అధికారులూ జాగ్రత్త.. నిబంధనలు మీరొద్దు.. చిక్కుల్లో పడొద్దు!

Publish Date:Jun 20, 2022

Advertisement

నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా జగన్ పాలన కోనసాగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పడుతూ కోర్టులు ఎన్ని సార్లు ఆగ్రహం వ్యక్తం చేసినా జగన్ పట్టించుకోవడం లేదు. నా ప్రభుత్వం.. నా ఇష్టం అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. 151 స్థానాలలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టడానికి కోర్టులకు అధికారమేమిటన్నట్లుగా ఆయన పాలనా ధోరణి కనిపిస్తోందని విమర్శకులు అంటున్నారు. కోర్టులు ఎన్ని సార్లు మొట్టికాయలు వేసినా, ఆక్షింతలు జల్లినా, ఐఏఎస్ అధికారులకు శిక్షలు విసినా, జరిమానాలు వేసినా జగన్ సర్కార్ తీరు ఏ మాత్రం మారడం లేదు.
పాలన అంటే కక్ష సాధింపే అన్న చందంగా జగన్ హయాం కొనసాగుతోంది. తాజాగా ఆదివారం తెల్లవారు జామున తెలుగుదేశం సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడి నివాసం కూల్చి వేతకు అధికారులు యత్నించడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఆ వేళలో అంత రాత్రి వేళ కూల్చివేతల అవసరమేమిటని కోర్టు ప్రశ్నించింది. దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నిలదీశారు. అయ్యన్న పాత్రుడికి మద్దతుగా నర్సీపట్నం వెళుతున్న  తెలుగుదేశం నాయకులను హౌస్ అరెస్టులు చేయడం జగన్ పిరికి తనానికి నిదర్శనమని చంద్రబాబు విమర్శించారు. అక్రమ కూల్చివేతలే సరికాదంటుంటే.. ఆ కూల్చివేతలకు నిరసన తెలియజేడయానికి వెళుతున్న వారిని అరెస్టు చేయడమేమిటని పరిశీలకులు సైతం ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతోందని వారు అంటున్నారు. 

నిరసన తెలపడానికి విపక్ష నేతలకు హక్కే లేదన్నట్లుగాఆక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్న జగన్ సర్కార్ నేరస్తులకు మాత్రం రాచమర్యాదలు చేస్తున్నదని విమర్శిస్తున్నారు. అనంతబాబు విషయమే తీసుకుంటే.. విచారణలో తానే స్వయంగా హత్య చేశానని అంగీకరించినా.. పోలీసులు ఇంత వరకూ ఆయనను తమ కస్టడీకి తీసుకోవడానికి కోర్టును కోరలేదన్నారు. రిమాండ్ ఖైదీగా  అనంతబాబుకు జైళ్లో రాచమర్యాదలు జరుగుతున్నాయనీ గుర్తు చేశారు.  కాగా అయ్యన్న పాత్రుడి నివాసం కూల్చివేత విషయానికి వస్తే.. కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి దాటిన తరువాత అధికారులు మందీ మార్బలంతో కూల్చివేతకు బుల్ డోజర్ తో సహా వచ్చారంటే.. ఇందుకు సంబంధించిన ఆదేశాలు ఏ స్థాయి నుంచి వచ్చాయే తేలికగానే అర్ధమౌతుందని అంటున్నారు.

నర్సీపట్నం వెళుతున్న తెలుగుదేశం నాయకులను అరెస్టు చేయడాన్ని జగన్  పిరికి పంద చర్యగా అభివర్ణించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అయ్యన్న పాత్రుడి ఇంటి కూల్చివేత యత్నం జగన్ కక్ష సాధింపు చర్యే అన్న తమ వాదనే నిజమని కోర్టు తన వ్యాఖ్యలద్వారా రుజువు చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను గర్హిస్తూ గట్టిగా గళం వినిపిస్తున్న  తెలుగుదేశం బీసీ నేతలపై కేసులు, అరెస్టులు, ఇళ్లపై దాడులతో జగన్ వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. జగన్ కక్ష సాధింపు చర్యలకు వత్తాసు పలుకుతూ నిబంధనలను తుంగలో తొక్కి వ్యవహరిస్తున్న ప్రతి అధికారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.  ప్రభుత్వ ప్రాపకం కోసం నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించి ఆనక చిక్కుల్లో పడవద్దని అధికారులకు చంద్రబాబు హితవు పలికారు.

అయ్యన్న చేసింది కబ్జా కాదని....ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం 600 ఎకరాల దళితుల భూములు చెరబట్టడమే నిజమైన కబ్జా అని చంద్రబాబు అన్నారు. అయ్యన్న ఇంటిని కూల్చివేసేందుకు వందల మంది పోలీసులతో, ముగ్గురు ఐపిఎస్ లు, సమస్త రెవెన్యూ అధికారులను మోహరించడం జగన్ దిగజారుడు విధానాలకు  పరాకాష్ఠగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభివర్ణించారు.  టిడిపి సభలు విజయవంతం అవ్వడం, ప్రజలనుంచి కూడా తిరుగుబాటు మొదలవ్వడంతో తీవ్ర ఫ్రస్టేషన్ లో పడిన జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారని,  ఉత్తరాంధ్రలో నాడు సబ్బంహరి, పల్లా శ్రీనివాస్ ఇళ్లపై, ఆస్తులపై ప్రభుత్వ చర్యల ముసుగులో దాడి చేయించిన జగన్...ఇప్పుడు అయ్యన్న ఇంటిపై దాడి చేశారని అన్నారు. ఈ దాడులు, కక్ష సాధింపు చర్యలకు టిడిపి నేతలు ఎవరూ భయపడరని చంద్రబాబు అన్నారు.

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.