Publish Date:Mar 12, 2024
ఏపీలో కమలం ఖాతా ఓపెన్ చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకోసమే తాత్సారం చేసి చేసి తెలుగుదేశం, జనసేన కూటమితో కలిసి నడిచేందుకు నిర్ణయించుకుంది. తెలుగుదేశం, జనసేన కూటమితో కలిసి అడుగులు వేయకుండా ఏపీలో జీరోయే అన్న విషయం బీజేపీ ఇష్టం లేకపోయినా అంగీకరించాల్సిన వాస్తవం. కావడంతో చివరి నిముషం వరకూ బెట్టు చేసి, సీట్ల బేరసారాల్లో తమ బలానికి మించి ఒకటి రెండు సీట్లైనా అదనంగా పొందాలన్న వ్యూహాన్ని అనుసరించింది. సరే బీజేపీ వ్యూహం ఫలించిందా లేదా అన్నది పక్కన పెడితే తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కూడా అడుగులు వేస్తుందన్న విషయంలో సందిగ్ధత తొలిగిపోయింది. ఇక ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీ ముందు ఉంది. ఏపీ బీజేపీలో నిన్న మొన్నటి వరకూ పోటీ చేయడానికి అభ్యర్థులు పెద్దగా కనిపించని పరిస్థితి. అయితే ఎప్పుడైతే తెలుగుదేశం, జనసేన కూటమితో పొత్తు కుదిరిందో.. ఇక ఆ పార్టీలో టికెట్ల కోసం పోటీ పడే ఆశావహుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. పొత్తుకు ముందు బీజేపీ రాష్ట్రంలో ఒంటరి పోరుకే మొగ్గు చూపుతోందన్న ప్రకటనలు వెలువడ్డాయి. ఆ సమయంలో పార్టీ తరఫున పోటీ చేయడానికి కాగడా పెట్టి వెతికినా అభ్యర్థులెవరూ కనిపించని పరిస్థితి ఉంది.
విశాఖ నుంచి పోటీ అంటూ గత కొన్నేళ్లుగా అక్కడే మకాం వేసి.. తన స్థాయిలో నానా రకాలుగా రాజకీయం చేసిన జీవీఎల్ కూడా ఒంటరి పోరు అనగానే పోటీకి వెనుకడుగు వేస్తున్నారని రాష్ట్ర బీజేపీ వర్గాలే అప్పట్లో చెప్పాయి. అయితే ఒక సారి పొత్తు కుదిరిందన్న వార్త వెలువడగానే.. నిన్న మొన్నటి వరకూ పోటీ అంటే ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు పార్టీ తరఫున పోటీ చేయడానికి టికెట్ల కోసం పార్టీ హైకమాండ్ ముందు క్యూ కడుతున్నారు.
ఇప్పుడు పొత్తు లో భాగంగా 10 అసెంబ్లీ,6 పార్లమెంటు స్థానాలకు పోటీ చేయడానికి బీజేపీ రెడీ అవుతోంది. అయితే ఎంత మంది ఆశావహులు పోటీకి తయారైనా.. పొత్తులో భాగంగా తమకు ఆమోదయోగ్యమైన వారినే పోటీలో నిలబెట్టాలని చంద్రబాబు ముందుగానే బీజేపీ హైకమాండ్ ను ఒప్పించడంతో ఏపీలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు కచ్చితంగా చంద్రబాబు ఆమోదించిన వారే అయి ఉంటారనడంలో సందేహం లేదు.
చంద్రబాబు ఈ షరతుతోనే పొత్తుకు అంగీకరించడానికి కారణం.. ఏపీ బీజేపీలో ఒక వర్గం ఈ ఐదేళ్లుగా జగన్ సర్కార్ తో అంటకాగింది. ఆ వర్గం జగన్ విధానాలను విమర్శించిన పాపాన పోలేదు. అదే సమయంలో తెలుగుదేశంపైనా, చంద్రబాబుపైనా విమర్శలు గుప్పించింది. మొత్తం మీద ఈ సారి పొత్తుల వల్ల ముందు ముందు తనకు కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ ఇబ్బందులు రాకుండా చంద్రబాబు అన్ని జాగ్రత్తలూ తీసుకునే ముందుకు అడుగు వేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/alliance-effect-aspirants-queue-in-ap-bjp-39-171943.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.