Publish Date:May 29, 2025
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ప్రభుత్వంలో తాను నిర్వహిస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆయన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ప్రకటించారు. అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించే కాలపరిమితి ముగిసిందని, అందుకే ఆ పదవికి రాజీనామా చేస్తున్నాననీ మస్క్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వంలో అనవసరపు ఖర్చులను తగ్గించే కార్యక్రమంలో తనకు అవకాశం కల్పించిన ట్రంప్ కు కృతజ్ణతలు చెబుతూనే.. తన రాజీనామా తరువాత కూడా డోజ్ మరింత పటిష్టంగా పనిచేసి లక్ష్యాలను చేరుకోవాలని మస్క్ ఆకాంక్షించారు.
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండో సారి అధికార పగ్గాలు అందుకున్న తరువాత ఆయన ప్రభుత్వ విభాగాల్లో వృథా ఖర్చులను అరికట్టడం అనే లక్ష్యంతో డోజ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ డోజ్ కు ఎన్నికల ప్రచారంలో తనకు అన్ని విధాలుగా సహకరించిన ఎలాన్ మస్క్ ను చైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా పదవికి ఎలాన్ మస్క్ రాజీనామా చేయడం డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/elon-mush-resign-as-doze-chairman-39-198891.html
తెలంగాణ వ్యాప్తంగా అన్నిరకాల ఆర్టీసీ బస్ పాస్ ధరలను 20% పెంచుతూ టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
వరుస దెబ్బలు తగులుతున్నా వైసీపీకిగానీ దాని మీడియాకి గానీ బుద్ది వచ్చినట్టు కనిపించడం లేదా? అంటే అవుననే చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి సున్నితాంశాల పట్ల ఉండాల్సిన నిబద్ధత మరచి మరీ జగన్ అనుంగు మీడియా వ్యవహరించడం చేటు తెస్తుందా? అంటే అదే నిజమని తెలుస్తోంది.
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఖండించారు. ఏపీ రాజధాని అమరావతి మహిళల పై వైసీపీ అధినేత జగన్ సొంత మీడియాలో ప్రసారమైన వ్యాఖ్యలపై రాయపాటి శైలజ తీవ్రస్థాయిలో స్పందించారు.
అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో మారు ఢిల్లీ వెళ్ళారు.ఇంతవరకు ముఖ్యమంత్రి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా.. ఎప్పుడు అధిష్టానం పెద్దలను కలిసినా మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించినట్లు చెప్పుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యల పట్ల జగన్, భారతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విజయవాడ సాక్షి వద్ద అమరావతి మహిళలు ఆందోళనకు దిగారు.
మోహన్ బాబు బేసిగ్గా చిత్తూరు వాసి. ఆయన శ్రీ విద్యానికేతన్ సైతం ఈ ప్రాంతంలోనే ఉంది. ఈ ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానాలతో పాటు వాటి ఉప ఆలయాలు వెరసీ.. ఈ ప్రాంతంలో బ్రాహ్మణ ఆధిపత్యం కానీ ఈ సామాజిక వర్గం పట్ల గౌరవాభిమానాలు గానీ ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఒకింత ఎక్కువగానే ఉంటాయ్. తిరుమలలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం ఇంతటి ప్రపంచ ప్రఖ్యాతమైందంటే అందుకు కారణం ఈ బ్రాహ్మణుల నిష్టాగరిష్టతలే కారణం అన్న భావనతో ఒకింత గౌరవం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, చివరాఖరుకు జరగనే జరిగింది. ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. మారో మూడు ఖాళీలు ఆశావహుల కోసం రిజర్వులో ఉంచారు. అయినా.. మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారు సహజంగానే భగ్గుమన్నారు. రాజీనామా చేస్తామంటూ బెదిరింపులకు దిగారు.
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు సోమవారం (జూన్ 9) ఉదయం అరెస్టు చేశారు.
మైనార్టీల నుంచి మంత్రి లేకనే పోయె. ఇప్పటి వరకూ మంత్రివర్గంలో పాటించిన సామాజిక న్యాయమేపాటి? అని చూస్తే.. రెడ్లు- 4, బీసీలు-3, ఎస్సీ మాల-3, ఎస్సీ మాదిగ-2, ఎస్టీ కోయ-1, ఎస్టీ లంబాడ-1, బ్రాహ్మణ-1, కమ్మ- 1, వెలమ-1 గా ఉంది. ఇదీ కాంగ్రెస్ మార్క్.. సామాజిక న్యాయం కథ, కమామిషు.
తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న మాజీ ఐపీఎస్ ప్రభాకరరావు ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నారు.
రాజకీయం, మీడియా ముసుగులో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, వారి వ్యక్తిత్వంపై దెబ్బ తీసే వారిని ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (జూన్ 9) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ ఎన్ డీ షెడ్ల వరకూ సాగింది.