ఈటల.. ఆత్మగౌరవం ఏమైందయ్యా ? బీసీ నేత ఆక్రోశం..

Publish Date:May 31, 2021

Advertisement

కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం ఖాయమైంది. ఢిల్లీలో కమలం పార్టీ పెద్దలను కలిశారు రాజేందర్. రేపోమాపో అధికారికంగా కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత.. ఆయనపై జనాల నుంచి సానుభూతి లభించింది. బీసీ సంఘాలకు ఈటలకు మద్దతుగా రోడ్డెక్కాయి. ఈటల కూడా బీసీ వాయిస్ వినిపించడం, ఆత్మగౌరవం అంటూ కేసీఆర్ కు కౌంటరిచ్చారు. దీంతో ఈటల రాజేందర్.. బీసీ ఎజెండాగా కొత్త పార్టీ పెడతారని భావించారు. అయితే ఈటల మాత్రం కొత్త పార్టీ ఆలోచన పక్కన పెట్టి బీజేపీకి జై కొట్టారు. ఈటల తీరుతో బీసీ సంఘాలు అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది.

తమను టార్గెట్ చేస్తున్నారంటూ మీడియా ముందుకు వచ్చిన ఈటల రాజేందర్ భార్య జమున.. బీసీ నేతగా గుర్తింపు పొందిన వకులాభరణం కృష్ణ మోహన్ పై విరుచుకుపడ్డారు.ఎంగిలిమెతుకుల జీవితం కృష్ణమోహన్ ది అని… ఆయనను చూస్తే ఒక్క ఓటు కూడా పడవని అన్నారు. జమున వ్యాఖ్యలకు మాజీ బిసి కమిషన్ సభ్యుడు  కృష్ణ మోహన్ ఘాటుగానే కౌంటరిచ్చారు. బీసీలను అవమానించారని మండిపడ్డారు. తాను బీసీల కోసం స్కీములు తెస్తే.. ఈటల స్కాములు చేశారని ఆరోపించారు. ఈటల రాజేందర్ భార్య జమునకు కౌంటర్ గా వకుళాభారం కృష్ణ మోహన్ విడుదల చేసిన లేఖను ఉన్నది ఉన్నట్లుగా ఇస్తున్నాం... చదువుకోండి.. 

నాపై ఈటల జమున వ్యాఖ్యలు దురహాంకారానికి పరాకాష్ట
ఉద్యమ నేతగా నేను బడుగులకు స్కీమ్‌లు పెట్టించాను
మంత్రిగా ఈటల బడుగుల భూములు లాక్కొని స్మామ్‌లు చేశారు
ఈటల జమున ఆరోపణలు బట్ట కాల్చి మీద వేయడం లాంటిదే
నా జీవితం స్పటికంలా పారదర్భ్శకమైంది
ఈటల జీవితం అక్రమాస్తులకు నెలవైంది
ఎంగిలి మెతుకులు తినే జీవితం నాది కాదు
నోటి కాడి బుక్కను లాక్సునే జీవితం మీది
నాపై నిందలు మీ కుట్రపూరిత మనస్తత్వానికి నిదర్శనం
- డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు

మాజీమంత్రి ఈటల రాజేందర్‌ బర్తరఫ్‌ దరిమిలా జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో భాగంగా తొలిసారిగా ఈటల సతీమణి జమునా రెడ్డి ఆదివారం నాడు మీడియా ముందుకు వచ్చి నాపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. ఈ వ్యాఖ్యలు ఈటల దంపతులు ఇన్నాళ్ళుగా వల్లిస్తున్న ఆదర్శ్భభావాలు, ఆదర్శ జీవితం, కులరహిత సమాజం, ప్రజలందరూ సమానమే అనేవి ఉత్త కహానీలే అని తేలిపోయింది. దశాబ్దాలుగా తెలుగు సమాజంలో బిసి ఉద్యమ నేతగా మంచి గుర్తింపును తెచ్చుకున్న నాలాంటి వాడిపై జమున వ్యాఖ్యలు ఆమెలోని దురహంకారాన్ని ధన అహంకారాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈటల నిజరూపం బయటపడ్డాక సాధికారికంగా నేను రాసే వ్యాసాలు, ఆయనపై నా వ్యాఖ్యలు సహించలేక, బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం వారి అపరిచిత మనస్తత్వానికి నిదర్శనం. దుర్మార్గమైన ఆరోపణ ఏమిటంటే నా కుటుంబాన్ని దీరేదో నెల నెల ఖర్చులు ఇచ్చి ఆదుకుంటున్నట్లు చెప్పడం ఇంతకన్నా అమానవీయం, నిర్లజ్ఞాతనం మరొకటి లేదు.

