నియంత పాలన నుంచి ప్రజలకు నిజమైన స్వాతంత్రం వచ్చింది : లోకేశ్

Publish Date:Jun 23, 2025

Advertisement

 

గత పాలకులు విధ్వంసం సృష్టించారని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేశ్ విమర్శించారు. ఏపీలో ఎన్డీయే కూటమి ఏడాది పాలన సందర్భంగా అమరావతిలో నిర్వహిస్తున్న సుపరిపాలన-తొలి అడుగు సదస్సులో లోకేశ్ మాట్లాడారు. వైసీపీ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఎక్కువ మొత్తంలో పింఛను ఇస్తున్నామని. తల్లికి వందనం పేరుతో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు. తొలి ఏడాదిలోనే డీఎస్సీ ద్వారా 16,300 పోస్టులు భర్తీ చేస్తున్నామని లోకేశ్ స్పష్టం చేశారు.పేదలకు చేయూత ఇచ్చేందుకే పీ-4 విధానం తీసుకొచ్చామని ఏ రాష్ట్రానికి వెళ్లినా పీ-4 విధానాన్ని ప్రశంసిస్తున్నారు.

పొగాకు, మిర్చి, మామిడి, కోకో రైతులను ఆదుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాక రాయలసీమకు అనేక పరిశ్రమలు వచ్చాయి. ఉత్తరాంధ్రకు టీసీఎస్‌, కాగ్రిజెంట్‌ సంస్థలను తీసుకొచ్చాం. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తోంది. అభివృద్ధిలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు దూసుకుపోతోందని మంత్రి వెల్లడించారు. వైసీపీ నేతలు ప్రజా సమస్యలు పట్టించుకోదు. ప్రశ్నిస్తే చాలు లాఠీ దెబ్బలు, అరెస్టులు వేధింపులు గురిచేసే వారని లోకేశ్ పేర్కొన్నారు. నియంత పాలన నుంచి ప్రజలకు నిజమైన స్వాతంత్రర్యం వచ్చిందని తెలిపారు. ఈ కార్య క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు

By
en-us Political News

  
ఏపీ మద్యం కుంభ కోణం కేసులో అరెస్ట్‌యిన వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రత్యేక వసతులు కల్పించడానికి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది.
హైదరాబాద్ వనస్థలిపురంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బోనాల పండుగకు తెచ్చుకున్న చికెన్, మటన్ బొటిని ఫ్రిజ్‌లో పెట్టుకుని తిని ఓకే కుటుంబానికి చెందిన 8 మంది అస్వస్థతకు గురుయ్యారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన రిటైర్డ్‌ ఐఏఎస్‌ ధనుంజయ్‌ రెడ్డి ఏసీబీ కోర్టు ఎదుట తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జైల్లో ఉన్న తన గురించి, బయట ఉన్న తన ఫ్యామిలీ గురించి తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ జడ్జి ముందు ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ వ్యాప్తంగా సంచలన సృష్టించిన వైసీపీ నేత అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు తదుపరి విచారణకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు అనుమతి ఇచ్చింది.
వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిని ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పేర్లు మార్పుపై ఏడుగురు మంత్రులతో ప్రభుత్వం కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేసింది.
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి సందడి చేశారు. పట్టణంలోని రాజగోపాలపురంలో టీచ్‌ ఫర్‌ చేంజ్‌ఫౌండేషన్‌ ద్వారా ఏర్పాటు చేసిన డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ను మంచు లక్ష్మి ప్రారంభించారు.
తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన జరిగింది.
జ‌గ‌న్ స్టైలే వేర‌బ్బా. చాలా మంది చంద్ర‌బాబే సంప‌ద సృష్టిలో టాప్ అంటారుగానీ అదంతా ఉట్టిది. ఇది కేవ‌లం రాష్ట్రానికి సంబంధించిన వ్య‌వ‌హారం. అదే సొంతంగా సంపాదించ‌డంలో జ‌గ‌న్ త‌ర్వాతే ఎవ‌రైనా.
భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావానికి కొంచెం అటూ ఇటుగా, జన్మించిన కురువృద్ద కమ్యూనిస్ట్ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ మృతితో భారత కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది.
ర్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా రెండవరోజు ఎలాంటి చర్చ లేకుండా వాయిదా పడ్డాయి.
తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఘం క్యూ కాంప్లెక్స-3 నిర్మాణానికి సాధ్యాసాధ్యాల పరిశీలనకు నిపుణుల కమిటీని వేయాలని తరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయించింది.
మ‌ద్య‌పాన నిషేధం అమలు చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో ఏకంగా మద్యం కుంభకోణం చేసి 3500 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని సిట్ అంటోంది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ వేసిన 305 పేజీల‌ ఛార్జ్ షీట్ లో ఈ స్కామ్ లో కీల‌క పాత్ర పోషించినది ఏ 1 రాజ్ కేసిరెడ్డి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.