రాజకీయ పార్టీల కనుసన్నలలో ఏపీయన్జీవోల ఎన్నికలు

Publish Date:Dec 23, 2013

Advertisement

 

ఉద్యోగ సంఘాలకు ఎన్నికలు జరగడం కొత్త విషయమేమీ కాకపోయినా, త్వరలో జరగనున్నసార్వత్రిక ఎన్నికలలో అన్నిరాజకీయ పార్టీలకు ఉద్యోగ సంఘాల మద్దతు చాలా అవసరం కనుక, వచ్చేనెల 5న జరగనున్న ఏపీఎన్జీవో సంఘం ఎన్నికలకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే నిన్ననామినేషన్లు వేసిన అశోక్ బాబు, బషీర్ ఇద్దరూ కూడా తమ వెనుక ఏ రాజకీయ పార్టీలు లేవని చెప్పుకోవడమే, వాటి ప్రమేయం ఉందని అంగీకరించినట్లయింది.

 

అశోక్ బాబు నేతృత్వంలో దాదాపు ఐదారు లక్షలమంది ఉద్యోగులు ఏకత్రాటిపై రెండున్నర నెలలకుపైగా సమైక్యాంధ్ర కోసం ఉద్యమించి, హైదరాబాద్ లో విజయవంతంగా “సేవ్ ఆంధ్రప్రదేశ్” సభను నిర్వహించడం, ఆ తరువాత అకస్మాత్తుగా ఉద్యమం విరమించడం, టీ-బిల్లు శాసనసభకి వచ్చినప్పటికీ ముందు ప్రకటించినట్లు సమ్మె మొదలుపెట్టకపోవడం, ఒకవైపు రాష్ట్ర విభజన ప్రక్రియ చకచకా జరిగితున్నతరుణంలో ముఖ్యమంత్రి, ఆయనతో బాటే అశోక్ బాబు కూడా పూర్తిగా చల్లబడిపోవడం గమనిస్తే అశోక్ బాబు కార్యాచరణ వెనుక ముఖ్యమంత్రి ప్రమేయం ఉందనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది.అయితే, ఇంతకాలం అన్ని రాజకీయపార్టీలను దూరంపెడుతూ వచ్చిన అశోక్ బాబు, సరిగ్గా ఉద్యోగ సంఘాల ఎన్నికలకు నామినేషన్లు వేసే మూడు రోజుల ముందు అఖిలపక్షం నిర్వహించడంతో ఆయన వారిని సమైక్య ఉద్యమం కోసం మద్దతు కోరుతున్నారా లేక ఎన్నికలలో తను గెలిచేందుకే మద్దతు కోరుతున్నారా? అనే అనుమానం కలగడం సహజం.

 

కిరణ్ కుమార్ రెడ్డి తరపున ఈ సమావేశంలో పాల్గొన్న శైలజానాథ్ తదితరులు, తెదేపా తరపున పయ్యావుల కేశవ్ తదితరులు ఆయన (పోరాటాని)కి మద్దతు పలకడం, అదే సమయంలో సమైక్యాంధ్ర కోసమే పోరాడుతున్నాని చెప్పుకొనే వైకాపా ఏవో కుంటిసాకులు చెప్పి ఈ సమావేశానికి హాజరు కాకపోవడం గమనిస్తే, ఏ పార్టీలు ఎవరిని సమర్దిస్తున్నాయో ఎవరిని వ్యతిరేఖిస్తున్నాయో స్పష్టమవుతుంది. కానీ, అదేసమయంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నసీపీయం మరియు లోక్ సత్తా పార్టీలు తాము ఎవరికీ మద్దతు ఈయమని స్పష్టం చేయడం చూస్తే ఈ సమావేశం అంతర్యం కూడా స్పష్టమవుతోంది.

 

ఇక అశోక్ బాబుకి ప్యానల్ కి వ్యతిరేఖంగా నామినేషన్లు దాఖలుచేసిన బషీర్ మీడియాతో మాట్లాడుతూ అశోక్ బాబు సమైక్యాంధ్ర ఉద్యమాన్నినడిపించడంలో ఘోరంగా విఫలమయ్యారని, తమ ప్యానల్ గెలిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పడం చూస్తే ఆయన మాటలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ కి సరిపోలుతున్నట్లు స్పష్టం అవుతోంది గనుక ఆయన ప్యానల్ కి వైకాపా మద్దతు ఉందని స్పష్టం అవుతోంది.

 

వచ్చే ఎన్నికలలో లక్షలాది ఏపీఎన్జీవోల, వారి కుటుంబాల ఓట్లు రాల్చుకోవాలంటే, ఈ ఎన్నికలలో తమకు అనుకూలమయిన ప్యానల్ ని గెలిపించుకోవడం అన్ని రాజకీయ పార్టీలకు అత్యవసరం. అందువల్ల రాజకీయాలకు అతీతంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయని అశోక్ బాబు, బషీర్ చెపుతున్న మాటలు అవాస్తవమే.

 

అశోక్ బాబు ప్యానల్ కు కిరణ్ కాంగ్రెస్, సీమాంధ్ర తెదేపాల మద్దతు ఇస్తుంటే, బషీర్ ప్యానల్ కి వైకాపా మద్దతు ఇస్తున్నట్లు అర్ధం అవుతోంది. ఒకవేళ అశోక్ బాబు ప్యానల్ గెలిస్తే కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయే కొత్త (కాంగ్రెస్) పార్టీకి, తేదేపాకు, అదే బషీర్ ప్యానల్ గనుక గెలిస్తే వైకాపాకు మద్దతు ఇచ్చేఅవకాశం ఉంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.