన ఇన్ఫ్లూయెంజా బాధితులకు వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు శ్వాస సమస్యలు, ఇతర  దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, తగిన జాగ్రతలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. శ్వాస కోస సంబందిత ఆరోగ్య సమస్యలు ఉన్న వారి నమూనాలను సేకరించి ఆర్టీపీసీఆర్ విధానంలో నిర్ధారించాలని పబ్లికెల్త్ డైరెక్టర్ జీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, బస్తీ దవాఖానాలు, ఏరియా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రులకు ఈ లక్షణాలతో ఓపీకి వస్తే వెంటనే కొవిడ్ టెస్టు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.అలాగే, క్షేత్ర స్థాయిలో ‘ఆశా’ కార్యకర్తలు ఆశాలు, ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సర్వే నిర్వహించాలని    ఆదేశించారు.  కరోనా లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరికీ పరిక్షలు నిర్వహించాలని, క్వారంటైన్ చేసి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.

ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇచ్చే మెడిసిన్ కిట్లను ఇవ్వాలన్నారు. అంతేగాక వ్యాక్సినేషన్ ను కూడా వేగవంతం చేయాలన్నారు.దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు, గర్భిణులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని డీహెచ్ అన్నారు. మరో వంక దేశంలో కూడా కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల పెరుగుతుండటం టెన్షన్‌కు గురిచేస్తోంది. తెలంగాణ పక్క రాష్ట్రం మహారాష్ట్రలో 24 గంటల్లో 2956 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందారు. యాక్టివ్‌ కేసుల సంఖ్య 18267కు చేరుకుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1000 దాటింది. తాజాగా 1118 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందారు. యాక్టివ్‌ కేసుల సంఖ్యక.. 3177కు చేరుకుంది. ఈ నేపధ్యంలోనే తెలంగాన వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదిక సంచికలో ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఈ నేపథ్యంలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎవరికీ అంత సులువుగా కనిపించడం లేదు.
అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదనీ, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ-అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
భార్య పేరుతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. చిత్తూరు జిల్లాలో తమ పీఎల్ఆర్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసం ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోబోమని విస్పష్టంగా పేర్కొంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 28 రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమెదించడమే. ఇది ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగుగా భావించవచ్చు.
భారతంలో ద్రౌపదిని వివస్త్రను చేయడానికి కౌరవులు ప్రయత్నిస్తే.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగల్చడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే కురుక్షేత్రంలో కౌరవులు ఓడిపోయినట్టుగా.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది.
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు
1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న నంబర్ 24, అక్బర్ రోడ్ భవనాన్ని ఈ నెల 28 లోగా అంటే శనివారం లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది.
జ‌గ‌న్ లెవ‌న్ పై మీమ్స్ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. పంజాబ్ కింగ్స్ లెవ‌న్ లాగా.. జ‌గ‌న్స్ లెవ‌న్ అనే పేరు మీద మీమ్స్ వెల్లువెత్తాయి. ఇక తాజాగా కొత్త పార్లమెంట్ భవనంలో వైసీపీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కేటాయించినది కూడా 11వ నెంబర్ రూమే.
ఇక 2026 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ప‌లుర‌కాల ఉచితాల వ‌ల ప‌న్నాయంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.