వేసవిలో ఉదయాన్నే ఖాళీ కడుపుతో మారేడు ఆకులు తింటే ఏం జురుగుతుందో తెలుసా?

Publish Date:Apr 1, 2024

Advertisement

 

బిల్వపత్రి లేదా మారేడు ఆకులు దేవుడి పూజకు విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా పరమేశ్వరుడి పూజకు మారేడు దళాలు ఎంతో ముఖ్యం.  ఎటువంటి ఆడంబరాలు లేకపోయినా బిల్వదళం అర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడని అంటారు. అయితే బిల్వదళం కేవలం పూజకు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలామంచిది.  వేసవికాలంలో ప్రతిరోజూ ఉదయమే బిల్వదళం ఖాళీ కడుపుతో తింటే బోలెడు ఆరోగ్యప్రయోజనాలుంటాయని  ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  అసలు బిల్వదళంలో ఉండే పోషకాలేంటి? దీన్ని వేసవిలో రోజూ ఉదయమే తీసుకుంటే కలిగే లాభాలేంటి? పూర్తీగా తెలుసుకుంటే..

పోషకాలు..

బిల్వదళాలలో కాల్షియం,  ఫైబర్ వంటి పోషకాలు,  విటమిన్లు A, C, B1,  B6 పుష్కలంగా ఉంటాయి.


ప్రయోజనాలు..

బిల్వపత్రం వేసవిలో ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే  ఉదర సంబంధ సమస్యలు ఏమున్నా అన్నీ సెట్ అవుతాయి.  గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.  మరీ ముఖ్యంగా  ఖాళీ కడుపుతో తీసుకుంటే ఫైల్స్ సమస్య ఉన్నవారికి చాలామంచిది.

మీరు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో బిల్వదళాలను తీసుకుంటే అందులో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు  గుండెను వ్యాధుల నుండి రక్షిస్తాయి. అలాగే అధిక రక్తపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

బిల్వపత్రి ఆకుల స్వభావం చల్లగా ఉంటుంది. వీటిని తీసుకుంటే శరీరం రోజంతా చల్లగా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో వీటిని తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.


ఖాళీ కడుపుతో  బిల్వ పత్రి ఆకులు తీసుకుంటే నోటిలో  పుండ్లు సమస్య తగ్గుతుంది.  

డయాబెటిక్ పేషెంట్లు ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో  బిల్వ పత్రి ఆకులను తీసుకోవచ్చు. ఇందులో ఉండే ఫైబర్,  ఇతర పోషకాలు మధుమేహ రోగులకు చాలా మంచివి.  అలాగే ఖాళీ కడుపుతో బిల్వ పత్రి  తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

                                         *నిశ్శబ్ద.

By
en-us Political News

  
పసుపు,  తేనె భారతీయ వంటగదిలో రెండు ప్రధాన పదార్థాలు. ఇవి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. పసు
నిమ్మకాయ చాలా పానీయాలలో ఉపయోగిస్తారు.  అటు వంటలలోనూ, ఇటు స్వీట్ల లోనూ, మరొక వైపు రిఫ్రెషింగ్ పానీయాలలోనూ నిమ్మకాయను ఉపయోగిస్తారు.  చాలామంది ఉదయాన్నే నీటిలో నిమ్మరసం కలిపి తాగుతూ ఉంటారు....
నేటికాలంలో చాలామందిలో కనిపిస్తున్న సమస్య ఫ్యాటీ లివర్.. చిన్న వయసు వారు కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు.
కీళ్ల నొప్పులు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య.
వేసవి కాలం అంటేనే చాలా ఇబ్బంది కాలం. అందులోనూ మునుపటి కంటే ప్రతి ఏడాది ఎండల తీవ్రత పెరుగుతూనే ఉంటుంది.
ఆరోగ్యంగా ఉండటానికి చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటాము
ఇంతకు ముందు రోజుల్లో కిడ్నీలో రాళ్లు అనే విషయాన్ని ఎక్కువగా వినేవాళ్లం.
చాలామంది ఒత్తిడిగా ఉంది అంటూ ఫిర్యాదు చేస్తుంటారు.
 వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని,  శక్తిని అందించడానికి చెరకు రసం చాలా మంచి పానీయం.
ఆరోగ్యం పాడైనప్పుడు ఆసుపత్రికి వెళ్లినప్పుడు  వివిధ రకాల పరీక్షలు చేస్తుంటారు.
వేసవిలో మండే ఎండ అయినా, ఆఫీసులో బిజీ జీవితం అయినా, మానసిక అలసట, జ్ఞాపకశక్తి తగ్గడం ఈ రోజుల్లో అన్ని వయసుల వారికి ఒక సమస్యగా మారాయి.
కాలేయం శరీరంలో ముఖ్యమైన అవయం.
కుంకుమ పువ్వు ప్రపంచంలో అత్యంత ఖరీదైన సుగంద ద్రవ్యం. దీన్ని సాధారణంగా ఖరీదైన వంటకాలలోనూ, తీపి పదార్థాల తయారీ లోనూ, గర్భవతులు, బిర్యానీ వంటి వంటకాలలోనూ ఉపయోగిస్తారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.