ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి తన స్వంత ఎజెండా కారణంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారిపోతోందని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. షర్మిల ఒంటెత్తు పోకడలతో సీనియర్లకు వీసమెత్తు విలువ ఇవ్వకుండా జగన్ వ్యతిరేకతే పార్టీ సిద్ధాంతం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కాకుండా ఒక స్వతంత్ర వ్యక్తిగా తన ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని పార్టీ సీనియర్లు సైతం అంటున్నారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు తిలోదకాలిచ్చి జగన్ ను విమర్శిస్తూ.. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా అదే తన బాధ్యత అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, దీని వల్ల పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేదని సీనియర్లు అంటున్నారు.
అంతే కాకుండా షర్మిల తీరు పార్టీ సినియర్లను పార్టీ కార్యక్రమాలకు దూరం చేస్తున్నదనీ, ఇసుమంతైనా ఖాతరు చేయకుండా ఆమె తమను అవమానిస్తున్నారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాలం చెల్లిన కబుర్లు అంటూ సీనియర్ల సలహాలను ఆమె తీసి పారేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి రావడానికి ప్రధాన కారకుడైన కేవీపీ ఆమె ఆ పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్తలో ప్రతి సమావేశంలోనూ ఆమె వెన్నంటి ఉండి మార్గదర్శనం చేసేవారనీ, అయితే ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడం లేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
షర్మిల వైఖరికి విసిగి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారంటున్నారు. జగన్ ఐదేళ్ల పాలనపై ప్రజలు తీర్పు ఇచ్చేశారనీ, ఆయన పార్టీని దారుణంగా ఓడించి జగన్ పట్ల తమ అభిప్రాయమేమిటో చెప్పేశారనీ, అయినా ఇప్పటికీ షర్మిల జగన్ పై విమర్శలకే పార్టీని, పార్టీ కార్యక్రమాలను పరిమితం చేయడం విడ్డూరంగా ఉందనీ అంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో ఉనికి మాత్రంగానే మిగిలిన కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి క్షేత్ర స్థాయి నుంచీ పని చేయాల్సి ఉంటుందనీ, అయితే షర్మిల తీరు అందుకు పూర్తి భిన్నంగా ఉందన్న విమర్శలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఆమె పీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన కొత్తలో కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపించిన జోష్ ఇప్పుడు లేశమాత్రమైనా కనిపించకపోవడానికి ఆమె వ్యవహారశైలే కారణమంటున్నారు. ఇప్పటికైనా షర్మిత తన తీరు మార్చుకుని అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని కాంగ్రెస్ సీనియర్లు సూచిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-congress-chief-sharmila-unilateral-attitude-39-186495.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.