పంతం నెగ్గించుకున్న బాలినేని.. విజయం అంత వీజీ కాదు!

Publish Date:Jan 1, 2024

Advertisement

మొత్తానికి ఒంగోలులో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది.   నేనెక్కడి వెళ్ళను ఒంగోలులోనే ఉంటా.. ఒంగోలు నుంచే పోటీ చేస్తా అంటూ ప్రకటనలు ఇస్తూ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఒక దశలో వచ్చేఎన్నికల్లో బాలినేనికి టికెట్ దక్కదని కూడా గట్టిగా వినిపించింది. వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు అభ్యర్థుల మార్పు పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును తప్పించి ఇక్కడ నుండి బాలినేనిని పోటీ చేయించాలని సీఎం జగన్ భావించారు. కానీ  బాలినేని మాత్రం ఒంగోలు నుండే పోటీ చేస్తా అని తనకు తానే టికెట్ ప్రకటించేసుకున్నారు. దీంతో ఆయన పార్టీని వీడడం లేదా వైసీపీ ఆయనకు సీటు కేటాయించకపోవడం జరుగుతుందని రాజకీయ వర్గాలు భావించాయి. బాలినేని కూడా జనసేన పార్టీతో టచ్ లోకి వెళ్లారని ప్రచారం జరిగింది. కానీ  బాలినేని పంతం ముందు జగన్ మోహన్ రెడ్డి మొండితనం ఓడిపోయింది. ఎంతైనా బంధువులు కదా ఏం చర్చించారో.. ఏం నిర్ణయించుకున్నారో కానీ ఫైనల్ గా ఒంగోలు బాలినేనిదేనని తేల్చేసినట్లు తెలుస్తున్నది.

   బాలినేని సీటు దక్కించుకునే విషయంలో తన పంతం అయితే నెగ్గించుకోగలిగారు కానీ,  ఈసారి ఇక్కడ గెలవడం మాత్రం అంత ఈజీ  కాదు. దానికి సవాలక్ష కారణాలున్నాయి. అందులో ఆయనకి ఆయన చేసుకున్నవి కొన్ని కాగా.. పార్టీ చేసినవి మరికొన్ని ఉన్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల‌ మంత్రిగా బాలినేని దాదాపు మూడేళ్ల పాటు ఉన్నారు. కానీ ఆ తర్వాత మంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆయనలొ అలక మొదలైంది. బాలినేని గత రెండున్నరేళ్లుగా చీటికి మాటికి పార్టీమీద అలగటం, సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పించడం, పరోక్షంగా జగన్ పైన కూడా వాగ్బాణాలు సంధించటం తెలిసిందే. సొంత పార్టీ నేతలే అరాచకాలు, అక్రమాలు చేస్తున్నారని ఆధారాలతో సహా బయటపెట్టారు. అయితే బాలినేని అలిగిన ప్రతిసారి జగన్ ఆయనను బుజ్జగించి సముదాయించారు.   కానీ  బాలినేని డిమాండ్లు మాత్రం పరిష్కారం కాలేదు. దీంతో అటు బాలినేని వర్గం సంతృప్తిగా లేదు.. బాలినేని చేష్టలతో ఆయన వ్యతిరేక వర్గం కూడా సంతృప్తిగా లేదు. రేపు ఈ రెండు వర్గాలు కలిసి పనిచేయడం దాదాపు అసంభవంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

బాలినేని ఆరోపించినట్లు జగన్ ప్రభుత్వంలో ఒంగోలులో అవినీతి, అక్రమాలు రాజ్యమేలాయి. ఇసుక దందాతో ఒక వర్గం కోట్లకు పడగలెత్తినట్లు ఆరోపణలున్నాయి. ఇతర దేశాలలో ఉంటూ ఇక్కడ ఆస్తులు కలిగి ఉన్నవారి కుటుంబాలను టార్గెట్ చేసి భారీ స్థాయిలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. స్వయంగా బాలినేనినే ఆధారాలతో సహా బయటపెట్టగా.. అప్పట్లో పోలీసులు పదిమందిని అరెస్ట్ చేశారు. అయితే, అసలు దొంగలు మాత్రం దర్జాగానే ఉన్నారు. ఇది పార్టీకి ఇక్కడ అతిపెద్ద మైనస్. అలాగే ఒంగోలు నగరంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. బాలినేని మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరుతో కాలం గడిపేశారు తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఆ మాటకొస్తే ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి చేసిందేమీ  లేదు. దీంతో ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ తారస్థాయిలో ఉంది. దీనికి తోడు పార్టీలో వర్గపోరు. బాలినేని అంటేనే ఆయన వ్యతిరేక వర్గం మండిపడుతున్నారు. 

అదే సమయంలో తెలుగుదేశం అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఈ ఐదేళ్లలో నియోజకవర్గంపై  పట్టు బిగించారు. కొండెపి ఎస్సీ రిజర్వ్ కావడంతో ఒంగోలుకు వచ్చిన జనార్దన్ గత ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెట్టించారు. అంతకు ముందు ఇదే బాలినేని ఇక్కడ ఎమ్మెల్యే అయినా ఒంగోలు అభివృద్ధిని పట్టించుకోలేదు. కానీ జనార్దన్ వచ్చీ రాగానే నగర రూపురేఖలు మార్చేశారు. అప్పుడు ఆయన ఎక్కడ ఆపారో ఒంగోలు నగరం ఇప్పటికీ అక్కడే ఉంది. జనార్దన్ తోనే ఒంగోలు నగర అభివృద్ధి అనే  ముద్ర ప్రజలలో గట్టిగా పడింది.  దీంతో ప్రజలే ఆయనను ఓడించి తప్పు చేసినట్లు భావిస్తున్నారు. జనార్దన్ హయాంలో నియోజకవర్గం ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉంది అనేది   తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అటు సొంత పార్టీలో  బాలినేనికి పట్టు తగ్గడం, ప్రజలలో అసంతృప్తి, దామచర్లపై సానుభూతి కలిసి..ఈసారి ఒంగోలులో  బాలినేని గెలుపు అంత వీజీ కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.