నిజంగా అలాంటి ఉదార స్వభావం మీలో వుంటే, మీ ద్వారా ఎంతమంది బాగుపడ్డారో, ఎన్నికుటుంబాలను నిలబెట్టగలిగారో చెప్పడం సాధ్యమా? మీరే అంతటి ఉన్నత భావాలు కలిగినవారైతే
ఈరోజు మీ వెంబడి నియోజకవర్గంలోని ఒక్క ప్రజాప్రతినిధి లేకపోవడానికి కారణమేమై ఉంటుంది.ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న ఈటల వెంబడి ఒక్కరంటే ఒక్కరు లేకపోవడం ఇంతకన్నాఅవమానం మరేముంటుంది. పైగా మేము ఆదర్శవంతులమని చెప్పుకోవడం ఆత్మహత్యా సద్భశ్యం.ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. నేను విద్యార్థి దశ నుండి ఉద్యమ జీవితం గడుపుతూ రాజకీయాల్లోకి వచ్చాను. నిరంతరం ప్రజల గొంతుకగానే నా జీవితం కొనసాగుతున్నది. మీరు వ్యాపారాల నుండి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాలను కూడా వ్యాపారమయం చేశారు. నాడు బిసి నేత ఆర్‌. కృష్ణయ్య నేతృత్వంలో పోరాటాల ద్వారా ఆ వర్గాలకు అనేక “స్మమాలు పెట్టించగలిగాం. అలానా జీవితం పారదర్శకమైంది, త్యాగమయమైంది. మీరేమో వ్యాపారాల నుండి వచ్చారు. రాజకీయాలను,అధికారాన్ని అడ్డం పెట్టుకొని “స్మామొలు చేశారు, ఇది మీ జీవితం. మీరేదో సచ్చీలురు అయినట్లు మాట్లాడితే వాస్తవాలు-అవాస్తవాలు కావు. ఈ నిజం తెలుసుకోండి.

ఎంగిలి మెతుకులు తినాల్సిన అగత్యం నాకు లేదు. నా జీవితమే ఆత్మ గౌరవంతో,ఆత్మాభిమానంతో ముడిపడి వుంది. కాగా నేడు మీరు వల్లిస్తున్న ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం, సామాజిక కోణం, కేవలం మీ అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే. ఈ విషయం ప్రజలందరి గమనంలో వుంది. “మా ఇంటిలో పొయ్యి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుందని రాజేందర్‌ గారు చెబుతున్నప్పుడు ఎంత గొప్పవారో అనుకున్నాం”. నేడు మా ఇంటికి వచ్చి తిని పోయిందని వచ్చి పోయిన వారిని అవమానిస్తూ మాట్లాడుతున్నారు. మీ దృష్టిలో బలహీన వర్ణాలు అంటే ఇంత చులకననా? తిండి తిని పోయేవారిలా చూస్తున్నారా? బలహీన వర్గాలంటే తిండి పారేస్తే తిని పోయే వారనే అభిప్రాయమా? మీ మనస్సులో ఇంత సంకుచితత్త్రం ఉందని తెలిస్తే ఎవరూ మీ ఇంటికి రాకపోయేవారు కదా! ఎందుకంటే బలహీనవర్గాలకు ఆత్మాభిమానమే ప్రధానం. తింది లేకున్నా పస్తులు పంటాం. మాకు ఉంటే నలుగురికి పెట్టి తింటాం. ఇటువంటి కొంచెపు బుద్ధులు మాకుందవు. కోట్లు వున్నామీది కొంచపు బుద్ధి. మా ఆత్మాభిమానం సహజంగా ఉంటుంది. “మీ డబ్బు, అధికారం మా ఆత్మాభిమానం ముందు ఎందుకూ పనికిరాదు. పైగా ఎవరిని కోసి చూసినా రక్తం ఎరుపుగానే ఉంటుంది అంటున్నారు. మాకు ఏ వర్గాలపై వివక్షత లేదంటున్నారు. మరోవైపు బహిరంగంగానే అవమానిస్తున్నారు. నాలాంటి వారిపై మీ కువిమర్శలు మీ మనస్తత్వాన్ని మీ ఫ్యూడల్‌ వ్యవహార శైలిని స్పష్టం చేస్తున్నాయి. నిగూఢంగా ఉన్నమీ అసలు రూపాన్ని ప్రజలు ఏనాడో గమనించారు. అందుకే నేడు మీ వెంట ఎవరూ రావడం లేదు.

