సంగీతంతో ఒత్తిడిని జయించండి

Publish Date:Oct 21, 2021

Advertisement

మారుతున్న పరిస్థితుల కారణంగా, జీవన నడవడికలో రకరకాల ఒత్తిళ్లు మన మనోధైర్యాన్ని పరీక్షిస్తాయి. అయితే సమయానుకూలంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లకుంటే మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యార్థులు మార్కుల వేటలో మధనపడుతుంటారు. వ్యాపారస్తులు లాభార్జనకు తపిస్తుంటారు. ఇంటిని ఆర్ధికంగా, ఆరోగ్యకరంగా ఉంచడానికి గృహిణి పరితపిస్తుంటుంది. ఇలా ఎవరి స్థాయిలో వాళ్లు రకరకాల కారణాలతో మానసిక ఒత్తిడికి లోనై కొన్ని సందర్భాల్లో జీవితాలను కూడా త్యజిస్తారు.

*ఒత్తిడికి ప్రధాన కారణం 

మనం ఏదైనా కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టేముందు దాని ద్వారా కలిగే ఫలితాన్నీ ఎక్కువ ఊహించుకోవడం ఆ సమయంలో ఏవైనా ఇబ్బందులు కలిగి మనం అనుకున్నట్లు జరగకున్నా కృంగిపోతాము. ఇదే ఒత్తిడికి ప్రధాన కారణం. టార్గెట్లు పెట్టుకొని పని చేయడం కూడా మంచిది కాదు. ఉదాహరణకు నూతన పెళ్లి చేసుకున్న దంపతులు పాశ్చాత్య పోకడుల కారణంగా ఒకరిపై ఒకరు ఎక్కువ ఊహించుకొని ( expectations) అది నిజ జీవితంలో సాకారం కాకపోవడం వలన ప్రతి క్షణం అదే ఆలోచిస్తూ మధనపడి పోతుంటారు. ఇదో రకం ఒత్తిడి. ఇలా రకరకాల ఒత్తిళ్ల కారణంగా క్షణికావేశంలో విపత్కర నిర్ణయాలు తీసుకుంటున్నవాళ్ల గురించి మనం రోజూ టీవీల్లో చూస్తున్నాము. పత్రికల్లో చదువుతున్నాము. అయితే పరిస్కారం లేని సమస్య అంటూ ప్రపంచంలో లేదు అని అందరూ గుర్తించుకోవాలి. మౌనంగా మనతో మనం మాట్లాడుకుని సమస్యను విశ్లేషించుకుంటే పరిస్కారం కచ్చితంగా దొరుకుతుంది.

*సంగీతంతో ఒత్తిడిని జయించండి

పని వలన కావచ్చు లేదా ఇంట్లో ఆర్ధిక పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. అలాంటి సమయంలో ఏదొక వ్యాపకం మనల్ని ఆ కఠిన క్షణాలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందులో ప్రధానమైనది సంగీతం. ఇష్టమైన సంగీతాన్ని వింటూ కాలాన్ని గడిపితే ఆ కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఆ వినిపించే పాటలో అందులోని మాటల్లో నే ఏదొక సొల్యూషన్ మనకు దొరుకుతుంది. మనసుకు ఆరోగ్యకరమైన ఎంతో ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది.

*పుస్తక పఠనంతో కూడా..!

పుస్తక పఠనం తో కూడా ఒత్తిడిని జయించవచ్చు. ఏదైనా సమస్యతో ఒత్తిడితో ఉన్నప్పుడు ఇష్టమైన పుస్తకం చదవండి. ఖచ్చితంగా ఆ సందర్భానికి ఏదొక పేజీ లో మీ సమస్యకు పరిస్కారం చూపే మాట కనిపిస్తుంది. ఇలా కొన్ని వ్యాపకాలతో మనం ఒత్తిడిని జయించవచ్చు.

◆ వెంకటేష్ పువ్వాడ

By
en-us Political News

  
ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త.. ఆయన 2వేల సంవత్సరాల కిందట చెప్పిన మాటలు నేటికీ అనుసరణీయంగా ఉన్నాయి. ఆయన గొప్ప తత్వవేత్త, జీవితం గురించి ఎన్నో సత్యాలు చెప్పాడు. ముఖ్యంగా మనిషి వ్యక్తిత్వం గురించి...
వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకం. వివాహ వయస్సు కాలక్రమేణా పెరుగుతోంది. చదువు పూర్తయిన తర్వాత అబ్బాయి అయినా  అమ్మాయి అయినా  కెరీర్‌లో స్థిరపడిన సెటిల్ అయిన తర్వాత  మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటారు...
ప్రతి ఒక్కరికి తమ జీవితం బాగుండాలని కోరిక ఉంటుంది. ఇందుకోసం ఏదేదో చేయాలని కూడా ఆనుకుంటారు. కానీ తమ జీవితం బాగుండక పోవడానికి ఎన్నో పరిస్థితులు,  తమ చుట్టూ ఉన్న వ్యక్తులు కారణం అని అనుకుంటూ ఉంటారు...
జనవరి నెలలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, అన్నింటికంటే ముఖ్యంగా ఇది సంవత్సరం ప్రారంభ నెల. ఈ నెలలో  చల్లని గాలి,  నిర్మలమైన  ఆకాశం కూడా ఉంటుంది.  దీనిలాగే ఈ నెలలో జన్మించిన పిల్లలు కూడా కొన్ని ప్రత్యేక వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు....
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలకు సంబంధించినది. ఈ ఇద్దరిలో ఏ ఒకరి అభిప్రాయం,  ఆలోచన,  ఇష్టం లేకపోయినా మరొక వ్యక్తి కూడా జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే పెళ్లి అంటే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు...
మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.