అధికారులూ జాగ్రత్త.. నిబంధనలు మీరొద్దు.. చిక్కుల్లో పడొద్దు!

Publish Date:Jun 20, 2022

Advertisement

నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా జగన్ పాలన కోనసాగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పడుతూ కోర్టులు ఎన్ని సార్లు ఆగ్రహం వ్యక్తం చేసినా జగన్ పట్టించుకోవడం లేదు. నా ప్రభుత్వం.. నా ఇష్టం అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. 151 స్థానాలలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టడానికి కోర్టులకు అధికారమేమిటన్నట్లుగా ఆయన పాలనా ధోరణి కనిపిస్తోందని విమర్శకులు అంటున్నారు. కోర్టులు ఎన్ని సార్లు మొట్టికాయలు వేసినా, ఆక్షింతలు జల్లినా, ఐఏఎస్ అధికారులకు శిక్షలు విసినా, జరిమానాలు వేసినా జగన్ సర్కార్ తీరు ఏ మాత్రం మారడం లేదు.
పాలన అంటే కక్ష సాధింపే అన్న చందంగా జగన్ హయాం కొనసాగుతోంది. తాజాగా ఆదివారం తెల్లవారు జామున తెలుగుదేశం సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడి నివాసం కూల్చి వేతకు అధికారులు యత్నించడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఆ వేళలో అంత రాత్రి వేళ కూల్చివేతల అవసరమేమిటని కోర్టు ప్రశ్నించింది. దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నిలదీశారు. అయ్యన్న పాత్రుడికి మద్దతుగా నర్సీపట్నం వెళుతున్న  తెలుగుదేశం నాయకులను హౌస్ అరెస్టులు చేయడం జగన్ పిరికి తనానికి నిదర్శనమని చంద్రబాబు విమర్శించారు. అక్రమ కూల్చివేతలే సరికాదంటుంటే.. ఆ కూల్చివేతలకు నిరసన తెలియజేడయానికి వెళుతున్న వారిని అరెస్టు చేయడమేమిటని పరిశీలకులు సైతం ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతోందని వారు అంటున్నారు. 

నిరసన తెలపడానికి విపక్ష నేతలకు హక్కే లేదన్నట్లుగాఆక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్న జగన్ సర్కార్ నేరస్తులకు మాత్రం రాచమర్యాదలు చేస్తున్నదని విమర్శిస్తున్నారు. అనంతబాబు విషయమే తీసుకుంటే.. విచారణలో తానే స్వయంగా హత్య చేశానని అంగీకరించినా.. పోలీసులు ఇంత వరకూ ఆయనను తమ కస్టడీకి తీసుకోవడానికి కోర్టును కోరలేదన్నారు. రిమాండ్ ఖైదీగా  అనంతబాబుకు జైళ్లో రాచమర్యాదలు జరుగుతున్నాయనీ గుర్తు చేశారు.  కాగా అయ్యన్న పాత్రుడి నివాసం కూల్చివేత విషయానికి వస్తే.. కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి దాటిన తరువాత అధికారులు మందీ మార్బలంతో కూల్చివేతకు బుల్ డోజర్ తో సహా వచ్చారంటే.. ఇందుకు సంబంధించిన ఆదేశాలు ఏ స్థాయి నుంచి వచ్చాయే తేలికగానే అర్ధమౌతుందని అంటున్నారు.

నర్సీపట్నం వెళుతున్న తెలుగుదేశం నాయకులను అరెస్టు చేయడాన్ని జగన్  పిరికి పంద చర్యగా అభివర్ణించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అయ్యన్న పాత్రుడి ఇంటి కూల్చివేత యత్నం జగన్ కక్ష సాధింపు చర్యే అన్న తమ వాదనే నిజమని కోర్టు తన వ్యాఖ్యలద్వారా రుజువు చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను గర్హిస్తూ గట్టిగా గళం వినిపిస్తున్న  తెలుగుదేశం బీసీ నేతలపై కేసులు, అరెస్టులు, ఇళ్లపై దాడులతో జగన్ వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. జగన్ కక్ష సాధింపు చర్యలకు వత్తాసు పలుకుతూ నిబంధనలను తుంగలో తొక్కి వ్యవహరిస్తున్న ప్రతి అధికారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.  ప్రభుత్వ ప్రాపకం కోసం నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించి ఆనక చిక్కుల్లో పడవద్దని అధికారులకు చంద్రబాబు హితవు పలికారు.

అయ్యన్న చేసింది కబ్జా కాదని....ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం 600 ఎకరాల దళితుల భూములు చెరబట్టడమే నిజమైన కబ్జా అని చంద్రబాబు అన్నారు. అయ్యన్న ఇంటిని కూల్చివేసేందుకు వందల మంది పోలీసులతో, ముగ్గురు ఐపిఎస్ లు, సమస్త రెవెన్యూ అధికారులను మోహరించడం జగన్ దిగజారుడు విధానాలకు  పరాకాష్ఠగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభివర్ణించారు.  టిడిపి సభలు విజయవంతం అవ్వడం, ప్రజలనుంచి కూడా తిరుగుబాటు మొదలవ్వడంతో తీవ్ర ఫ్రస్టేషన్ లో పడిన జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారని,  ఉత్తరాంధ్రలో నాడు సబ్బంహరి, పల్లా శ్రీనివాస్ ఇళ్లపై, ఆస్తులపై ప్రభుత్వ చర్యల ముసుగులో దాడి చేయించిన జగన్...ఇప్పుడు అయ్యన్న ఇంటిపై దాడి చేశారని అన్నారు. ఈ దాడులు, కక్ష సాధింపు చర్యలకు టిడిపి నేతలు ఎవరూ భయపడరని చంద్రబాబు అన్నారు.

By
en-us Political News

  
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు.
ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ, వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.
రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అలాంటిది పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్షమించరాని నేరమన్నారు. యువ నాయకుడు, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తే, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారంటూ పుట్టా మహేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి, మరో వైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటములు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు కూటములతో పాటు టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుపై కన్నేశారు.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టు గడపతొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో సైతతం హాట్ టాపిక్‌గా నిలిచింది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.