2004 సంవత్సరంలో ఈటల రాజేందర్‌, నేను ఒకేసారి రాజకీయ జీవితం ప్రారంభించాం. ఆయన వ్యాపారాలు చేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. నేను బిసిల హక్కుల నేతగా ఉద్యమ జీవితం నుండి కొనసాగింపుగా రాజకీయాల్లోకి వచ్చాను. 2004 లోనే దేశంలోనే అతి చిన్న వయస్సులో బిసి కమిషన్‌ సభ్యుడిగా నియామకమయ్యాను. ఈటల అందివచ్చిన అవకాశంతో ఎమ్మెల్యే కాగలిగారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా ఈటల వ్యాపారాలు చేసుకుంటూనే ఉన్నారు. నేను ప్రజాసేవ కొనసాగిస్తూనే ఉన్నాను. 2009 సాధారణ, 2010 ఉప ఎన్నికలలో ఈటలపై రెందుసార్లు కాంగ్రెస్‌ పార్టీ నుండి పోటీ చేశాను, పరాజయం పాలయ్యాను. 2009 ఎన్నికలలో కేవలం 15 వేల స్వల్ప తేడాతో ఓటమిని చవి చూశాను. ఆ ఎన్నికలలో నా మెజారిటీని చూసి ఈటల ఖంగుతిన్నారు. అప్పుడు ఈ వకుళాభరణం ముఖానికే అన్ని ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఈటలపై అంతగా గట్టి పోటీని ఎవరూ ఇవ్వలేకపోయారు. 2009 ఎన్నికలు నాకు చీకటి రోజులని సంవత్సరాల తరబడి చెప్పుకొని బాధపడుతుందేవాడు. ఈ విషయం తెలిసి కూడా ఈటల జమున ఈ వకుళాభరణం ముఖం చూసి ఎవరైనా ఓట్లు వేస్తారా అని మాట్లాడడం హాస్యాస్పదం. ప్రస్తుతం నేను టిఆర్‌ఎస్‌ అభ్యర్థిని నేనే అని ఎక్కడా చెప్పుకోలేదు. వం నుండి ఎలాంటి సంకేతాలు లేవు. అయినప్పటికీ నాపై ఇంతగా తక్కువ చేసి విమర్శించడం ధన గర్వం కాక మరేమవుతుంది. జమున చేసిన వ్యాఖ్యలు ఆమెలోని అవివేకాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరి 2018 ఎన్నికలలో నా పూర్తి సహకారాన్ని రాజేందర్‌ ఎందుకోసం తీసుకున్నారు. నెలన్నర రోజులపాటుగా హుజూరాబాద్‌లోనే పూర్తిన్ధాయి మకాం వేసి ఈటల గెలుపు కోసం నాదైన పద్ధతిలో చేసిన కృషిని ఎన్నోసార్లు ఆయన ఎలా అభినందించగలిగారు. ఇది వాస్తవం. కాగా పనీ పాటా లేకుండా నేను తిరుగుతా ఉంటే… ఈటల నాపై అభిమానాన్నిప్రదర్శించి తెలంగాణ ప్రభుత్వంలో బిసి కమిషన్‌ సభ్యుడిగా నియామకం చేయించడం ద్వారా గుర్తింపు వచ్చిందని చెప్పడం అజ్ఞానం కాక మరేమవుతుంది.

