తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ మనవడు దగ్గుబాటి హితేష్.!

Publish Date:Jul 9, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనానికి తెరలేవబోతోంది. నందమూరి, దగ్గుబాటి కుటుంబాల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న యువనేత దగ్గుబాటి హితేష్ త్వరలోనే పసుపు కండువా కప్పుకో వడానికి సిద్ధమవుతున్నట్లు   విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. దశాబ్దాలుగా నందమూరి, దగ్గుబాటి కుటుంబాల మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యాలు, అలాగే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ఉన్న  విభేదాలన్నీ ఇప్పుడు పూర్తిగా సమసిపోయాయని, అందువల్లే హితేష్ రాజకీయ ఎంట్రీకి సర్వం సిద్ధమైందని అంటున్నారు. 

గత కొన్ని సంవత్సరాలుగా ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న అంతరాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ముఖ్యంగా కుటుంబంలో జరిగిన కొన్ని శుభకార్యాలు, ప్రత్యేక కలయికల తర్వాత విభేదాలన్నీ పక్కన పెట్టి..  అందరూ కలిసిపోయారు.  ఈ క్రమంలోనే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే ఆలోచనలో ఉన్న చంద్రబాబు నాయుడు, హితేష్ చెంచురాంను పార్టీలోకి ఆహ్వానిం చడంపై సానుకూలంగా  స్పందించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం హితేష్ తల్లి దగ్గుబాటి పురందేశ్వరి భారతీయ జనతా పార్టీ లో కీలక నేతగా, ఎంపీగా కొనసాగుతుండగా, తండ్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏ రాజకీయ పార్టీలోనూ యాక్టివ్‌గా లేరు. ఈ నేపథ్యంలో హితేష్‌ను నేరుగా తెలుగుదేశం పార్టీ ద్వారా యాక్టివ్ పాలిటిక్స్‌లోకి తీసుకురావాలని కుటుంబ సభ్యులు  నిర్ణయించుకున్నట్లు సమాచారం.

దగ్గుబాటి హితేష్ చెంచురాం రాజకీయ రంగ ప్రవేశం కోసం గతంలోనే ప్రయత్నాలు జరిగాయి. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆయన ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే.. ఆ సమయంలో సాంకేతిక కారణాల వల్ల, ముఖ్యంగా ఆయనకు సంబంధించిన సిటిజన్‌షిప్,  కొన్ని డాక్యుమెంటేషన్ ప్రక్రియలు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం చేజారిపోయింది.

ఆ తర్వాత జరిగిన 2024 ఎన్నికల్లో కూడా ఆయన పోటీకి దూరంగానే ఉన్నారు.ఇప్పుడు  ఆ సాంకేతిక అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోవడంతో, హితేష్ చెంచరాం..  పర్చూరు లేదా బాపట్ల జిల్లా పరిధిలోని ఏదైనా కీలక నియోజకవర్గం నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

 దశాబ్దాల కాలంగా ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించిన దగ్గుబాటి కుటుంబం మళ్లీ టిడిపి గూటికి చేరితే, ఆ ప్రాంతంలో పార్టీ క్యాడర్‌కు కొత్త ఉత్సాహం రావడం ఖాయమంటున్నారు. చంద్రబాబు నాయుడు కూడా హితేష్‌కు ఒక స్పష్టమైన భవిష్యత్తు హామీని ఇచ్చి, పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుగుదేశం వర్గాల ద్వారా తెలుస్తోంది.  ఎన్టీఆర్ మనవడిగా, ఉన్నత విద్యావంతుడిగా, స్పష్టమైన విజన్ ఉన్న యువకుడిగా హితేష్ చెంచురాం తెలుగుదేశం పార్టీకి కొత్త మైలేజ్ తీసుకువస్తారని   భావిస్తున్నారు. హితేష్ తెలుగుదశంలో చేరిక విషయంలో అధికారిక ప్రకటనే తరువాయి అంటున్నారు.  

daggubati hitesh tdp, ntr grandson hitesh, daggubati purandeswari son, chandrababu naidu, ap politics

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.