ఏపీ ఉద్యోగుల తరలింపుకు బ్రేక్...?

Publish Date:May 6, 2016

Advertisement

 

ఈ జూన్ నెలాఖరు నాటికి ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్‌ నుంచి అమరావతికి ఉద్యోగుల్ని తరలించాలనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలకు మళ్లీ అవరోధం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఐఏఎస్ నుంచి అటెండర్ వరకూ ఎవరికీ అమరావతికి తరలివెళ్లేందుకు సుముఖంగా లేకపోవడంతో తరలింపు కొంతకాలం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా ప్రభుత్వం-ఉద్యోగ సంఘాల నేతల మధ్య తరలింపుపై అనేకమార్లు చర్చలు జరిగాయి. అయితే ఎన్నిసార్లు చర్చలు జరిగినా ఒక్కసారి కూడా తరలింపుపై స్పష్టత రాలేదు. చివరికి జూన్ 27వ తేదీలోగా సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగులంతా రాజధానికి తరలి రావాల్సిందేనంటూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వును జారీ చేసింది.

 

దీంతో వివిధ శాఖల అధిపతులు తమ శాఖ పరిధిలోని ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ అభిప్రాయ సేకరణలో ఇప్పటికిప్పుడు హైదరాబాద్‌ను వదిలి రావడానికి ఎవరూ సిద్ధంగా లేనట్టుగా తెలిసింది. కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఐఏఎస్‌ల దాకా భాగ్యనగరంపై మమకారాన్ని చంపుకోలేకపోతున్నారు. హైదరాబాద్ నుంచి కదలమంటే మంత్రులకు కూడా ఇష్టం లేదు. అందుకనే ఇటు మంత్రులైనా, అటు ఉన్నతాధికారులైనా తరలింపు అనేసరికి ఉద్యోగులతో కఠినంగా ఉండలేకపోతున్నారు. మంత్రులకు, విభాగాల అధిపతులకు తప్పదు కాబట్టి విజయవాడలో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని హైదరాబాద్-విజయవాడల మధ్య చక్కర్లు కొడుతున్నారు.

 

అటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా హైదరాబాద్ నుంచి అమరావతికి వస్తే తమకు ఎదురయ్యే ఇబ్బందులను మంత్రులకు, సీఎస్‌కు వివరిస్తున్నారు. భార్యా, భర్తలలో ఒకరు ప్రైవేటు ఉద్యోగి అయివుంటే విజయవాడ తరలింపు వల్ల తాము ఒంటరి వారమవుతామని వాపోతున్నారు. పలువురు ఉద్యోగులు కొత్త విద్యాసంవత్సరం కావడంతో వారి పిల్లలను కళాశాలల్లో చేర్పించారు. వారిని మళ్లీ విజయవాడలో చేర్పించాలంటే డోనేషన్లు, పైగా స్ధానికత అంశం పెద్ద ఇబ్బందిగా మారింది. ఇక్కడే నిర్మించుకున్న ఇళ్లు, ఆస్తులు అన్నింటిని వదిలి బెజవాడ రాలేక సగటు ఉద్యోగి తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నారు.

 

మరో ప్రధాన కారణం ఇప్పట్లో మంచి రోజులు లేకపోవడం..ఏప్రిల్ నెలాఖరుతో మంచి రోజులు అయిపోయాయని, మళ్లీ మంచిరోజులు కృష్ణా పుష్కరాల తరువాతేనని పండితులు చెబుతున్నారు. అమరావతికి శాశ్వతంగా తరలివెళుతున్నప్పుడు మంచి రోజులు లేకపోతే ఎలా? అని ఉద్యోగులు సంకోచిస్తున్నారు. తాత్కాలిక సచివాలయం పూర్తికాకపోయినా, హడావుడిగా రెండు గదులు పూర్తి చేయించి ప్రారంభోత్సవం చేయించారు. ఎందుకు..? మంచి ముహూర్తాలు లేవనే కదా..మరి మంచి రోజులు లేని సమయంలో ఉన్న ఊరొదిలి మరో ఊరికి శాశ్వతంగా వెళుతున్నప్పుడు ఎంత ఆలోచించాలి అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

 

మరో ప్రధాన భయం వరదలు. రాజధాని గ్రామాల్లో కొండవీటి వాగు విశ్వరూపం గురించి ఉద్యోగులందరికి తెలుసు మొన్నామధ్య కురిసిన భారీ వర్షాలకు కొండవీటి వాగు ఉప్పోంగటంతో రాజధాని ప్రాంతమంతా సుమారు వారం రోజుల పాటు జలమయమైపోయింది. దీంతో తెలిసి తెలిసి కష్టాలపాలవ్వడం దేనికని ఉద్యోగులు జంకుతున్నారు. అందుకే కనీసం వర్షాకాలం దాటేంత వరకు అయినా తమకు గడువు కావాలని కోరుతున్నారు . అటు ముఖ్యమంత్రి కూడా ఉద్యోగులు అమరావతికి తరలివెళ్లడానికి అనేక వరాలు ఇచ్చారు. వారానికి ఐదు రోజుల పనిదినాలు, 30 శాతం హెచ్ఆర్ఏ, ఉద్యోగుల బస, వసతి ఏర్పాట్లు...ఇలా చాలా చేశారు. కష్టాల్లో ఉన్నా అడిగినవన్నీ ఇచ్చాను. ఇంక నన్ను ఇబ్బంది పెట్టవద్దు అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగులతో మొరపెట్టుకున్నారు. మరి ఉద్యోగులు ఇప్పటికి రాకపోతుండటంతో చంద్రబాబు కఠినంగా వ్యవహరిస్తారా..? లేక ఉద్యోగుల కోరిక మేరకు మరి కొంతకాలం వాయిదా వేస్తారా ? అనేది వేచి చూడాలి.
 

By
en-us Political News

  
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.