నా జీవితంలో ఒక్క విషయాన్ని మాత్రం గొప్పగా చెప్పుకుంటాను. అది 2004 సంవత్సరంలో కేప్టెన్‌ వి.లక్ష్మికాంతరావు (ప్రస్తుత రాజ్యసభ సభ్యులు) నాడు బిసి మంత్రిగా సిఫారసు చేసి నన్ను బిసి కమిషన్‌ సభ్యుడిగా నియామకం చేయించారు. క్రమంగా నిబద్ధతతో పని చేస్తూ, నాటి ముఖ్యమంత్రి మన్ననలతో ఎమ్మెల్యే బి-ఫారం పొంది పోటీ చేయగలిగాను. పూజయంతో క్రుంగిపోకుండా నాదైన పద్ధతిలో బిసి హక్కుల కోసం నిరంతరం పని చేస్తుందడం జీవితంలో ఒక భాగం చేసుకున్నాను. నాడు కాంగ్రెస్‌ పార్టీలో కూదా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నాను. పార్టీ అధికార ప్రతినిధిగా టి.వి. చర్చలలో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించాను. కానీ నేను ఏనాడూ వ్యక్తిగతంగా ఆస్తులు ‘పెంచుకోలేదు సరికదా, ఆస్తులు కోల్పోయాను, అప్పుల పాలయ్యాను.ఇది ముమ్మాటికి వాస్తవం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈటల బడుగుల భూములు గుంజుకున్నారు.నేను అధికారంలో ఉన్నా లేకున్నప్పటికి బిసి వర్ణాల సమగ్ర వికాసానికి కృషి చేస్తూనే వున్నాను.2016 లో నా సేవలను గుర్తించి ముఖ్యమంత్రి కెసిఆర్‌ తెలంగాణ తొలి బిసి కమిషన్‌లో సభ్యుడిగా నియామకం చేశారు. ఆ పదవిలో కూడా నా వర్ణాల అభ్యున్నతికి చిత్తశుద్ధిగా కృషి చేయడం జరిగింది. ఈటల రాజేందర్‌కు నిజంగానే పదవులు ఇప్పించగలిగే శక్తే వుంటే ఇప్పటి వరకు హుజూరాబాద్‌ నియోజకవర్గం నుండి రాష్ట్రస్థాయిలో ఎంతమందికి పదవులు ఇప్పించారు. నియోజకవర్గంలోని నాయకులకు ఇదిగో-అదిగో అంటూ కాలం వెళ్లబుచ్చారు తప్ప ఒక్కరికైనా పదవి ఇప్పించగలిగారా సమాధానం చెప్పాలి.

మీ అక్రమ ఆస్తులపై దర్యాస్త జరుపుతుంటే, మీరు జరుపకూడదంటూ గగ్గోలు పెడుతున్నారు.నేను ఏమైనా అక్రమాస్తులు సంపాదించి వుంటే, ఆస్తులు పెంచుకొని వుంటే దర్యాస్త జరుపవలసిందిగా డిమాండ్‌ చేస్తున్నాను. ఇది వాస్తవం.మీరు ప్రతిసారి కెసిఆర్‌ బొమ్మ పెట్టుకొని గెలిచారు.ఇప్పుడు పదిహేదేండ్లు ఎమ్మెల్యేగా, ఏదేండ్లు మంత్రిగా ఉన్న తరువాత కూడా మీ బొమ్మ చూసి ఓట్లేసే దిక్కులేదు. అందుకే కాంగ్రెస్‌, బిజెపి నాయకుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.టిఆర్‌ఎస్‌ నుండి ఎవరికి టికెట్‌ ఇచ్చినా కెసిఆర్‌ బొమ్మ పెట్టుకొని గెలుస్తాం. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగుమని సవాల్‌ చేస్తున్నాం బలహీన వర్గాల సమున్నతికి మీరు చేసింది ఏమిటో మీ మనస్సాక్షికి తెలుసు. రేపటి ఎన్నికలలో బలహీన వర్గాలే మీ అహంకారాన్ని వదలదీసి బుద్ధి చెబుతారు. ఇది రేపటి వాస్తవం..

- డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.