ఏపీ మద్యం టెండర్ల కేసు.. పీటీ వారెంట్‌ను తిరస్కరించిన కోర్టు.!

Publish Date:Aug 20, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా టెండర్ల అవకతవకల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఏసీబీ కోర్టులో  చుక్కెదురైంది. ఈ  కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డిలపై సిట్ అధికారులు దాఖలు చేసిన  పీటీ వారెంట్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు  తిరస్కరించి వెనక్కి పంపింది. మద్యం రవాణా టెండర్లలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో సిట్ అధికారులు దర్యాప్తువేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డిలతో పాటు కారుమూరి సునీల్‌ను కూడా సిట్ అధికారులు నిందితులుగా చేర్చారు.

అయితే..  అంతకంటే ముందు ఇదే వ్యవహారానికి సంబంధించిన నగదు అక్రమ చలామణి ఆరోపణలపై  ఈడీ అధికారులు వీరిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. జైలులో ఉన్న నిందితులను విచారణ నిమిత్తం తమ అధీనంలోకి తీసుకునేందుకు గతంలో సిట్ అధికారులు పీటీ వారెంట్ ద్వారా విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

అయితే..  సిట్   రిమాండ్   చెల్లదంటూ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డిలు     హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, నిందితులకు అనుకూలంగా తీర్పునిస్తూ వారి రిమాండ్‌ను రద్దు చేసింది. అయినప్పటికీ..  కేసు విచారణలో భాగంగా  రెండు రోజుల కిందట సిట్ అధికారులు మళ్లీ ను విజయవాడ ఏసీబీ కోర్టులో  పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. దాఖలైన కొత్త పీటీ వారెంట్‌లోని చట్టపరమైన అంశాలను, గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమగ్రంగా పరిశీలించిన ఏసీబీ కోర్టు న్యాయస్థానం, ఈ వారెంట్‌ను తోసిపుచ్చుతూ వెనక్కు పంపింది. 

మరోవైపు, ఇదే మద్యం టెండర్ల  కేసులో  నిందితులుగా ఉన్న కె. ధనుంజయ రెడ్డి, పి. కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు బుధవారం (ఆగస్టు 19)   విజయవాడ ఏసీబీ కోర్టు ఎదుట   హాజరయ్యారు. వారి హాజరును పరిశీలించిన జ్యుడీషియల్ అధికారి ఎల్. తేజోవతి  దర్యాప్తు సంస్థల నుంచి అధికారికంగా సమన్లు అందిన తర్వాతే కోర్టు విచారణకు హాజరు కావాలని, అప్పటివరకు వేచి చూడాలని వారికి ఆదేశాలు జారీ చేశారు.  

ap liquor case, sit pt warrant, acb court vijayawada, kasireddy rajasekhar reddy, donthireddy vasudeva reddy, liquor tender scam ap 

By
en-us Political News

  
లండన్ తో పాటు అమెరికాలోని ప్రముఖ నగరాలైన బోస్టన్, న్యూయార్క్ ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇందుకు సంబంధించిన  షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు 11 21, 21 15, 17 21తో వాంగ్ జి యి చేతిలో ఓడిపోగా, సాత్విక్ చిరాగ్ మరియు ట్రీసా గాయత్రి జోడీలు సంచలన విజయాలతో క్వార్టర్స్‌లోకి ప్రవేశించాయి. తదుపరి మ్యాచ్ వివరాలు ఇవే
ఏఎఫ్సీ విమెన్స్‌‌ చాంపియన్స్ లీగ్‌లో ఈస్ట్‌‌ బెంగాల్‌‌ ఎఫ్‌‌సీ 12 0 తేడాతో రోవర్స్‌‌ ఎఫ్‌‌సీపై చారిత్రాత్మక విజయం సాధించింది. 40 ఏళ్ల రికార్డును బ్రేక్ చేస్తూ ఆసియా పోటీల్లో ఇండియన్ క్లబ్ సాధించిన అతిపెద్ద విజయం ఇదే!
మేటా స్మార్ట్ గ్లాసెస్‌పై UK సినిమా థియేటర్లలో నిషేధం విధించే ఆలోచన మొదలైంది. ప్రైవసీ ఆందోళనలతో పాటు రహస్యంగా సినిమాలు రికార్డు చేసి పైరసీ చేసే ప్రమాదం ఉండటంతో ఈ సంచలన నిర్ణయం వైపు అడుగులు పడుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆ వివాదాల పరిష్కారం దిశగా ముందుకు సాగేందుకు సదరన్ జోనల్ కౌన్సల్ దోహదం చేసిందన్న ఆశను రేకెత్తించింది. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ( తెలంగాణ సీఎం మినహా) ఒకే వేదికపై కనిపిండమే కాకుండా ఆత్మీయంగా ముచ్చటించుకుంటున్న దృశ్యం కన్నుల పండువగా ఉంది. 
ది బిగ్ బ్యాంగ్ థియరీ పాపులర్ స్పిన్ ఆఫ్ సిరీస్ స్టువర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్ సీజన్ 2 పై క్రియేటర్స్ చక్ లోరే, జాక్ పెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షో భవిష్యత్తు ప్రణాళికలు మరియు HBO Max నిర్ణయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రపంచ దిగ్గజ సంస్థలైన సిస్కో, శామ్‌సంగ్, AWS లను వణికించిన భారీ సప్లై చైన్ సైబర్ దాడి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. LiteLLM టూల్ ద్వారా 2,500 కి పైగా కంపెనీల రహస్య క్లౌడ్ డేటా, కీలు ఎలా లీక్ అయ్యాయో చూడండి.
ప్రముఖ టెక్ దిగ్గజం ఏసర్ ఇప్పుడు హౌస్ ఆఫ్ ఏసర్గా అవతరిస్తోంది. ల్యాప్‌టాప్‌లకే పరిమితం కాకుండా అక్షయ్ కుమార్‌ను అంబాసిడర్‌గా పెట్టి గృహోపకరణాలు, లగేజ్, టీవీలు, స్మార్ట్ రింగ్స్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!
గాజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ గాజా క్యాపిటల్ ఐపీఓ చివరి రోజు నాటికి 2.52 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. జీఎమ్‌పి, లిస్టింగ్ గెయిన్స్, లాట్ సైజు మరియు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల రేటింగ్స్ పూర్తి సమాచారం తెలుసుకోండి.
రంగారెడ్డి జిల్లా ఎమ్మార్వో దేశం శ్రీనివాస్ రెడ్డి నివాసాలపై ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ. 100 కోట్ల అక్రమాస్తులు వెలుగుచూశాయి. కేజీకి పైగా బంగారం, స్థలాలు, భవనాలు మరియు బార్‌లో పెట్టుబడులకు సంబంధించిన విస్తుపోయే నిజాలు ఈ కథనంలో చదవండి.
భారతదేశంలో ఇంటర్నెట్ సౌకర్యం లేని సుదూర గ్రామీణ ప్రాంతాలకు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ అందిస్తామని ఎలన్ మస్క్ హామీ ఇచ్చారు. 11 వేలకు పైగా గ్రామాల్లో 4G నెట్‌వర్క్ లేని పరిస్థితుల్లో, స్పేస్‌ఎక్స్ తీసుకుంటున్న ఈ నిర్ణయం మరియు భారతీయ నిబంధనల సవాళ్లపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలపై అప్లైడ్ ఏఐ స్టూడియో ఫౌండర్ బాల పన్నీర్ సెల్వం చేసిన లింక్డ్‌ఇన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 17 కిలోమీటర్లకు 2 గంటల సమయం పడుతోందని, ఉద్యోగుల ప్రయాణ నరకంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.