Publish Date:Oct 26, 2024
చెలియల కట్ట తెంచుకుని జనావాసాల మీదకు ఉరుకుతున్న సముద్రం కాదు. భారీ వర్షాలకు చెరువుకట్ట తెగి దూసుకువస్తున్న వరద ప్రవాహమూ కాదు. మరేమిటి? కమ్మేస్తున్న నురుగు. పరిశ్రమల వ్యర్థాలను ఇష్టారీతిగా జలశాయాలలోకి వదలడంతో జనాలను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్న మురుగు నురుగు. ఎక్కడంటారా కర్నాటకలో. ఔను పినాకినీ నదిపై హూసూరు సమీపంలో నిర్మించిన జలాశయం నుంచి పెద్ద ఎత్తున నురుగు బయటకు వచ్చేస్తోంది. పరిసర ప్రాంతాలను కమ్మేస్తోంది.
రోడ్లపైకి వచ్చేస్తోంది. రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది. అసలింతకూ జలాశయం నుంచి భారీ స్థాయిలో నురుగురావడానికి కారణమేంటో తెలుసా? పరిశ్రమల వ్యర్ధాలు. బెంగళూరులోని పరిశ్రమల నుంచి వ్యర్థాలు పెద్ద ఎత్తున జలాశయంలోకి వదిలేస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్యానికి అత్యంత హానికరమైన వ్యర్థాలను జలాశయాలలోకి వదిలేస్తున్నా ప్రభుత్వం చూసీ చూడనట్లు వదిలేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ పరిస్థితిని నివారించాలని డిమాండ్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bengaluru-industries-residuals--into-reservoirs-25-187438.html
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.