పొలానికి వెళ్లే రైతుకి కూతురు ముద్దిచ్చి పంపింది. హెడ్మాస్టర్కి ఆయన మనవడు ముద్దిచ్చే బడికి పంపేడు. మరణానికి మరింత దగ్గర్లో వున్న తండ్రికి రమ్ ఇచ్చి ఆనందపరిచింది పెన్నెలోప్ ఆన్! చిన్న ప్పటి నుంచి బిస్కెట్లూ, చాక్లెట్లు ఇచ్చి బడికి పంపిన తండ్రి పెదాల మీద చివరి చిర్నవ్వు కోసం ఆన్ తనకు బొత్తిగా ఇష్టంలేని రమ్ ఇవ్వక తప్పలేదు.
కొన్ని అంతే.. ఇష్టంగా అయిష్టమైన పని చేయవలసి వస్తుంది. ఆన్ తండ్రి చక్కగా రోజూ తాగేవాడు. ఆయ నకు బండ్బెర్గ్ రమ్ అంటే మహా పిచ్చి. ఆన్ కి తండ్రి తాగడం పెద్దగా నచ్చేది కాదు. ఆయనకు శ్వాస సంబంధ ఇబ్బందిని ఇంట్లో వారు గమనించి ఆస్పత్రికి తీసికెళ్లారు. పెన్నెలోప్ తండ్రికి క్రానిక్ అబ్స్ట్ర క్టివ్ పల్మనరీ డిసీజ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది, ఈ పరిస్థితి శ్వాసను ప్రభా వితం చేస్తుంది. చాలాకాలం నుంచి ఈ జబ్బుతో ఆయన బాధపడుతున్నారు. చాలారోజులు ఆస్పత్రిలోనే వుండాల్సి వచ్చింది. జబ్బు ముదిరి ప్రాణాపాయ స్థితికి వచ్చింది. ఆన్ తండ్రిని కోల్పోయే సమయం ఆసన్నమైంది. డాక్టర్లు ఆ సంగతి ఆమెకు చెప్పక తప్పలేదు. ఆమె బాధపడింది ..లోలోపల. తండ్రితో వున్న అనుబంధంతో ఆయన పడక దగ్గర ఏడవలేదు. చుట్టూ అంతా ఆనందంగా ప్రశాంతంగానే వుండాలనుకుంది. నిత్యం జోక్స్ వేస్తూ సరదా వాతావరణాన్నే కల్పించింది.
చివర్రోజు.. ఆన్ ఆస్పత్రిలో తండ్రి దగ్గరకి మందులు తీసికెళ్లింది. ఆయన నవ్వాడు. దగ్గరికి పిలిచి అబ్బే ఇవి కాదు నాకు బాగా ఇష్టమైన నా మందు కావాలని కోరాడు. ఆన్కి ఈసారి కోపం రాలేదు, విసుక్కోలేదు.. గట్టిగా నవ్వింది. పరుగున వెళ్లి ఆయన అమితంగా ఇష్టపడి తాగే బండ్బర్గ్ రమ్ చిన్న బాటిల్ తెచ్చింది. దాన్ని డాక్టర్ల అనుమతితో సిరంజ్ ద్వారా ఎక్కించింది. ఆయనకు ఎంత సరదానో.. రోజూ తిట్టే కూతురు స్వయంగా తనకు ఆ మత్తెక్కించేందుకు డాక్టర్కి సాయపడుతోందని.
కొద్ది గంటల తర్వాత ఆన్ తండ్రి ప్రశాంతంగా వెళిపోయారు. ఆన్ మాత్రం ఆకాశంలోకి చూస్తూ ఈ లోకం లో నాతో చివరి క్షణాలు ఆనందంగా గడపడానికి ఆయన చివరి కోరిక తీర్చడంలో వుండే ఆనందం ఆమె మనసు నిండా నిండిపోయింది. ఆమెకు జీవితాంతం ఇది గొప్ప జ్ఞాపకంగా వుంటుంది ఇక!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ann-let-her-father-his-last-cheer-39-139045.html
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.