అమరావతి సాకారం సత్వరం!

Publish Date:Oct 21, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇక చకచకా సాగుతుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టత ఇచ్చారు. నిర్దిష్ట కాల వ్యవధిలో అమరావతి నిర్మాణం పూర్తి కావాలన్న కృత నిశ్చయంతో ఉన్న చంద్రబాబు.. మూడేళ్లలో అమరావతి పూర్తి చేయాలన్న విస్పష్ట ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇక అమరావతి పనులు పరుగులు పెడతాయనడంలో సందేహం లేదు. 

జగన్ ఐదేళ్ల అరాచక పాలనలో ఆయన అమరావతిపై కక్ష కట్టినట్లుగా వ్యవహరించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి నిర్మాణ పనులను ఆపేశారు. వైసీపీ నేతలు, మంత్రులు అయితే అమరావతిని శ్మశానంతో పోల్చారు. భ్రమరావతి అని ఎగతాళి చేశారు. గ్రాఫిక్స్ అంటూ ఎద్దేవా చేశారు. అదే రాజధాని అమరావతిలో చంద్రబాబు హయాంలో నిర్మాణమైన సచివాలయం, అసెంబ్లీలో కార్యకలాపాలను కొనసాగిస్తూనే అమరావతిపై దుష్ప్రచారం చేశారు.  2019లో ప్రభుత్వం మారడంతో పనులకు బ్రేక్ పడ్డాయి.ఆ ప్రదేశాలు పిచ్చిమొక్కలకు ఆలవాలమైంది.అమరావతి రాజధానికి పొలాలు ఇచ్చిన రైతులు ఇక్కడే నిర్మించాలని ఉద్యమం చేసారు.వైసీపీ ప్రభుత్వం అమరావతి కి వ్యతిరేకంగా మూడురాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చారు.విశాఖను చేస్తామన్నారు.చివరికి ఐదేళ్లు రాజధాని లేకుండా,రాకుండా గడిపేశారు.  2024లో  కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ అమరావతి పేరు బయటకువచ్చింది. కేంద్రం కూడా పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు  ముందుకు వచ్చింది. అయితే గత ఐదేళ్ల జగన్ నిర్వాకం కారణంగా అమరావతి మొత్తం పిచ్చిచెట్లు, తుప్పలతో జంగిల్ గా మారింది. దీంతో చంద్రబాబు సర్కార్ తొలుత యుద్ధ ప్రాతిపదికన జంగిల్ క్లయరెన్స్ పనులను చేపట్టింది. జంగిల్ క్లియరెన్స్ పూర్తి కావడంతో శనివారం అమరావతి పనులను పున: ప్రారంభించారు. 

సచివాలయం,అసెంబ్లీ,కొన్ని కార్యాలయాలు బాబు హాయాంలో గతంలో పూర్తిఅయ్యాయి. అధికారుల,ఉద్యోగుల క్వార్టర్స్ సగంలో ఆగిపోయాయి. మరికొన్ని నిర్మాణాలు చివరిదశలో ఆగిపోయాయి. రాజధాని కోసం 54వేల ఎకరాలను సేకరించామని సీఎం చంద్రబాబు చెప్పారు.దీనిలో రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూములు 30వేల ఎకరాలుపైగా ఉన్నాయి. గత ఐదేళ్లుగా రాజధాని రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను కూడా చంద్రబాబు క్లియర్ చేసారు. పోలవరం కొంచం ఆలస్యమవచ్చుగానీ అమరావతి విషయంలో ఎటువంటి జాప్యం ఉండదని చంద్రబాబు ఉద్ఘాటించారు. రహదారులు, ఇతర సంస్థల ఏర్పాటుతో పాటు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చేలా   ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సీఆర్డీఏ రాజధాని నిర్మాణ బాధ్యతలను చేపట్టనుంది. హైదరాబాద్ ను తలదన్నేలా, ప్రపంచ స్థాయి నగరంలో అమరావతిని నిర్మించాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు.  హైటెక్ సిటీ,సైబరాబాద్ నిర్మాణాలు చంద్రబాబు హయాంలోనే జరిగాయి.వాటికి దీటుగా అమరావతిని తీర్చిదిద్దే ఆలోచనలో ఆయన ఉన్నారు. 

మామూలుగా బాబు ఐదేళ్లలో అమరావతి, పోలవరం పూర్తిచేయాలని సీఎంకాగానే తలచారు. విశాఖ  ఆర్ధిక రాజధానిగా, సినీపరిశ్రమకు కేంద్రంగా తీర్చిదిద్దాలని భావించారు. అలాగే కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేసి వారినీ అభివృద్ధిలో భాగస్వాములు చేసే ఆలోచనలో ఉన్నారు.అమరావతి రాష్ట్రానికి సెంటర్ పాయింట్. రాజధానికి ఇక్కడే నిర్మిస్తే ప్రజలకు సౌకర్యాలతో పాటు అందుబాటులో ఉంటుందని చంద్రబాబు భావన.

