Publish Date:Aug 28, 2025
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి బిగ్ షాక్ తగిలింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో విజయాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ అధికార్ యాత్ర పేరుతో బీహార్ లోనే మకాం వేశారు. కీలక నాయకురాలు, ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా బీహార్ లో పర్యటిస్తున్నారు. ఓట్ చోర్ అంటూ ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం బీహార్ పర్యటనలు చేస్తున్నారు. దీంతో బీహార్ ఎన్నికలు కాంగ్రెస్ కు గేమ్ చేంజర్ గా మారనున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయ మీడియాలో మాత్రం రాహుల్ చేస్తున్న ఓటు అధికార్ యాత్రకు విస్తృత కవరేజ్ అయితే లభిస్తోంది. అంతే కాదు, విశ్లేషకులు కాంగ్రెస్ కూటమికి బీహార్ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సర్వేల ఫలితాలు సైతం అదే చెబుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలలో ఐక్యత కనిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రూపంలో రాహుల్ కు గట్టి షాక్ తగిలింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకూ ఇండియా కూటమిలోనే ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆ తరువాత బయటకు వచ్చేసింది. ఇప్పుడు బీహార్ ఎన్నికల సమయంలో మరోమారు కాంగ్రెస్ కు, రాహుల్ కు వ్యతిరేకంగా గళమెత్తింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ పై విమర్శలు గుప్పించారు. గురువారం (ఆగస్టు 28) ఆయన మీడియా సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్ ను ఒకే తాను ముక్కలు, పరిస్థితులను చూస్తుంటే ఇరు పార్టీల మధ్యా పొత్తు ఉందా అనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీల పొత్తుకు నేషనల్ హెరాల్డ్ కేసుకు ముడిపెట్టారు.
నేషనల్ హెరాల్డ్ కేసు మూతపడిందా? అన్న అనుమానం వ్యక్తం చేశారు. మద్యం కేసులో తాను అన్యాయంగా జైలుకు వెళ్లాననీ.. కానీ నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ జైలుకు వెళ్లలేదన్నారు. దీని వెనుక ఏదో మర్మం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. అంతే కాదు 2 జి, బొగ్గు కుంభకోణం వంటి స్కాంల కథ ముగిసిపోయినట్లే కనిపిస్తోందన్న అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ రాజీపడటమే ఇందుకు కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ చేస్తున్న ఆందోళన, యాత్రలూ అన్నీ వ్యక్తిగత రక్షణ కోసమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ ఇటీవలి కాలంలో బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆయన విమర్శలకు జాతీయ స్థాయిలో స్పందన లభించడమే కాకుండా, చర్చకు కూడా కారణమౌతున్నాయి. రాహుల్ విమర్శలతో ఎంత కాదనుకున్నా బీజేపీ డిఫెన్స్ లో పడిందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది. రాహుల్ దూకుడు కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కూడా కాంగ్రెస్ వెనుక ర్యాలీ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ లక్ష్యంగా చేసిన విమర్శలు, వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇవి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రభావం చూపే అవకాశం ఉందా? అన్న చర్చకు తెరలేచింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్న ఆప్.. ఇప్పుడు కాంగ్రెస్ లక్ష్యంగా, రాహుల్ టార్గెట్ గా ఎందుకు గళమెత్తుతోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/aravind-kejriwal-sensational-comments-targeting-rahul-39-205192.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.