Publish Date:Oct 17, 2019
మేఘా ఇంజనీరింగ్ కంపెనీపై పెద్దఎత్తున ఐటీ దాడులు జరగడం కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు అకస్మాత్తుగా వచ్చి నాలుగైదు రోజులపాటు మేఘా కార్యాలయాల్లోనూ, మేఘా ఫ్యామిలీ నివాసాల్లోనూ రోజుల తరబడి సోదాలు చేయడం సాదాసీదా విషయం కాదంటున్నారు. పైగా ఐటీ దాడుల సమయంలో కేంద్ర బలగాలను వినియోగించడం చూస్తుంటే మేఘా చుట్టూ ఉచ్చు బిగుస్తుందనే చెప్పాలంటున్నారు. మేఘాలో ఐటీ దాడులు సాధారణంగా కనిపించడం లేదని, కనీసం హైదరాబాద్ లోని ఐటీ అధికారులకు సమాచారం ఇవ్వకుండా... ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు వచ్చి తనిఖీలు చేయడమంటే ఎఫెక్ట్ భారీగా ఉండొచ్చని కార్పొరేట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఐటీ దాడుల్లో దొరికిన పత్రాలు, ఆధారాలపై అనేక రకాల వదంతులు బయటికొచ్చినా అధికారుల నుంచి మాత్రం అధికారిక సమాచారం రాలేదు.
అయితే, మేఘా కృష్ణారెడ్డికి... తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయనే ప్రచారం ఉంది. అందుకే, తెలుగు రాష్ట్రాల్లో మేఘా కంపెనీ చేపడుతోన్న ప్రాజెక్టులపైనా ఆ ప్రభావం ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా రివర్స్ టెండరింగ్ లో సింగిల్ బిడ్డర్ గా నిలిచి మేఘా కంపెనీ పోలవరం కాంట్రాక్టును దక్కించుకోవడంతో... ఆ ప్రాజెక్టు భవిష్యత్ ఏంటనే చర్చ జరుగుతోంది. మేఘా కంపెనీపై కేవలం ఐటీ దాడులతోనే ఆగదని, ఈడీ కూడా దృష్టిపెట్టే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈడీ కూడా మేఘాపై దృష్టిపెడితే పోలవరం ప్రాజెక్టు పనులు చిక్కుల్లోనే పడినట్లేనన్న టాక్ వినిపిస్తుంది. జగన్ ప్రభుత్వం... నవంబర్ నుంచి పోలవరం పనులు చేపడతామని చెబుతున్న నేపథ్యంలో.... ఒకవైపు మేఘాపై ఐటీ దాడులు... మరోవైపు కోర్టు కేసులు... అడ్డంకిగా మారడం ఖాయమంటున్నారు. మొత్తానికి మేఘాపై ఐటీ దాడుల ఎఫెక్ట్... కచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పనులపై పడటం ఖాయమంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/andhra-pradesh-polavaram-project-39-90167.html
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.