ప్రయాణికుల దెబ్బ.. ఆర్టీసీ అబ్బ!.. తగ్గిన బస్‌ ఛార్జీలు..

Publish Date:Feb 14, 2022

Advertisement

ప్రజలంతా ఒక్కటై తగ్గేదే లే అంటే.. ఎవరైనా తగ్గాల్సిందే. అదీ ప్రభుత్వమైనా.. ఏ ప్రభుత్వ సంస్థ అయినా. తాజాగా ప్రజలు దెబ్బకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) బస్సు ఛార్జీలను తగ్గించింది. ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా తగ్గిపోతుండడంతో ఆర్టీసీ బస్సు సర్వీసుల ఛార్జీలను తగ్గిస్తూ సదరు సంస్థ నిర్ణయం తీసుకుంది.

సంక్రాంతి పండుగ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి దూరప్రాంతమైన హైదరాబాద్‌ వెళ్లే బస్సు సర్వీసులకు ప్రయాణికుల ఆదరణ కరువైంది. నిత్యం తిరిగే బస్సు సర్వీసులు ఖాళీగా వెళుతుండడంతో ఆర్టీసీకి భారీగా నష్టాలు వస్తున్నాయి. వీటికి తోడు ప్రైవేటు బస్సు సర్వీసులు ఆన్‌లైన్‌లో టిక్కెట్టు ధరలను పరిస్థితులను బట్టి తగ్గిస్తుండడంతో ఆ సర్వీసులకు ప్రజలు భారీగా క్యూ కడుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రైవేటు బస్సు సర్వీసుల పోటీని తట్టుకోవాలంటే.. ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గించడం మినహా మరో మార్గం లేదని ఏపీఎస్ఆర్టీసీ భావించింది. దాంతో హైదరాబాద్‌ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల ఛార్జీలను తగ్గిస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఓ నిర్ణయం తీసుకుంది.

అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, రాజోలు, రావులపాలెం తదితర డిపోల నుంచి హైదరాబాద్‌ వెళ్లే బస్సు సర్వీసుల ధరల్లో మార్పులు చేస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అమలాపురం నుంచి బీహెచ్‌ఈఎల్‌ వెళ్లే అమరావతి బస్సు సర్వీసు టికెట్ ధర గతంలో 1160 రూపాయిలు ఉండేది. కానీ ఆ టిక్కెట్టు ధరను తాజాగా 955 రూపాయిలకు తగ్గించారు. అలాగే బీహెచ్‌ఈఎల్‌ నుంచి అమలాపురం వెళ్లే అమరావతి సర్వీసు గతంలో 1205 రూపాయిలు ఉంటే.. ఆ ధరను తాజాగా 990 రూపాయిలకు తగ్గించాంరు. అదే విధంగా అమలాపురం నుంచి వయా భీమవరం మీదుగా ఎంజీబీఎస్‌ వెళ్లే నైట్‌రైడర్‌ సర్వీసు టికెట్ ధరను 740 రూపాయిలకు తగ్గించారు. ఇక అమలాపురం నుంచి బీహెచ్‌ఈఎల్‌ వెళ్లే బస్సు టిక్కెట్టు ధరను 1440 రూపాయిల నుంచి 930 రూపాయిలకి తగ్గించారు. అమలాపురం నుంచి వయా భీమవరం మీదుగా వెళ్లే నైట్‌రైడర్‌ బెర్త్‌ టిక్కెట్‌ ధర 1140 రూపాయిల నుంచి 930 రూపాయిలకు తగ్గించారు.

మరోవైపు టీఎస్‌ఆర్టీసీ కూడా బస్సు రేట్లను తగ్గించింది. గరుడ బస్సు చార్జీలను హైదరాబాద్‌, విజయవాడ మధ్య సర్వీసుకు 100 రూపాయిల మేర ధర తగ్గించారు. ప్రైవేటు బస్సు సర్వీసులు ప్రయాణికుల రద్దీని బట్టి టిక్కెట్టు ధరలను ఆకస్మికంగా తగ్గిస్తుండడంతో ఆ బస్సు సర్వీసులకు కూడా భారీగా డిమాండు పెరిగింది.

సంక్రాంతి పండుగ తర్వాత అటు ఆర్టీసీ, ఇటు ప్రైవేటు సర్వీసులకు ప్రయాణికుల రద్దీ భారీగా తగ్గిపోతోంది. దీంతో ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకోంటున్నారు. ముఖ్యంగా కొవిడ్‌ కారణంగా గత రెండేళ్ల నుంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోంకు పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని రోడ్డు రవాణా సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఛార్జీలు పెంచితే.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందనే ఆందోళనలో ప్రభుత్వాలు అయితే ఉన్నాయి. రానున్నది ఎన్నికల సీజన్. ఛార్జీలు పెంచితే.. ప్రజల నుంచి దెబ్బతప్పదు. ఈ నేపథ్యంలో ఏం చేయాలి.. ఆర్టీసీని లాభాల బాటలోకి ఎలా తీసుకురావాలని.. ఆ క్రమంలో  ప్రయాణికులను ఎలా ఆకట్టుకోవాలనే అనే ప్రయత్నంలో తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నధికారులు .. తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.
 

By
en-us Political News

  
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.