Publish Date:May 13, 2026
మెదక్ జిల్లా మరోసారి శిశు విక్రయ ఘటనతో కలవరపాటుకు గురైంది. ఇటీవలే నవజాత శిశువును నర్సులు అమ్మిన ఘటన ప్రజలను షాక్కు గురిచేయగా… ఇప్పుడు మరో పసికందును డబ్బుల కోసం విక్రయించిన సంఘటన వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తల్లి ఒడిలో పెరగాల్సిన పాపకు పుట్టిన కొద్ది రోజులకే ధర కట్టడం సమాజాన్ని కలచివేస్తోంది.
మేడ్చల్ జిల్లాలోని కొల్చారం మండలం పోతారెడ్డిపల్లి తండాకు చెందిన శిరీష(25)కు మార్చి 27న నాలుగో కాన్పులో ఆడశిశువు జన్మించింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉండటంతో ఆ దంపతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీవనోపాధి కోసం పోరాడుతున్న వారు చివరకు కన్న కూతురినే అమ్మేయాలనే దారుణ నిర్ణయం తీసుకున్నారు.
ఈ వ్యవహారంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన శారద అనే మహిళ మధ్యవర్తిగా వ్యవహరించింది. ఆమె సిద్దిపేట జిల్లా ములుగు మండలం అల్లినగర్కు చెందిన కలమ్మ, లింగయ్య దంపతులతో మాట్లాడి ఒప్పందం కుదిర్చింది. ఏప్రిల్ 1న శిశువును మూడు లక్షల రూపాయలకు విక్రయించినట్లు సమాచారం. అయితే అందులో అసలు తల్లిదండ్రుల చేతికి చేరింది కేవలం రూ.40 వేలే కాగా… మిగతా మొత్తం మధ్యవర్తి తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
కొన్ని రోజుల తర్వాత ఐసీడీఎస్ అధికారులు శిరీష ఇంటికి వెళ్లి శిశువు గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. “పాప ఎక్కడ?” అనే ప్రశ్నకు తల్లిదండ్రులు తడబడటంతో అధికారులకు అనుమానం వచ్చింది. లోతుగా విచారించగా శిశు విక్రయం జరిగినట్లు తేలింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తల్లిదండ్రులు, మధ్యవర్తి సహా మొత్తం పది మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
కేవలం రెండు నెలల వ్యవధిలోనే మెదక్ జిల్లాలో ఇది మూడో శిశు విక్రయ ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది. పేదరికం ఎంతటి దారుణ నిర్ణయాలకు దారితీస్తుందో… పసికందులకు కూడా ధర కట్టే పరిస్థితులు ఇంకా సమాజంలో ఉన్నాయనే విషాద వాస్తవాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/baby-sold-again-in-medak-36-219711.html
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల మాస్టర్ ప్లాన్ కోసం 6 నెలల డెడ్లైన్ విధించారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యాలు, వైజాగ్ బే సిటీ ప్రాజెక్ట్ విశేషాలు మరియు రాయలసీమ హార్టికల్చర్ విప్లవంపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హెబ్బాల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న సిగ్నల్ రహిత కారిడార్, సదాహళ్లి అండర్పాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫినిష్ ది జాబ్ అంటూ ఓవల్ ఆఫీస్ నుండి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టెహ్రాన్లో వ్యక్తమవుతున్న ప్రతీకార జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై కేసు నమోదు చేశారు.
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్లైన్లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా పోర్ట్ఫోలియోలోని వి మార్క్ ఇండియా మల్టీబ్యాగర్ స్టాక్ ఒక్కరోజే 81% పతనమైందా ఇన్వెస్టర్లు ఎందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదో, 5:1 బోనస్ షేర్ల వెనుక ఉన్న అసలు మార్కెట్ లెక్కలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకోండి.
కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా షేర్లు మంగళవారం ట్రేడింగ్లో దాదాపు 8 శాతం పడిపోయాయి. ఆదాయం పెరిగినప్పటికీ, ప్రత్యర్థి టైటాన్ కంపెనీ ఫలితాల ప్రభావం మరియు మార్కెట్ అంచనాల వల్ల ఈ భారీ పతనం సంభవించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
నోబుల్ సంస్థ సరికొత్తగా తెచ్చిన నోబుల్ ఆస్ప్రే వైర్లెస్ ఇయర్బడ్స్ పూర్తి రివ్యూ. $199 ధర, బ్లూటూత్ 6.0, LDAC సపోర్ట్ ఉన్నా ఈ ఇయర్బడ్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయో ఇక్కడ చదవండి.
అమెజాన్ ప్రైమ్ డే సేల్లో వైరల్ హిట్ నింజా లక్స్ కేఫ్ ప్రీమియర్ ఎస్ప్రెస్సో మెషిన్పై ఏకంగా 53% భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఆస్ట్రేలియాలో ఆల్-టైమ్ లో ధరకు దొరుకుతున్న ఈ త్రీ-ఇన్-వన్ కాఫీ మేకర్ ఫీచర్లు, ధర వివరాలు ఇక్కడ చూడండి.
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు కానుందా? రాబోయే 12 నెలల్లో సెన్సెక్స్ లక్ష మార్కును తాకడానికి ఉన్న అవకాశాలు, బుల్ మార్కెట్ ర్యాలీని ప్రేరేపించే కీలక ఆర్థిక అంశాలపై మోర్గాన్ స్టాన్లీ Morgan Stanley నివేదిక పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.