అయితే బీజేపీ జమిలి ఎన్నికల బాటలో పయనిస్తుండటంతో ముందస్తు ఎన్నికలు తప్పవన్న నిర్దారణకు వచ్చిన చంద్రబాబు అందుకు అనుగుణంగా అమరావతి నిర్మాణ వ్యవధిని కుదించారు.  మూడేళ్లలో రాజధాని పూర్తికావాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా ముందుకు పోతున్నారు.అలాగే సూపర్ సిక్స్ హామీలను కూడా  జనవరి నుంచే అమలు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయి అత్యాధునిక రాజధాని మూడేళ్లలో సాకారం కావడం తథ్యమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే.
ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు.
అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో దేవతలు దీవించడానికి బదులు శపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో చిన్న వివాదం కూడా అతి పెద్ద రాద్ధాంతంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇలా వారు యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా దైవ ధిక్కారం, దైవ దూషణ ఉందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి పెద్ద వివాదంగా మారిపోతున్న పరిస్థితి.
పవన్ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే తెలంగాణ నుంచి ఎవరూ స్పందించలేదు కూడా. కానీ తీరిగ్గా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన వారం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పించడం విస్తుగొలుపుతోంది.
అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ అనుసరించిన విధానాలు, కక్షపూరిత రాజకీయం, రాష్ట్రంలోఅభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, సంక్షేమం పేరుతో అరకొర పందేరాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్ సర్కార్ కు గత ఎన్నికలలో జనం గట్టి బుద్ధి చెప్పారు. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
తెలుగు రాష్ట్రాలలో స‌ర్పంచ్ ప‌దవికి కూడా భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టేస్తున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వుల వేలంలో ఒక పంచయతీలో స‌ర్పంచ్ సీటు ఏకంగా కోటి రూపాయ‌లు ప‌లికిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవచ్చు.
నిన్న మొన్నటి వరకూ కాళేశ్వరం అవినీతిపైనే విమర్శలు గుప్పించి, ఆ అవినీతి వెనుక ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావే అంటూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్..అంటూ బాంబు పేల్చారు.
లోకేష్ త‌ల్లిచాటు బిడ్డ‌గా ఎదిగారు. ఆయ‌న ఎదిగిన విధం అత్యంత ఉదాత్తం. సంస్కార‌వంతం. ఎందుకంటే తండ్రి ప్రజా నాయకుడిగా చాలా చాలా బిజీ. దీంతో లోకేష్ ని అన్నీ తానై పెంచిన జిజియా బాయి భువ‌నేశ్వ‌రి. లోకేష్ లో ఒక మాన‌వ‌త్వం, మంచి, మ‌ర్యాద, పెద్దా, చిన్నల ప‌ట్ల చూపించాల్సిన క‌రుణ- జాలి- ద‌య- ప్రేమ‌- బాధ్య‌త‌ వంటి సుగుణాల‌ు ప్రోది అయ్యేలా పెంచి పెద్ద చేశారు భువ‌నేశ్వ‌రి అని చెప్ప‌డానికి ఎన్నో నిద‌ర్శ‌నాలు.
తాజాగా ఆయన కోనసీమలో కొబ్బరికాయల దిగుబడి తగ్గడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగలడమే కారణమన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదంగా మారి పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చాయి.
కాంగ్రెస్, బీజేపీల‌క‌న్నా కూడా ఈ క‌విత‌తోనే ఎక్కువ ఇబ్బంది కలుగుతోంది. పరువుపోతోందన్న మాట బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తోంది.
హరీష్ రావుపై తాన చేసిన కామెంట్లకు కౌంటర్లిచ్చే నాయకులను కవిత టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. హరీష్ కు మద్దతుగా నోరెత్తిన నేతలపై కవిత విమర్శలతో విరుచుకుపడటమే కాకుండా, వారి అవినీతి బాగోతాలు కూడా బయటపెడుతూ వారి నోళ్లు మూయించాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం అంటే.. కేటీఆర్ కు కష్టకాలం మొదలయ్యిందనే చెప్పాలంటున్నారు పరిశీలకులు. ఇప్ప‌టికే వ‌రుస ఓట‌ముల‌తో ఉక్కిరిబిక్కిరై ఉన్న కేటీఆర్ ఇప్పుడు ఈ కేసును ఎలా హ్యాండిల్ చేస్తార‌న్నది పార్టీ శ్రేణుల్లో ఆసక్తి, ఉత్కంఠ రేపుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.