హైదరాబాద్ లో మరింత పటిష్టమయిన నిఘా వ్యవస్థ అవసరం

Publish Date:Nov 19, 2014

Advertisement

 

అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానంద రెడ్డిపై ఈరోజు ఉదయం హత్యా ప్రయత్నం జరిగింది. కానీ అదృష్టవశాత్తు ఆయన త్రుటిలో తప్పించుకోగలిగారు. ఆయనపై కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరు? ఆయనను ఎందుకు హత్య చేయాలనుకొన్నాడు? హత్య చేయదలిస్తే చేతిలో ఏ.కె.47వంటి అత్యధునికమయిన ఆయుధం ఉంచుకొని, దూరం నుండి కాల్చే బదులు కారులో ప్రవేశించి కాల్చాలని ఎందుకు ప్రయత్నించాడు. అంటే అతను నిజంగా ప్రొఫెషనల్ కిల్లర్ కాడా? కానప్పుడు అతను ఏ.కె.47వంటి అత్యధునికమయిన ఆయుధం ఏవిధంగా సంపాదించాడు? అతను నిజంగానే నిత్యానంద రెడ్డిని హత్య చేయాలను కొన్నాడా లేకపోతే కేవలం ఆయనను భయపెట్టేందుకే ఆ విధంగా చేసాడా? పారిపోతున్నపుడు తనను పోలీసులకి పట్టివ్వగల సాక్ష్యాలుగా పనికి వచ్చే ఏ.కె.47, బ్యాగుని కారులో ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? బ్యాగులో ఏమున్నాయి? అనే అనేక ప్రశ్నలు ఎవరికయినా కలుగక మానవు. వాటన్నిటికీ పోలీసులే సమాధానాలు కనుగొనాల్సి ఉంటుంది.

 

ఇక ఈ సంఘటన హైదరాబాద్ లో ప్రజల ప్రాణాలకు ఎంత భద్రత ఉందో అద్దం పట్టేదిగా ఉంది. ఒక వ్యక్తి పట్టపగలు జనసందోహం బాగా ఉన్నప్రాంతంలో అందరి కళ్ళ ఎదుటే ఏ.కె.47వంటి అత్యధునికమయిన ఆయుధంతో హత్యాప్రయత్నం చేయడం, తప్పించుకొని పారిపోగలగడం వంటివి నిఘా వ్యవస్థ మరింత పటిష్టం కావలసిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది. ఈరోజు నిత్యానంద రెడ్డిపై జరిగిన హత్యా ప్రయత్నాన్ని ఒక మామూలు హత్య కేసుగా పరిగణించలేము. ఎందుకంటే ఆ వ్యక్తి చేతిలో ఉన్నది సైనికులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు మాత్రమే ఉపయోగించ గలిగే ఏ.కె.47వంటి అత్యధునికమయిన ఆయుధం. అదే అయుధాన్ని ఆ వ్యక్తి పార్క్ కు వచ్చిన ప్రజలపై గురిపెట్టి ఉండి ఉంటే ఎంత అనర్ధం జరిగి ఉండేదో ఎవరయినా తేలికగానే ఊహించగలరు. గన్ సంస్క్రతికి బాగా అలవాటుపడిన అమెరికా దేశంలో ఇటువంటి సంఘటనలు అప్పుడప్పుడు జరగడం చూస్తూనే ఉన్నాము.

 

అందువల్ల ఈ సంఘటనను అంత తేలికగా తీసిపారేయలేము. హైదరాబాద్ నగరాన్ని ఉగ్రవాదులు, అసాంఘీక శక్తులు కన్నెత్తి చూడలేని విధంగా అత్యాధునికమయిన పోలీసింగ్ వ్యవస్థను, నగరమంతా సిసి. కెమెరాలతో కట్టుదిట్టం చేస్తానని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకు చాలా సార్లు ప్రకటించారు. ఆ ప్రయత్నంలోనే నగర పోలీసులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధాలతో కూడిన ఇన్నోవా కార్లను కూడా కొని ఇచ్చారు. అయినా అసాంఘిక శక్తులు తరచూ నగరంలో ఎక్కడో అక్కడ తమ ప్రతాపం చూపిస్తూనే ఉన్నాయి. అయితే నగరంలో జరిగే ఇటువంటి ప్రతీ సంఘటనను నియత్రించడం ఎంతవారికయినా అసాధ్యం కనుక పోలీసులను నిందించడానికి ఏమీ లేదు.

 

కానీ ఈరోజు జరిగిన సంఘటన నగరంలో నిఘా వ్యవస్థ మరింత కట్టు దిట్టం కావలసిన అవసరం చాలా ఉందనే సంగతిని నొక్కి చెపుతోంది. అంతే కాదు ఇటువంటి సంఘటనలు కేవలం హైదరాబాద్ లో మాత్రమే జరుగుతుంటాయని మిగిలిన జిల్లాలు, రాష్ట్రాలు నిర్లిప్తత వహించకుండా ముందే ఇటువంటి వాటికి అవసరమయిన నివారణ చర్యలు చెప్పట్టడం మంచిది. ముఖ్యంగా కొత్తగా నిర్మించబోతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంలో, ఐటీ హబ్ గా తీర్చిదిద్దబోతున్న విశాఖలో ఇటువంటి సంఘటనలు జరగకుండా అత్యాదునికమయిన పరికరాలను పోలీసింగ్ వ్యవస్థను ముందు నుండే ఏర్పాటు చేసుకోవడం మంచిది.

By
en-us Political News

  
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.