నేరాల అదుపునకు డ్రోన్ టెక్నాలజీ.. ఏపీలో సమర్ధంగా వినియోగం

Publish Date:Mar 27, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో నేరాల అదుపునకు, నియంత్రణకు అత్యాధునిక టెక్నాలజీని సమర్ధంగా వినియోగిస్తున్నది  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు డ్రోన్ టెక్నాలజీని వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ లో నేరాలను అదుపు చేయడమే కాక, నియంత్రించవచ్చని పదే పదే చెబుతూ వస్తున్నారు. దీంతో పోలీసు శాఖ ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ నేరాలను అదుపు చేస్తున్నది.

గంజాయి సాగును గుర్తించడంలో ఇప్పటికే డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఇప్పుడు.. పేకాటరాయుళ్లను అదుపు చేయడానికి కూడా డ్రోన్లను ఉపయోగిస్తోంది. అత్యంత రహస్యంగా చతుర్ముఖ పారాయణంలో మునిగిపోయిన పేకాటరాయుళ్లను డ్రోన్ సహాయంతో గుర్తించి పోలీసులు అదుపులోనికి తీసుకున్న సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నది. ఈ  వీడియోను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం (మార్చి 27) సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వెంటనే ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది.

లక్షలాది మంది వీక్షించారు. పోలీసు శాఖ డ్రోన్ లను నేరాల అదుపులో వినియోగించుకుంటున్న తీరును ప్రశంసలలో ముంచెత్తుతున్నారు. ఇంతకీ ఆ వీడియో ప్రకారం విజయనగరంలోని ఓ మారుమూల ప్రాంతంలోవాహనాల గ్యారేజీని వేదికగా చేసుకుని ఓ లారీలో కూర్చుని పేకాట ఆడుతున్న వారిని డ్రోన్ సహాయంతో గుర్తించిన పోలీసులు అతి తేలికగా వారున్న ప్రదేశానికి చేరుకుని లారీ ఎక్కి మరీ పేకాట రాయుళ్లను అదుపులోనికి తీసుకున్నారు.  సాంకేతికతను అందిపుచ్చుకుని నేరాల అదుపు చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందనడానికి ఇదే తార్కాణంగా నెటిజనులు అంటున్నారు. 

By
en-us Political News

  
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడింది నిజమే అని పెద్ద ప్యాకేజీ దొరికితే మా పార్టీ నేతలు కూడా బీఆర్ఎస్‌లో కలిసిపోతారని షాకింగ్ కామెంట్స్ అన్నారు.
మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్ధనరెడ్డి ఎఫెక్ట్ న్యాయవ్యవస్థపై తీవ్ర స్థాయిలో రిఫ్లెక్ట్ అవుతోంది. ఒకే కేసుకు సంబంధించి ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకున్నారు. తెలంగాణ హైకోర్టు చరిత్రలో అలా జరగడం ఇదే మొదటిసారి. దాంతో గాలి అండ్‌ కో బ్యాచ్‌ కేసుల విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.
బీఆర్ఎస్ అధినేత కుటుంబంలో అంతర్గత విభేదాల రచ్చకెక్కాయి. ఆ పార్టీ ఆవిర్భావం తరువాత ఎన్నడూ లేని విధంగా సంక్షోభంలో కూరుకుపోయింది. 2023 ఎన్నికలలో పరాజయం తరువాత కూడా పార్టీ ఇంతటి సంక్షాభాన్ని ఎదుర్కొనలేదు. ఇంత వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగమయ్యాయి. కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకే సారి గుప్పిట తెరిచేశారు. తన ధిక్కారం, తిరుగుబాటు సోదరుడు కేటీఆర్ పైనే అని కుండబద్దలు కొట్టేశారు.
ప్రభుత్వ భూములను రక్షిస్తాం, చెరువులు, నాలాలు పరిరక్షిస్తాం, హైదరాబాద్ నగరాన్ని వరదల నుండి కాపాడుతాం.. హైడ్రా ఏర్పాటు లక్ష్యం ఇదే అన్నట్లు ప్రభుత్వ పెద్దలు గొప్పగా సెలవిచ్చారు. అయితే ఆ దిశగా మొదట్లో కొంత వేగంగా వెళ్లిన హైడ్రా ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎఫ్టీఎల్ , బఫర్ జోన్లలో ఆక్రమణలు ఉంటే తప్పనిసరిగా తొలగిస్తామని చెప్పిన హైడ్రా ఆ తర్వాత మానవతా దృక్పథం అంటూ తన వైఖరి మార్చుకుంది.
మద్యం కుంభకోణం కేసులో కింగ్ పిన్ గా భావిస్తున్న కీలక నిందితుడు రాజ్ కేశిరెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు.
కడప వేదికగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు గురువారం ( మే 29) తో ముగియనుంది. మంగళవారం (మే 27)న ప్రారంభమైన మహానాడు తొలి రెండు రోజులు అత్యంత విజయవంతంగా జరిగాయి. జగన్ పార్టీకి పెట్టని కోటగా చెప్పుకునే కడప వేదికగా జరిగిన ఈ మహానాడు పలు ప్రత్యేకతలక వేదికైంది.
తెలుగుదేశంపార్టీ మహిళ నాయకురాలు చిప్పగిరి మీనాక్షి ఆత్మహత్య చేసుకుంటానంటూ కడప ఎన్టీఆర్ సర్కిల్ లోని సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశారు. దీంతో దాదాపు రెండు గంటల పాటు ఆ ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ప్రభుత్వంలో తాను నిర్వహిస్తున్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డోజ్) ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
స‌ర్క‌మ్ స్టెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్.. అంటూ ఒక‌టుంటుంది. దీని అర్ధ‌మేంటంటే వారి వారి మాన‌సిక- శారీర‌క- సామాజిక- రాజ‌కీయ- ఆర్ధిక‌- స్థితిగ‌తుల‌ను అనుస‌రించి వారెలా బిహేవ్ చేస్తారో.. ఒక అంచ‌నాకు రావ‌డం.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటంతో భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతున్నారు.
కరోనాతో పంజాబ్‌ చండీగఢ్‌లో ఓ వ్యక్తి మృతి చెందాడు. చండీగఢ్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలోని సెక్టార్‌-32లో బుధవారం 40 సంవత్సరాల వ్యక్తి కొవిడ్‌ బారినపడి చనిపోయాడని ఓ అధికారి పేర్కొన్నారు.
అస్సాం ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. మైనార్టీలు ఎక్కువ ప్రాంతాలో స్థానికులకు ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయంచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.